భారతదేశంలోనే అత్యంత రహస్యమైన కుల్ధారా సిటీ మిస్టరీ

Continues below advertisement

ఇళ్లు అలాగే ఉన్నాయి. ఇంట్లో వస్తువులు అలాగే ఉన్నాయి. పండిన పండటు.. వండిన వంటలు,  నీటి బిందెలు.. అన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఒక్క రోజు క్రితం వరకు జనాలతో హడావుడిగా ఉన్న ఆ ఊరు.. ఒక్క రాత్రిలో ఖాళీ అయిపోయింది. మనిషి కాదు కదా.. కనీసం పురుగు కూడా అలికిడి లేని నిర్మాణుష్య గ్రామంగా, ఘోస్ట్ సిటీగా మారిపోయింది. ఇప్పటివరకు ఎంతోమంది సైంటిస్టులకి కూడా రాత్రికి రాత్రి ఆ ఊరి జనం ఏమైపోయారు? ఎక్కడికిపోయారు? ఎలా మాయం అయ్యారు? అనేది అర్థం కాని మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ ఊరి పేరు చెబితే.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతారు. అదో శాపగ్రస్తమైన ఊరని, అక్కడికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న భూతాలు చంపేసి శవాలని కూడా మాయం చేస్తాయని బలంగా నమ్ముతారు. కానీ నిజంగా ఆ ప్రాంతంలో అలాంటి భూతాలు, దెయ్యాలు ఉన్నాయా..? వందల ఏళ్ల క్రితం ఆ ఊరి జనాలని కూడా ఆ భూతాలే మాయం చేశాయా..? అసలు ఆ ఊరి మిస్టరీ ఏంటి? పదండి ఈ రోజు మిస్టరీ టూ హిస్టరీలో తెలుసుకుందాం. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola