Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్దేవ్తో సీఎం చంద్రబాబు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, యోగా గురు బాబా రామ్దేవ్తో కలిసి చారిత్రాత్మక ఉండవల్లి గుహల వద్ద ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీలో ఆయుర్వేద అభివృద్ధి, కూటమి ప్రభుత్వ ప్రణాళికలపై ఇందులో కీలక విషయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా బాబా రామ్దేవ్ అంతర్జాతీయ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న గొడవలు ముగించడానికి యుద్ధం కరెక్ట్ కాదని ఆయన హితవు పలికారు. ప్రపంచ శాంతి కోసం తనకు గాని అవకాశం వస్తే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీలను ఒకే వేదికపైకి తెచ్చి, వారందరితో కలిసి యోగా చేయిస్తానంటూ రామ్దేవ్ క్రేజీ కామెంట్స్ చేశారు. చంద్రబాబు.. చాలా క్రియేటివ్ ఇన్నోవేటివ్ ముఖ్యమంత్రి అని అన్నారు బాబా రామ్ దేవ్. అలాగే గత ముఫై ఏళ్లుగా తాను టెక్నాలజీని ప్రమోట్ చేస్తుంటే.. రామ్ దేవ్ బాబా యోగాని అంతటా ప్రమోట్ చేస్తున్నారని అన్నారు సీఎం చంద్రబాబు