Telangana 10th Class results 2026 | తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణత సాధించగా.. అమ్మాయిలే పైచేయి సాధించారు. గత ఏడాదితో పోల్చితే రెండు శాతానికి ఈ ఏడాది ఫలితాల్లో రాష్ట్రంలోని గ్రామీణ జిల్లాలు అద్భుత ప్రదర్శన కనబరచగా, పట్టణ ప్రాంతాలు ముఖ్యంగా రాజధాని జిల్లా వెనుకబడి పోయింది. ములుగు జిల్లా 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఆ తర్వాతి స్థానాల్లో నాగర్ కర్నూల్ (99.03 శాతం), నిర్మల్ (98.96 శాతం), జగిత్యాల (98.87 శాతం) జిల్లాలు నిలిచి టాప్-4లో నిలిచాయి. అధికారిక వెబ్సైట్ https://results.bse.telangana.gov.in/ , https://results.bsetelangana.org/ లో విద్యార్థులు తమ రోల్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
ప్రభుత్వం విడుదల చేసిన అనుబంధ నివేదిక ప్రకారం.. మెజారిటీ జిల్లాలు 95 శాతానికి పైగా ఉత్తీర్ణతను సాధించాయి. మహబూబాబాద్ (98.81%), సంగారెడ్డి (98.69%), సూర్యాపేట (98.60%), కరీంనగర్ (98.57%), హన్మకొండ (98.56%), మరియు నల్గొండ (98.47%) జిల్లాలు టాప్-10 జాబితాలో నిలిచాయి. విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉన్న రంగారెడ్డి జిల్లా 91.25% ఉత్తీర్ణత సాధించగా, వికారాబాద్ (90.58%), భద్రాద్రి కొత్తగూడెం (89.23%) జిల్లాలు జాబితాలో కింది వరుసలో ఉన్నాయి.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు - మార్చి 2026 (జిల్లాల వారీగా ఉత్తీర్ణత వివరాలు)
| జిల్లా పేరు | హాజరైన విద్యార్థులు | ఉత్తీర్ణులైన వారు | పాస్ శాతం | |
| 1 | ములుగు | 3287 | 3264 | 99.30 |
| 2 | నాగర్ కర్నూల్ | 10641 | 10538 | 99.03 |
| 3 | నిర్మల్ | 9743 | 9642 | 98.96 |
| 4 | జగిత్యాల | 12687 | 12544 | 98.87 |
| 5 | మహబూబాబాద్ | 8152 | 8055 | 98.81 |
| 6 | సంగారెడ్డి | 24573 | 24252 | 98.69 |
| 7 | సూర్యాపేట | 12351 | 12178 | 98.60 |
| 8 | కరీంనగర్ | 13137 | 12949 | 98.57 |
| 9 | హన్మకొండ | 12065 | 11891 | 98.56 |
| 10 | నల్గొండ | 19667 | 19366 | 98.47 |
| 11 | జయశంకర్ భూపాలపల్లి | 3541 | 3483 | 98.36 |
| 12 | యాదాద్రి భువనగిరి | 8918 | 8766 | 98.30 |
| 13 | సిద్దిపేట | 15325 | 14995 | 97.85 |
| 14 | నారాయణపేట | 8306 | 8125 | 97.82 |
| 15 | రాజన్న సిరిసిల్ల | 7310 | 7145 | 97.74 |
| 16 | పెద్దపల్లి | 7488 | 7316 | 97.70 |
| 17 | జనగామ | 6443 | 6292 | 97.66 |
| 18 | కామారెడ్డి | 13119 | 12787 | 97.47 |
| 19 | వనపర్తి | 7210 | 7027 | 97.46 |
| 20 | మంచిర్యాల | 9684 | 9413 | 97.20 |
| 21 | ఆదిలాబాద్ | 10875 | 10538 | 96.90 |
| 22 | మెదక్ | 11232 | 10853 | 96.63 |
| 23 | వరంగల్ | 9485 | 9034 | 95.25 |
| 24 | మేడ్చల్ | 48855 | 46531 | 95.24 |
| 25 | ఖమ్మం | 16958 | 16131 | 95.12 |
| 26 | మహబూబ్ నగర్ | 13199 | 12482 | 94.57 |
| 27 | నిజామాబాద్ | 24365 | 22961 | 94.24 |
| 28 | కొమురం భీమ్ ఆసిఫాబాద్ | 6932 | 6527 | 94.16 |
| 29 | జోగులాంబ గద్వాల | 8037 | 7549 | 93.93 |
| 30 | రంగారెడ్డి | 52946 | 49217 | 92.96 |
| 31 | వికారాబాద్ | 13482 | 12302 | 91.25 |
| 32 | భద్రాద్రి కొత్తగూడెం | 12703 | 11506 | 90.58 |
| 33 | హైదరాబాద్ | 74099 | 66115 | 89.23 |
| మొత్తం విద్యార్థులు | 516815 | 491774 | 95.15 |
వెనుకబడిన హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా ఈ ఏడాది ఫలితాల్లో చివరి స్థానంలో (33వ స్థానం) నిలిచింది. ఇక్కడ మొత్తం 74,099 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 89.23% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అన్ని జిల్లాల్లోనూ బాలుర కంటే బాలికలే అత్యుత్తమ ఫలితాలు సాధించడం విశేషం. మొత్తం మీద రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 95.15% గా నమోదైంది. ఈ గణాంకాలు ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న విద్యా ప్రమాణాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైన చివరి 5 జిల్లాలు
హైదరాబాద్ జిల్లా: 89.23% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో (33వ స్థానం) నిలిచింది. ఇక్కడ మొత్తం 74,099 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 66,115 మంది పాస్ అయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: 90.58% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 32వ స్థానంలో ఉంది. ఇక్కడ 12,703 మందికి గాను 11,506 మంది ఉత్తీర్ణత సాధించారు.
వికారాబాద్ జిల్లా: 91.25% ఉత్తీర్ణతతో ఈ జిల్లా 31వ స్థానంలో నిలిచింది. మొత్తం 13,482 మంది విద్యార్థుల్లో 12,302 మంది ఉత్తీర్ణులు కావడంలో విజయం సాధించారు.
రంగారెడ్డి జిల్లా: 92.96% ఉత్తీర్ణతతో 30వ స్థానంలో నిలిచింది. ఇక్కడ రాష్ట్రంలోనే రెండో అత్యధిక సంఖ్యలో (52,946 మంది) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
జోగులాంబ గద్వాల జిల్లా: 93.93% ఉత్తీర్ణతతో జాబితాలో కింద నుండి ఐదవ స్థానంలో అంటే 29వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 8,037 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 7,549 మంది పాస్ అయ్యారు.
