APPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP Desam

 గ్రూప్ 2 పరీక్షను యధాతథంగా నిర్వహిస్తున్నట్లు APPSC క్లారిటీ ఇచ్చింది. రోస్టర్ విధానంలో తప్పుల కారణంగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఆపాలని సీఎం చంద్రబాబు తరపున ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసినా APPSC ఛైర్ పర్సన్ అనురాధా అందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. MLC కోడ్ అమలులో ఉన్నందున గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకు మేలు చేకూర్చేలాంటి ఈ నిర్ణయాన్ని తాము అంగీకరించమన్న ఛైర్ పర్సన్ అనురాధా పరీక్షను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వానికి తిరిగి లేఖ రాశారు. పైగా గ్రూప్ 2 పరీక్ష రద్దు అంటూ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ లో ఏపీపీఎస్సీ సెక్రటరీ కేసు పెట్టారు. ఏపీపీఎస్సీ నిర్ణయంతో గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నారు. సాయంత్రం నుంచి ఎక్కడిక్కడ ఆందోళనలు చేస్తున్న అభ్యర్థులు వైజాగ్ ఇసుకతోట దగ్గర నేషనల్ హైవే పై ఆందోళనకు దిగారు. అభ్యర్థుల ఆందోళన దగ్గర పరీక్షా కేంద్రాల దగ్గర పోలీసులు భద్రతను పెంచారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola