Adilabad Tribals Problems : కుమ్రం భీం వారసులు..కష్టాలు తప్పని గిరిజనులు | DNN | ABP Desam
ప్రకృతి ఒడిలో ఉంటూ, ప్రకృతినే పూజిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు ఆదివాసీలు. జల్, జంగల్ , జమీన్, నినాదంతో నిజాం పాలన కాలంలో తమ హక్కుల కోసం నిజాం సర్కార్ తో పోరాడి అమరుడైన కుమ్రం భీమ్ వారసులు, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా తమ బతుకులు మారలేదని చెబుతున్నారు.అడవి తల్లే ఆవాసంగా జీవించే ఆదివాసీలు కనీస సౌకర్యాలు కోసం నేటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల బ్రతుకు చిత్రం పై ABP Desam ప్రత్యేక కథనం.