Mandakrishna Madiga comments on Kadiyam Srihari: భవిష్యత్తులో ఏదో ఒక రోజు కడియం శ్రీహరి రిజర్వేషన్ నిరూపించి అంబేద్కర్ విగ్రహం ఎదుట ముక్కు నేలకు రాయిస్తానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి కులంపై అనుమానం వ్యక్తం చేసిన తర్వాత తమకు అనుమానాలు కలుగుతున్నాయని మందకృష్ణ మాదిగ అన్నారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. కడియం శ్రీహరి కూతురు రిజిస్టర్ వివాహం చేసుకున్నారా లేదా హిందూ వివాహ చట్ట ప్రకారం చేసుకున్నారా అని ప్రశ్నించారు. లేక ముస్లిం వివాహ చట్ట ప్రకారం నిఖా చేసుకున్నారా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లిం వివాహ చట్ట ప్రకారం కావ్య వివాహం చేసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ ఎలా వర్తిస్తుందని ఆయన ప్రశ్నించారు. అదే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరి విశ్వాసాలను వారు గౌరవిస్తూ వారి వారి రిజర్వేషన్ల ప్రకారం వెళ్లవచ్చని మందకృష్ణ మాదిగ గుర్తు చేశారు. 


హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని వివాహం చేసుకుంటే రెండు బుక్కుల్లో సంతకాలు చేస్తారని ఒకటి ఎరుపు, ఒకటి ఆకుపచ్చ కలర్ అని మంద కృష్ణ మాదిగ అన్నారు. ముస్లిం లా ప్రకారం పెళ్లి చేసుకుంటే మతమార్పిడి జరిగినట్టేనని మందకృష్ణ అన్నారు. కడియం శ్రీహరికి నీతి, నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే కడియం శ్రీహరి తన కూతురుకు రిజిస్టర్ మ్యారేజ్ చేశారా, ముస్లింల ప్రకారం మ్యారేజ్ చేశారా అనేది చెప్పాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ చెల్లుతుందా అనేది తేలుతుందని మందకృష్ణ మాదిగ అన్నారు. ముస్లిం చట్ట ప్రకారం వివాహం జరిగితే ఎస్సీ సర్టిఫికేట్ వర్తించదని మందకృష్ణ మాదిగ చెప్పారు. భారత రాజ్యాంగం చెబుతుందని చెప్పారు. కడియం శ్రీహరి ఎస్సీ కాదని రేవంత్ రెడ్డి అన్నప్పుడు కడియం కావ్య ఎస్సీ ఎలా అవుతుందన్నారు. 


కావ్య దొంగ సర్టిఫికెట్ పెట్టుకొని వచ్చినట్టేనని ఆ సర్టిఫికెట్ రద్దు అవుతుందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఇవి తేలితే వరంగల్ పార్లమెంటు నుండి పోటీ చేసే అర్హత కావ్యకు ఉందా లేదా అనేది తెలుస్తుందని మందకృష్ణ మాదిగ అన్నారు. మతం మారితే కులం మారుతుందా... మారదా అని కడియం శ్రీహరి కాంగ్రెస్ పెద్దలను అడగాలని మందకృష్ణ మాదిగ సూచించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాలే రిజర్వేషన్ల గురించి చెబుతున్నాయని కృష్ణ మాదిగ గుర్తు చేశారు. హిందూ విశ్వాసాల ప్రకారం కొనసాగిన దళితులకే రిజర్వేషన్లు వర్తిస్తాయని మందకృష్ణ మాదిగ అన్నారు. మందకృష్ణ మాదిగ కు కడియం పై కోపం, ఆవేదన,ఆవేశంతో మాట్లాడడం లేదని చట్టం గురించి మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. కావ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు, హిందూ వివాహ చట్ట ప్రకారమైతే ఆమె భర్తను ఏ గుడిలో పెళ్లి చేసుకున్నారు, ముస్లిం వివాహ చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే కావ్య ఎక్కడ పెళ్లి చేసుకుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 


కావ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది అనేదానికంటే, కావ్య ముస్లిం మ్యారేజ్ చేసుకుందనే అనుమానాలు ఉన్నాయని మందకృష్ణ మాదిగ అన్నారు. కడియం శ్రీహరి 40 ఏళ్లు దళితుల అవకాశాలను దోచుకున్నాడని ఆరోపించారు. కడియం శ్రీహరి రిజర్వేషన్ల దోపిడి  దొంగ అని మందకృష్ణ మాదిగ అన్నారు. నిన్నటి వరకు బైండ్ల అనుకున్నానని రేవంత్ రెడ్డి అన్న తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడింది బయటపడ్డ తర్వాత కడియం బైండ్ల కాదని తెలిసిందని ఆయన అన్నారు. నలభై ఏళ్లు కడియం శ్రీహరి దొంగ ఎస్సీ సర్టిఫికెట్లతో అవకాశాలను దోచుకున్నారని, మరోసారి తన కూతురు నలభై ఏళ్లు దోచుకునే విధంగా కడియం శ్రీహరి చేస్తున్నారని మందకృష్ణ మాదిగ అన్నారు.