Puttaparthi : ప్రశాంతి నిలయానికి పోటెత్తిన భక్తులు

అనంతపురం జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు పర్యటకుల సంఖ్య పెరిగిపోయింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి సాయి మందిరానికి పర్యటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. బాబా శివైక్యం తర్వాత కొంత భక్తుల తాకిడి తగ్గినప్పటికీ.. నిదానంగా ఆ సంఖ్య పెరుగుతోంది. కరోనా కారణంగా భక్తులను ప్రశాంతి నిలయంలోకి అనుమతించలేదు. దీంతో దాదాపుగా భక్తులు ఎవరు పుట్టపర్తి రాలేకపోయారు. అయితే నిబంధనలు సడలించడంతో, పర్యటకులు ప్రశాంతి నిలయం సందర్శనార్థం వస్తుండడంతో పుట్టపర్తిలో సందడి వాతావరణం నెలకొంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola