CM Chandra babu Visited Flood Effected Area Late Night | ముంపు ప్రాంతాల్లో అర్ధరాత్రి సీఎం పరిశీలన
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCM Chandra babu Visited Flood Effected Area Late Night |
ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ రాత్రికి ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతుండగా....స్వయంగా సీఎం వచ్చి భరోసానిచ్చారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆదివారం ఉదయం అజిత్సింగ్నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు.. ఆదివారం అర్ధరాత్రి రెండోసారి అజిత్సింగ్నగర్తో పాటు కృష్ణలంకలో పర్యటించారు. అర్ధరాత్రి బోటులో ప్రయాణం భద్రతాపరంగా ఇబ్బందని చెప్పినా, సెల్ఫోన్, వీడియో కెమెరా లైట్ల వెలుతురులో అరగంట పాటు ఆ ప్రాంతంలో తిరిగారు. నీట మునిగిన ఇళ్లలోకి వెళ్లి ప్రజలను పరామర్శించారు. పలు కుటుంబాలకు ఆహార ప్యాకెట్లు అందజేశారు. హుద్హుద్ విలయానికి, నేటి విపత్తుకు వేర్వేరు పరిస్థితులు. ఇక్కడ నీరు సమస్యగా ఉంది. బోట్లలో వెళ్లి కొన్ని ఇళ్లే చూడగలుగుతున్నాం. సోమవారం రాత్రి వరకు అందరినీ బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు అన్నారు..!