Minister Pinipe Viswaroop MLA Ponnada Satish ఇళ్లపై దాడులు | Konaseema | Amalapuram| ABP Desam

Minister Pinipe Viswaroop&MLA Ponnada ఇళ్లను అమలాపురంలో ఆందోళనకారులు తగులబెట్టేశారు. ఉదయం నుంచి ఆందోళనలు జరుగుతున్నా ప్రజాప్రతినిధుల నుంచి స్పందన లేకపోవటంతో పోలీసుల శ్రేణులను దాటుకుంటూ ఆందోళనకారులు హింసకు దిగారు. బస్సులు తగులబెట్టడం, వాహనాలను దగ్ధం చేయటం దగ్గర మొదలు పెట్టి మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల వైపు దూసుకెళ్లారు. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసినా...ప్రజాప్రతినిధుల నివాసాలకు నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే, మంత్రి కుటుంబసభ్యులు కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు, ప్రజాప్రతినిధుల అనుచరులు కుటుంబసభ్యులను సురక్షితంగా తరలించారు. ఫర్నిచర్ ధ్వంసమైంది. ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola