'టి-2' అనే ఆడ పులిని అటవీ శాఖ అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు. ఈ పులి నలుగురు మహిళలను చంపి స్థానికులకు భయాందోళనలు సృష్టించింది.
Tiger Trapped In Cage: నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
Chandrapur Forest Officials Capture T2 Tigress | తూనికాకు (బీడీ ఆకులు) సేకరిస్తున్న మహిళలపై దాడి చేసి నలుగురి ప్రాణాలు తీసిన ఆడ పులిని అధికారులు మహారాష్ట్ర చంద్రాపూర్ అటవీ ప్రాంతంలో బంధించారు.

- నాలుగు మహిళలను చంపిన 'టి-2' పులిని అధికారులు పట్టుకున్నారు.
- తూనికాకులు సేకరిస్తున్న మహిళలపై పులి దాడి చేసింది.
- ప్రత్యేక బృందాలు కెమెరాలు, సీసీటీవీ ఆధారంగా పులిని పట్టుకున్నాయి.
- పులి పట్టుబడటంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
చంద్రపూర్: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా అటవీ ప్రాంత ప్రజలను వణికించిన 'టి-2' అనే ఆడ పులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు చిక్కింది. ఈ ప్రాంతంలో నలుగురు మహిళలను చంపి గత కొన్ని రోజులుగా స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ క్రూర మృగాన్ని గుంజవాహి అటవీ ప్రాంతంలో అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు.
మూడు రోజుల క్రితం అటవీ ప్రాంతంలో తూనికాకు (బీడీ ఆకులు) సేకరిస్తున్న మహిళా కూలీలపై ఈ పులి ఆకస్మికంగా దాడి చేసింది. ఈ ఘోర దాడిలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అటవీ పరిసర గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవగా, స్పందించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు పులిని బంధించేందుకు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ట్రాప్ కెమెరాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పులి సంచారాన్ని పక్కాగా గుర్తించి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఎట్టకేలకు పులిని మత్తుమందు ఇచ్చి సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.
మనుషుల్ని చంపుతున్న పులి పట్టుబడటంతో చంద్రపూర్ జిల్లా గుంజవాహి అటవీ ప్రాంత గ్రామ ప్రజలు పెద్ద గండం గడిచిందంటూ ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న 'టి-2' పులిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అటవీ శాఖ అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు.
పులి దాడిలో నలుగురు తూనికాకు కూలీలు మృతి
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిందేవాహి తాలూకాలోని గుంజవాహి-పవన్పార్ ప్రాంతంలో తూనికాకులు సేకరించడానికి అడవికి వెళ్లిన 13 మంది మహిళలపై పులి దాడి చేసింది. వారిలో నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. అటవీ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే, ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనకు కారణమైంది.

చంద్రపూర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఒకేసారి పులి దాడిలో నలుగురు మహిళలు మరణించడం ఇదే మొదటి ఘటన. చంద్రపూర్ జిల్లాలోనీ గుంజవాహి- పవన్పార్ రహదారిపై ఉన్న ఖైరిచక్ అటవీ ప్రాంతంలో ఈ పులి దాడి ఘటన జరిగింది. మృతులు భట్టి మొహల్లా వార్డ్ నెం. 1, గుంజవాహి గ్రామానికి చెందినవారని గుర్తించారు.
ఈ మృతుల పేర్లు 1) పద్యం తాత మోహర్లే - 45,
2) అనితా దాదాజీ మోహర్లే - 46,
3) సంగీత సంతోష్ చౌదరి - 40,
4) సునీత కౌశిక్ మోహర్లే - 35 లుగా గుర్తించారు. ఈ పులి దాడి ఘటన విషయం తెలుసుకున్న తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాల్లోనూ ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
చంద్రపూర్ జిల్లాలో ప్రజలను భయపెట్టిన 'టి-2' పులికి ఏమైంది?
పులి దాడిలో ఎంత మంది మహిళలు మరణించారు?
తూనికాకులు సేకరించడానికి అడవికి వెళ్లిన 13 మంది మహిళలపై పులి దాడి చేయగా, వారిలో నలుగురు మరణించారు.
పులిని ఎలా పట్టుకున్నారు?
ప్రత్యేక బృందాలు ట్రాప్ కెమెరాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పులి సంచారాన్ని గుర్తించి, మత్తుమందు ఇచ్చి సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.
పులి దాడి ఘటన ఏ ప్రాంతంలో జరిగింది?
ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సిందేవాహి తాలూకాలోని గుంజవాహి-పవన్పార్ ప్రాంతంలో, ఖైరిచక్ అటవీ ప్రాంతంలో జరిగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















