తిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఓ రెడ్‌ బుక్‌ని చేతిలో పట్టుకుని కనిపించారు. పవన్ చేతిలో ఉన్న ఆ బుక్ ఏంటన్న ఇంట్రెస్టింగ్‌ డిబేట్ మొదలైంది. అయితే...దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. ఈ బుక్‌పై వారాహి డిక్లరేషన్‌ అని రాసుంది. తిరుమల లడ్డు వివాదం తరవాత పవన్ కల్యాణ్‌ సనాతన ధర్మ పరిరక్షణపై చాలా ఆవేశంగా మాట్లాడారు. ధర్మాన్ని రక్షించేందుకు ప్రత్యేకంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు నియమించాలని ప్రతిపాదించారు. దీనిపైనే జనసేన తరపున ఓ డిక్లరేషన్‌  రెడీ చేశారు పవన్ కల్యాణ్. తిరుపతిలో ఏర్పాటు చేయనున్న వారాహి సభలో ఈ డిక్లరేషన్‌ని వెల్లడించనున్నారు. ప్రస్తుతానికి ఈ డిక్లరేషన్‌ ఫైల్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఈ డిక్లరేషన్‌లో ఏముంటుందో అన్న ఉత్కంఠ మొదలైంది. తిరుమల లడ్డు వ్యవహారం మొదలయ్యాక పవన్ దూకుడు పెంచారు. సనాతన ధర్మానికి తాను అండగా నిలబడతానని, అందరూ కలిసి కట్టుగా పోరాడాలని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంపైనా తీవ్రంగా మండి పడ్డారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola