Two Accused Rekky At MLA Raja Singh House: బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు ఆదివారం రెక్కీ నిర్వహించడం కలకలం రేపింది. ఇంటి పరిసరాల్లో సంచరిస్తుండగా తొలుత అంతగా పట్టించుకోని స్థానికులు.. తర్వాత అదే పనిగా అక్కడే ఉండడంతో అనుమానంతో చెక్ చేశారు. వారి వద్ద సెల్ ఫోన్లలో గన్, బుల్లెట్లు, రాజాసింగ్ ఫోటోలు కనిపించాయి. దీంతో షాకైన వారు ఇద్దరిని పట్టుకుని మంగళహాట్ పోలీసులకు అప్పగించారు. నిందితులను ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా గుర్తించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడానికి కారణాలేంటి.?. ఆయన హత్యకు ఏమైనా కుట్ర పన్నారా.? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, రాజాసింగ్ హిందుత్వ అంశంలో తన బలమైన గళం వినిపిస్తున్నారు. గతంలోనూ ఆయనకు పలు బెదిరింపు కాల్స్ రాగా పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో రాజాసింగ్ హత్యకు పన్నిన పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు.


రెక్కీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు


కాగా, తన ఇంటి వద్ద అనుమానితులు రెక్కీ నిర్వహించడంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఫోటోలు తీసి ముంబైకి పంపిస్తున్నారని అన్నారు. శనివారం రాత్రి నలుగురు అనుమానితులు వచ్చారని.. అందులో ఇద్దరు పారిపోగా మరో ఇద్దరిని స్థానికులు పట్టుకున్నారని చెప్పారు. అనుమానితుల సెల్‌ఫోన్‌లో మా ఇంటి ఫోటోస్, నా ఫోటోస్ ముంబైలో ఉన్న కొందరికి పంపినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. గతంలో కూడా తమ ఇంటి వద్ద ఐఎస్ఐ తీవ్రవాదులు రెక్కీ నిర్వహించారని అన్నారు.


Also Read: Mallik Tej: యూట్యూబర్‌, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై అత్యాచార కేసు - పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు