విజయవాడలో ఫుడ్ సప్లై చేస్తున్న డ్రోన్లు!

Continues below advertisement

విజయవాడ వరదల్లో సాంకేతికత సాయంతో వరద బాధితులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అందులో భాగంగా బుడమేరు పొంగి వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగించి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు అధికారులు. ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, గుంటూరు, విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వర్షం పడిందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాగార్జున సాగర్, పులిచింతల నుంచి నీరు విపరీతంగా వస్తోందని, మున్నేరు, బుడమేరు నుంచి నీళ్లు రావడంతో వరద ఎక్కువైందని పేర్కొన్నారు. కొల్లేరుకు నీరు వెళ్లే మార్గం గత ఐదేళ్ల పాటు సరిగా నిర్వహణ లేకపోవడంతో విజయవాడలోకి నీళ్ల వచ్చి చేరాయని తెలిపారు. సింగ్ నగర్ ప్రాంతానికి బోట్ లో వెళ్లి బాధితులను పరామర్శించాను. వారి కష్టాలు చూసి వెళ్లిపోవడం ఇష్టం లేక అక్కడి వారందరికీ న్యాయం చేసి నమ్మకం కలిగిచేందుకు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram