Chandrababu Naidu About PM Modi | ఏపీ లో నేను..దిల్లీలో మోదీ... విజన్ 2047 | ABP Desam

Chandrababu Naidu About PM Modi |  మోదీ నేతృత్వంలో భారత్ 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్డీయే లోక్ సభా పక్ష నేతగా మోదీ పేరును ప్రతిపాదించగా ఆయన టీడీపీ తరఫున సమర్థించారు. ఎన్డీయేను అధికారంలోకి తేవడానికి మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని.. భారతదేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు దొరికారని అన్నారు. 

Chandrababu Naidu About PM Modi |

 ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న NDA కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో NDA ఎంపీలు, కీలక నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో పాటు జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్‌ మోదీని NDA పక్షనేతగా ప్రతిపాదించగా ఎంపీలు ఆమోదించారు. మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండడం చాలా గొప్ప విషయం అని రాజ్‌నాథ్ సింగ్‌ వెల్లడించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola