Komati Reddy Rajagopal Reddy Interview | నియంత పాలనకు వ్యతిరేకంగా మునుగోడు ఉపఎన్నిక వచ్చింది | ABP Desam
మునుగోడులో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. ప్రధాన పార్టీలు ఇంటింటికి తిరుగుతూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నేతలంతా మునుగోడులోనే మకాం వేశారు. ఐతే.. ఎవరెన్నిప్రయత్నాలు చేసినా మునుగోడు ప్రజలు తన వెంటే ఉన్నారని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మునుగోడు ప్రజలే కాదు.. యావత్ తెలంగాణ ప్రజల బతుకుల మార్పు కోసం ఈ ఉప ఎన్నిక అంటున్న BJP అభ్యర్థి రాజగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి ఇంటర్వ్యూ