Devineni vs Vasantha : మైలవరంలో పెరిగిపోతున్న పొలిటికల్ హీట్ | DNN | ABP Desam
మైలవరం రాజకీయాలు రోజుకు రోజుకు పొలిటికల్ హీట్ ను రగిలిస్తున్నాయి. నిన్నటి దాకా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు, మంత్రి జోగి రమేష్ కు మధ్య విబేధాలున్నాయనే అంశాన్ని టీడీపీ విమర్శనాస్త్రంగా మార్చుకోగా...ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ వర్సెస్ దేవినేని ఉమాగా రాజకీయం మారింది. ఉమను ఓడించేందుకు సీఎం జగన్ ఆదేశాలను అనుసరించి మైలవరంలో అభ్యర్థి ఎవరికైనా కలిసి పనిచేస్తామని ఎమ్మెల్యే వసంత స్పష్టం చేశారు.