అన్వేషించండి

Telangana News: స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద గృహ విప్లవం.. దేశానికి తెలంగాణ మార్గదర్శకం

Indiramma Housing Scheme | తెలంగాణ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గతంలో మొదలుపెట్టిన ఇండ్లకు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో 5 లక్షల ఆర్థిక సాయంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు.
  • మొదటి విడతలో 4 లక్షల ఇళ్లకు పైగా మంజూరు, లక్ష ఇళ్లు పూర్తయ్యాయి.
  • జూన్ 1న రెండో విడత ప్రారంభం, 2.5 లక్షల ఇళ్లకు పునాది.
  • పాత పథకాల లబ్ధిదారులకు కూడా సొంత ఇంటికి ఆర్థిక సహాయం.

హైదరాబాద్: ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదల సొంతింటి కలలను నెరవేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఉచితంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాగుతున్న ఈ పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాకుండా, పేద కుటుంబాల జీవితాలను మార్చేసే ఒక సామాజిక ఉద్యమంగా మారిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచనలు, సూచనల మేరకు మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. గతేడాది ఫిబ్రవరి మూడో వారంలో నారాయణపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయగా, కేవలం 13 నెలల కాలంలోనే లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో రెండు నెలల్లో ఇంకో 2 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఆర్థిక విజయవంతమైన ప్రణాళిక దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని చెప్పారు.

Also Read: KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్

జూన్ 1న రెండో విడత ప్రారంభం.. కొత్తగూడలో సామూహిక గృహప్రవేశాలు
ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండవ విడత కార్యక్రమానికి జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా పునాది పడనుంది. అలాగే కొత్తగూడలో జరిగే సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. రెండో విడతలో 2.5 లక్షల ఇళ్ల మంజూరుతో కలుపుకుని, రెండు విడతల్లో కలిపి ఒక్కో నియోజకవర్గానికి 5500 నుండి 6500 ఇళ్లను కేటాయించినట్లు అవుతుందని మంత్రి పొంగులేటి వివరించారు. ఐటీడీఏ (ITDA) పరిధిలోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా మరో 500 నుండి 1500 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.

ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో 2.50 లక్షల ఇళ్లకు కలిపి మొత్తం 3.50 లక్షల ఇళ్ల మంజూరుకు పరిపాలనా అనుమతులు లభించాయి. మొదటి విడతలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, మరింత పటిష్టంగా రెండో విడతను అమలు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిమిత నిధులతోనే గృహ నిర్మాణాలు చేపడుతుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం సొంత నిధులతో పేదవాడి ఇళ్లకు పూర్తి భరోసా ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం కేవలం రూ.72 వేలు, పట్టణాల్లో రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఒక్కో లబ్దిదారునికి రూ.5 లక్షల భారీ సహాయాన్ని అందిస్తోందని స్పష్టం చేశారు.

Also Read: Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు

పాత పథకాల లబ్ధిదారులకు కూడా ఆర్థిక సహాయం
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి 2013 వరకు అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్లు మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఈ రెండో విడతలో ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అలాగే 2023 లో గృహలక్ష్మి పథకంలో ఇళ్లు మంజూరై పూర్తి చేసుకోలేకపోయిన వారికి కూడా ఈ విడతలో నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు ఇస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఇందిరమ్మ పథకంలో కేవలం రూ.20 వేల వరకు ఆర్థిక సాయం పొంది ఆగిపోయిన వారికి కూడా ఈ విడతలో ఇళ్ల మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.

Frequently Asked Questions

తెలంగాణలో పేదల సొంతింటి కలలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేస్తోంది?

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది.

ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో ఎన్ని ఇళ్లు మంజూరు చేయబడ్డాయి మరియు ఎన్ని పూర్తయ్యాయి?

మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేశారు. కేవలం 13 నెలల కాలంలో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయింది.

ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండవ విడత ఎప్పుడు ప్రారంభమవుతుంది మరియు ఎన్ని ఇళ్లను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?

రెండవ విడత కార్యక్రమం జూన్ 1న ప్రారంభమవుతుంది. రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం పేదలకు అందించే ఆర్థిక సహాయం, కేంద్ర ప్రభుత్వం అందించే సహాయంతో పోలిస్తే ఎలా ఉంది?

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలు, పట్టణాల్లో రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షల భారీ సహాయాన్ని సొంత నిధులతో అందిస్తోంది.

గతంలో మంజూరై, అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందుతుందా?

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి 2013 వరకు అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇళ్లు మంజూరై, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఈ రెండో విడతలో ఆర్థిక సాయం అందిస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఒమన్‌ తీరంలో నౌకపై జరిగిన దాడిలో విశాఖ వాసి మృతి
ఒమన్‌ తీరంలో నౌకపై జరిగిన దాడిలో విశాఖ వాసి మృతి
Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
Kalvakuntla Kavitha New Party: TRS పేరుపై వందల అభ్యంతరాలు - అదే పేరుతో మరో రెండు పార్టీలు కూడా - కవితకు షాక్ తప్పదా?
TRS పేరుపై వందల అభ్యంతరాలు - అదే పేరుతో మరో రెండు పార్టీలు కూడా - కవితకు షాక్ తప్పదా?
TG Inter Supply Results: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్స్
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్స్
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Actor Karthik : గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
Vastu Tips Telugu: ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Embed widget