<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>nizamabad</title><atom:link href="https://telugu.abplive.com/nizamabad/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Fri, 11 Sep 2026 20:13:32 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/sons-of-adilabad-khichdi-vendors-defy-odds-to-secure-mbbs-seats-with-neet-rank-258443</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/sons-of-adilabad-khichdi-vendors-defy-odds-to-secure-mbbs-seats-with-neet-rank-258443#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 07:39:17 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shailender ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/sons-of-adilabad-khichdi-vendors-defy-odds-to-secure-mbbs-seats-with-neet-rank-258443</guid><description><![CDATA[&lt;p&gt;వారిది మధ్య తరగతి కుటుంబం.. కుటుంబ పోషణ కోసం వారు కిచిడి బండి నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు కష్టపడి కిచిడి అమ్ముతూ.. తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. తండ్రికి చేదోడు వాదోడుగా కిచిడి బండి వద్ద ఉంటూ ఆ కుమారులు ఇంటర్ పూర్తి చేశారు. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించడానికి నీట్ పరీక్ష రాశారు. కష్టాన్ని నమ్ముకున్న ఆ యువకులు నీట్ లో ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ సీటు సంపాదించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఫుట్&amp;zwnj;పాత్ పై కిచిడి అమ్ముతూ నీట్ లో ర్యాంకు తెచ్చుకుని, ఎంబిబిఎస్ సీటు సంపాదించిన మహమ్మద్ బిలాల్, మహమ్మద్ షకిబ్ లపై ABP Desam Exclusive Story.&lt;/p&gt;
&lt;p&gt;ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ జావిద్, మహమ్మద్ ఆసిఫ్ అనే ఇద్దరు అన్నదమ్ముల కుమారులు మహమ్మద్ షకీబ్, మహమ్మద్ బిలాల్ ఈ ఇద్దరు నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ సీటు సాధించారు. వీరు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల ముందు కిచిడి బండి నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆసిఫ్, జావిద్ ఇద్దరు అన్నతమ్ముళ్లు గత కొన్నేళ్లు గా కిచిడి బండి నడిపిస్తూ తమ పిల్లల్ని పక్కనే ఉన్న జడ్పీ పాఠశాలలో చదివించారు. పదవ తరగతి వరకు షకీబ్, బిలాల్ ఇంద్రవెల్లి జడ్పీ పాఠశాలలో చదువు పూర్తి చేసి స్థానికంగానే ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. చదువుకుంటూనే రోజు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ కిచిడి బండి నడుపుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/456796c7a25dbed0739947a43b1603991788919493219233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;రెండేళ్లు నీట్ కోసం ప్రిపేర్ అయ్యారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి నీట్ లో ర్యాంకు సాధించి.. ఎంబిబిఎస్ సీటు (MBBS Seat) సంపాదించారు. మహమ్మద్ ఆసిఫ్ కుమారుడు మహమ్మద్ బిలాల్ కు నీట్ లో ఆల్ ఇండియా ర్యాంకు 120325.. స్టేట్ లొ 1788 ర్యాంక్ రాగా. అలాగే మహమ్మద్ జావిద్ కుమారుడు మహమ్మద్ షకీబ్ &amp;nbsp;నీట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 147283, రాగా.. స్టేట్ లో 2583 ర్యాంక్ సాధించారు. ఫస్ట్ ఫేజ్ లో కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశాలలో మహమ్మద్ షకిబ్ కు ఎంబిబిఎస్ సీటు రాగా, నిర్మల్ మెడికల్ కళాశాలలో మహమ్మద్ బిలాల్ కు ఎంబిబిఎస్ సీటు వచ్చింది. త్వరలో ఈ ఇద్దరు సెకండ్, థర్డ్ ఫేజ్ తరువాత తరగతులకు హాజరుకానున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/d3986e90579e7e0ff90d0891a2d8e8c21788919621797233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఇద్దరు అన్నదమ్ముల కుమారులు ఎంబిబిఎస్ సీటు సాధించడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడ్డ దానికి ఫలితం దక్కిందన్నారు. వీరికి ఎంబిబిఎస్ సీటు రావడంతో ఆదిలాబాద్ మైనార్టీ విభాగం నాయకులు వారిని సత్కరించారు. ప్రభుత్వ విప్ మహమ్మద్ షబ్బీర్ అలీతో పాటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మాజీ మంత్రి జోగు రామన్న, సైతం శాలువాతో సత్కరించి అభినందించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/1936bd53623c5ad790ea23b2190e388e1788919655067233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మహమ్మద్ జావిద్, మహమ్మద్ ఆసిఫ్ ఈ ఇద్దరు అన్నదమ్ములు, కిచిడి బండి నడిపి తమ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల కుమారులు మహమ్మద్ షకీబ్, మహమ్మద్ బిలాల్ వారికి చేదోడు వాదొడుగా ఉంటూ.. కష్టపడి చదివి ఎంబిబిఎస్ లో ఇద్దరు సైతం సీటు సంపాదించారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని, తాము పడ్డ కష్టానికి తమ తల్లిదండ్రుల కష్టానికి ఫలితం దక్కిందని మహమ్మద్ షకీబ్, మహమ్మద్ బిలాల్ మరియు వారి తండ్రులు స్థానికులు ఏబీపీ దేశంకు వెల్లడించారు. కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు. స్థానికులు, వారి టీచర్లు ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/57a0b99db9c33f9a3edd7fb5cdaa64501788919686153233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;వీరి కష్టం అంతా ఇంతా కాదని, ఉదయం 3:30 గంటలకు లేచి కిచిడి తయారు చేసి 5:30గంటలకు అల్లాహు అక్బర్ అంటూ నమాజ్ చేసి 6 గంటల కళ్ల రెడీ అయి.. జడ్పి పాఠశాల ముందు రోడ్డుపై కిచిడి బండి పెట్టీ టిఫిన్ విక్రయిస్తారు. స్థానికులు ఈ ఇద్దరు అన్నదమ్ములను జావిద్ మాము, ఆసిఫ్ మాము అని ప్రేమగా పిలుస్తుంటారు. వారి కుమారులు షకీబ్ , బిలాల్ ఇద్దరు కూడా హాలిడే రోజు లేదా వారు లేని సమయాల్లోనూ, లేదా అంగడి రోజు బిజిగా ఉన్న సమయంలో ఈ బండి నడుపుతూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ పని చేస్తారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/ee61dd311f7035f81d0fde737f187a951788919715897233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;కిచిడి అమ్మడం అయిపోయాక.. బయట ఖాళీగా తిరగకుండా ఇంట్లోనే ఉంటూ ఒక గదిలో కూర్చుని చదువుకుంటారు. ఇలా చదవడం వల్లే వారు పడ్డా కష్టానికి ఫలితం దక్కింది అంటున్నారు. ప్రతి ఒక్కరు తమ గమ్యానికి చేరుకోవాలనే లక్ష్యంతో ఉంటే.. కష్టపడి చదివితే తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెబుతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/fbe2d4493b2bec85bc9d9dd034571db81788922347189233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/1fcd426678457253e4e77b8ee85530b61788922370348233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/0b00f20e7a3d51ce08493c9121a4f3ad1788922403256233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/b8483987dc49b57f4992a5809e4a670b1788919419950233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Basara Temple Master Plan: రూ.354 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/telangana-govt-354-crore-basara-temple-master-plan-and-20-crore-pushkar-ghat-projects-258232</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/telangana-govt-354-crore-basara-temple-master-plan-and-20-crore-pushkar-ghat-projects-258232#respond</comments><pubDate>Mon, 7 Sep 2026 07:56:27 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/telangana-govt-354-crore-basara-temple-master-plan-and-20-crore-pushkar-ghat-projects-258232</guid><description><![CDATA[&lt;p&gt;Basara Jnana Saraswati Temple | తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా వచ్చే ఏడాది జూన్ 27 నుంచి నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి, జిల్లా ఇన్&amp;zwnj;చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పుష్కరాలకు ఏడాది ముందుగానే మౌలిక వసతులు, పుష్కర ఘాట్లు, ఆలయ అభివృద్ధి పనులకు తాము శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.&lt;/p&gt;
&lt;p&gt;నిర్మల్ జిల్లాలోని బాసరలో ఆదివారం పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పుష్కర ఘాట్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గోదావరి నదీమాతకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూ.354 కోట్లతో చేపట్టనున్న ఆలయ సమగ్ర అభివృద్ధి, నూతన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/07/790e54c6819216ee56e8e15147c9c4dd1788747486094233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆలయ ప్రాంగణాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. భవిష్యత్&amp;zwnj;లో పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మౌలిక వసతులను ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/07/749df244e6a5bf913773ae37302a26cd1788747599873233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కర ఘాట్లను అవసరమైన మేరకు విస్తరించడంతో పాటు, కొత్త ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు సౌకర్యాలు కల్పించాలన్నారు. మహిళల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూములు, మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన పుష్కర ప్రాంతాల్లో 24 గంటల వైద్య సేవల కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అవసరమైన వైద్యులు, అత్యవసర మందులు, అంబులెన్స్&amp;zwnj;లను ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని.. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, వైద్య, మున్సిపల్ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కర ప్రాంతాల్లో నిరంతర పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని, ఇతర ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/07/6373cf6e67eac013edbb5379a338916e1788747692018233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆలయ ఈవో ఆఫీసులో సమీక్షా సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏడాది ముందుగా పనులు ప్రారంభించాం. రాష్ట్రవ్యాప్తంగా పుష్కరాల కోసం దాదాపు రూ.1,000 కోట్లతో వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల పనులు చేపడుతున్నాం. పుష్కరాల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రజాభవన్&amp;zwnj;లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి పనుల పురోగతిని సమీక్షిస్తాం. &amp;nbsp;అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని&amp;rsquo; ఆదేశించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/07/f87c7c2c10327b0ef146ca8df83daa191788747779774233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;బాసరతో పాటు గోదావరి నదీ తీర జిల్లాల్లోని మొత్తం 12 ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. పుణ్యస్నానాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల అభివృద్ధితో పాటు భద్రతా చర్యలపై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. పుష్కరాల కోసం చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి జూపల్లి తెలిపారు. పనుల నాణ్యత, పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించినట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పుష్కరాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ.. బాసర గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పుష్కర ఘాట్ల అభివృద్ధి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన మ్యాపులు, ప్రతిపాదనలు, పనులను మంత్రి జూపల్లి కృష్ణారావుకు వివరించారు. నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రికి వివరించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/07/481303cb4660d1b8c0a8843ec5b613061788747141330233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Mancherial Politics: 22A నిషేధిత జాబితాలో ఒక్క ఇల్లు పోయినా రాజీనామా : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/mancherial-mla-prem-sagar-rao-fierce-warning-to-opponents-every-inch-of-land-will-be-protected-258201</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/mancherial-mla-prem-sagar-rao-fierce-warning-to-opponents-every-inch-of-land-will-be-protected-258201#respond</comments><pubDate>Sun, 6 Sep 2026 11:21:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/mancherial-mla-prem-sagar-rao-fierce-warning-to-opponents-every-inch-of-land-will-be-protected-258201</guid><description><![CDATA[&lt;p&gt;Mancherial News Today |&amp;nbsp;మంచిర్యాల: 22A నిషేధిత జాబితాలో మంచిర్యాల నియోజకవర్గంలో &amp;nbsp;ఏ ఒక్క ఇల్లు పోయిన రాజీనామా చేస్తానంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యానించారు. ఈ గడ్డ తనదేనని, ఎవరైనా వచ్చి అక్రమాలు చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఉరుకునేది లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో భాగంగా విజయోత్సవ ర్యాలీలో మంచిర్యాల ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేశారు. క్రమశిక్షణ కలిగిన తన సైనికులకు (అనుచరులకు) ఎంతవరకు సహనం ఉండాలో అంతవరకే ఉంటుందని, ఒక్కసారి సహనం దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని విపక్ష పార్టీలకు హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మంచిర్యాల సైనికుల నుంచి మిమ్మల్ని కాపాడుకోండి..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;సరిహద్దుల్లో శత్రువులను మన ఆర్మీ ఎలాగైతే కలుపుతుందో, మంచిర్యాల సైనికులు కూడా అదే పని చేస్తారని, ప్రత్యర్థులు తమను కాపాడుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ గడ్డ తనదని, ఇది ఖచ్చితంగా &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; అడ్డా అని ఆన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే.. ఈ నియోజకవర్గంలో పేద ప్రజల ఇల్లు కాని, ప్లాట్ కాని, కనీసం ఒక్క గజం లేదా ఒక ఇంచ్ స్థలం కూడా పోకుండా కాపాడుకునే పూర్తి బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. సింగరేణి ప్రాంతంలో ఇళ్ల పట్టాల సమస్యలను రాబోయే ఎన్నికల లోపల పూర్తిగా పరిష్కరించి, లబ్ధిదారులకు పట్టాల పంపిణీని కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఈ గడ్డ నాది.. భయానికి మీనింగే తెలియని బ్లడ్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తాను ఈ గడ్డపైనే పుట్టి పెరిగానని, లక్షపేట, బెల్లంపల్లి హాస్టళ్లలో చదువుకున్నానని ప్రేమ్ సాగర్ రావు గుర్తుచేశారు. ఈ ప్రాంత సమస్యల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, ఇతరులలాగా ఎవరో వచ్చి వివరాలు ఇస్తే రాజకీయం చేసే నాయకుడిని తాను కాదన్నారు. ఈ ప్రాంతంతో తనకు పేగు బంధం ఉందని, సమస్యలను పరిష్కరించే వరకు చిల్లరగా మాట్లాడే వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తన జీవితంలో భయం అనే పదానికి అర్థమే లేదని, తానేదో బయటి ప్రపంచానికి వెళ్లి డబ్బు సంపాదించుకున్నాక, సొంత గడ్డ రుణం తీర్చుకోవడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/telangana-cabinet-expansion-delayed-tpcc-chief-mahesh-goud-rules-out-immediate-reshuffle-258163&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రౌడీయిజం, గూండాయిజం ఎదుర్కొని రాజకీయాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నియోజకవర్గంలో 16, 18 ఏళ్ల యువత జీవితాలను నాశనం చేస్తున్న గంజాయి, మద్యం బ్యాచ్&amp;zwnj;లపై ప్రేమ్ సాగర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గంజాయి , మద్యం తాగిస్తూ యువత భవిష్యత్తును నాశనం చేస్తూ, వారి కుటుంబాలను రోడ్డుపైకి నెడుతున్న ఎవ్వరినీ కూడా క్షమించేది లేదన్నారు. తాను 40 ఏళ్లుగా రౌడీయిజం, గుండాయిజం ఎదుర్కొంటూ రాజకీయం చేస్తున్నానని, కొత్తగా వచ్చిన చిల్లర బ్యాచ్&amp;zwnj;లకు భయపడనని చెప్పారు. తాను ఒక్క పిలుపునిస్తే నియోజకవర్గ యువత అంతా తిరగబడతారని, అప్పుడు అరాచకాలు చేసే ఒక్కడు కూడా &amp;nbsp;మిగలడని హెచ్చరించారు. గంజాయి బ్యాచ్&amp;zwnj;కు మద్దతు ఇస్తున్న నాయకులు కూడా వాస్తవాలు గ్రహించాలని, లేదంటే భవిష్యత్తులో తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే హెచ్చరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/fe326e07dad2bda4bd92fc3c3ed1247d1788673698095233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/traffic-jam-on-nh44-in-adilabad-following-head-on-collision-near-kupti-bridge-258140</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/traffic-jam-on-nh44-in-adilabad-following-head-on-collision-near-kupti-bridge-258140#respond</comments><pubDate>Sat, 5 Sep 2026 13:30:28 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/traffic-jam-on-nh44-in-adilabad-following-head-on-collision-near-kupti-bridge-258140</guid><description><![CDATA[&lt;p&gt;ఆదిలాబాద్: ఆదిలాబాద్&amp;zwnj; జిల్లా నేరడిగొండ మండలంలో కుప్టి వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జాతీయ రహదారిపై టమాటా లోడ్&amp;zwnj;తో వెళ్తున్న లారీ, మరో లారీ ఢీకొని బోల్తాపడటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, నేరేడిగొండ మండలాల పరిధిలోని 44వ జాతీయ రహదారి (NH-44) పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అర్ధరాత్రి నేరేడిగొండ మండలం కుప్టి వంతెన వద్ద సిమెంట్ మిక్సర్ ట్యాంకర్, టమాటా లోడ్&amp;zwnj;తో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఈ వంతెనకు ఒకవైపు బుంగ పడటంతో రాకపోకలు వన్ వే లో కొనసాగుతుండగా, అదే మార్గంలో ప్రమాదం జరగడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;లారీలు ఢీకొన్న ప్రమాదం ప్రభావంతో జాతీయ రహదారిపై ఇరువైపులా దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వేకువజామునే సంఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ల సాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. అయినప్పటికీ, మార్గం వన్ వే కావడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్&amp;zwnj;లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/05/291c2157a41a61d7d391b5ac9d1300ca1788594900397233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇచ్చోడ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే, నేరేడిగొండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద భారీ వాహనాలను నిలిపివేస్తూ ట్రాఫిక్&amp;zwnj;ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు గాయపడగా.. సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నిర్మల్- ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులోని కొలాం ఘాట్ (ఈచ్ఛోడ-నేరేడిగొండ) ప్రాంతంలో భారీ మలుపులు, లోయల కారణంగా వాహనాలు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు గురవుతున్నాయి. కుప్టి, సోనాల తదితర ప్రాంతాల్లోని పాత వంతెనలకు బుంగాలు పడటం, తరచూ మరమ్మతులు జరగడం వల్ల రహదారి ఇరుకుగా మారి వన్-వే &amp;nbsp;విధానాన్ని అమలు చేయాల్సి వస్తోంది. ఉత్తర- దక్షిణ భారతదేశాలను కలిపే ప్రధాన రహదారి కావడం వల్ల సిమెంట్, రసాయనాలు, సరుకు రవాణా చేసే లారీలు వెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/05/26b971118c03732fa9c07878f78a8a771788594917080233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలు ఏమున్నాయి..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు లేదా ఘాట్ ప్రాంతంలో ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, స్థానిక అధికారులు సూచించే కొన్ని మార్గాల వివరాలు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఇచ్ఛోడ - పెంబి - నిర్మల్ మార్గం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇచ్ఛోడ వద్ద నేషనల్ హైవే 44 (NH-44) నుంచి వైదొలిగి పెంబి, ఖానాపూర్ మీదుగా నిర్మల్ చేరుకుని తిరిగి నేషనల్ హైవే పైకి రావచ్చు. (లైట్ మోటార్ వాహనాలకు ఇది అనుకూలం).&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆసిఫాబాద్ - మంచిర్యాల బైపాస్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఆదిలాబాద్ బైపాస్ వద్ద ఆసిఫాబాద్, మంచిర్యాల మీదుగా కరీంనగర్ రహదారి గుండా హైదరాబాద్ వైపు వెళ్తాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఉట్నూర్ మార్గం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇచ్చోడ వద్ద ట్రాఫిక్ నిలిస్తే కనుక ఉట్నూర్ - ఆసిఫాబాద్ మార్గంలో వాహనాలను మళ్లిస్తుంటారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/05/605e354b78c52d6be6c05e7ed3c66dfa1788594751894233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Jago Telangana Yatra: ఇంద్రవెల్లి నుంచి జోగులాంబ వరకు 15000 కిలోమీటర్లు జాగో తెలంగాణ యాత్ర, ఉద్దేశం ఏంటీ]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/veera-telangana-samithi-founder-vikram-reddy-launches-15000-km-jago-telangana-yatra-from-indervelli-257742</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/veera-telangana-samithi-founder-vikram-reddy-launches-15000-km-jago-telangana-yatra-from-indervelli-257742#respond</comments><pubDate>Tue, 1 Sep 2026 07:05:06 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/veera-telangana-samithi-founder-vikram-reddy-launches-15000-km-jago-telangana-yatra-from-indervelli-257742</guid><description><![CDATA[&lt;p&gt;Jago Telangana Yatra From Indervelli | ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద వీర తెలంగాణ సమితి (Veera Telangana Samithi) ఫౌండర్ విక్రమ్ రెడ్డి జాగో తెలంగాణ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇంద్రవెల్లి నుండి జోగులాంబ వరకు 15000 వేల కిలోమీటర్లు జాగో తెలంగాణ పేరిట యాత్రను చేపట్టారు. సోమవారం ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులు అర్పించి యాత్రను ప్రారంభించారు. ముందుగా ఇంద్రవెల్లి నుంచి కేస్లాపూర్ గ్రామం వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై గ్రామస్తులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. ఆపై దారిలో పలువురిని కలుస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/01/cd10ab2aa7fdfdec63c030533cd928c51788201292043233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కుల, మత, రాజకీయాలను వ్యతిరేకంగా పోరాటం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భంగా జాగో తెలంగాణ యాత్ర చేపట్టిన వీర తెలంగాణ సమితి ఫౌండర్ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి అమర వీరుల పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని ముందుకెళ్తు, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని కాడుకుందామన్నారు. రాష్ట్రంలో కుల, మత, రాజకీయాలను వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. యువత, మహిళలు, రైతులు, పేద, మధ్య తరగతి ప్రజలను రాజకీయాల్లో ఆహ్వానించడమే తమ లక్ష్యమన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/01/960d27cdcb61a99c117c323a7e54d73e1788201309024233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇంద్రవెల్లి మండలం నుంచి జోగులాంబ వరకు ఈ యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15000 వేల కిలోమీటర్లు కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో పట్టణాలు, పల్లెల్లో తిరుగుతూ అక్కడ నెలకొన్న సమస్యలను తెలుసుకుంటామన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ యాత్రకు ముగింపు పలుకుతామన్నారు.&amp;nbsp;&lt;br /&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/cm-revanth-reddy-challenges-brs-on-1000-days-of-governance-demands-kcrs-resignation-257730&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Revanth Reddy Challenges KCR: 1000 రోజుల పాలనపై చర్చకు సిద్ధమా? అసెంబ్లీకి రాకపోతే కేసీఆర్ రాజీనామా చేయాలి: రేవంత్ రెడ్డి సవాల్&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/01/4533f03efe8cbaf912397f38a9b496681788201331107233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందరిని చైతన్యం చేస్తూ అందరీ మంచి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ జాగో తెలంగాణ యాత్రలో వీర తెలంగాణ సమితి రాష్ట్ర నాయకులు సంజన, వివేక్, అముల్య, సుమన్, సతీష్, దీలిప్, గురువయ్య, చరణ్, తదితరులు పాల్గొన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/01/60f66bdd17fee836135c7c95147f9e1b1788201255426233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Kavitha: హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/kalvakuntla-kavitha-launches-telangana-rakshana-sena-at-nizamabad-rally-attacks-brs-and-congress-257741</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/kalvakuntla-kavitha-launches-telangana-rakshana-sena-at-nizamabad-rally-attacks-brs-and-congress-257741#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 23:27:39 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/kalvakuntla-kavitha-launches-telangana-rakshana-sena-at-nizamabad-rally-attacks-brs-and-congress-257741</guid><description><![CDATA[&lt;p&gt;నిజామాబాద్:&amp;nbsp;10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం నాలుగిండ్లు మాత్రమే బంగారమయ్యాయని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం 20 ఏళ్ల పాటు శ్రమించి పనిచేసిన తనను &lt;a title=&quot;బీఆర్ఎస్ పార్టీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BRS-Party&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీఆర్ఎస్ పార్టీ&lt;/a&gt; నుంచి నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారని విచారం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి పదవుల కోసం కొత్త పార్టీ పెట్టలేదని, కేవలం తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే తెలంగాణ రక్షణ సేనను స్థాపించానని అన్నారు. పుట్టింటి వాళ్లు తనను తరిమేస్తే అత్తింటి వాళ్లు అక్కున చేర్చుకుని, కడుపులో పెట్టి చూసుకున్నారని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ నగరంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన &amp;lsquo;పాంచజన్య సంకల్ప సభ&amp;rsquo;లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం కావాల్సింది కేవలం నినాదాలకే పరిమితమైన &amp;lsquo;బంగారు తెలంగాణ&amp;rsquo; కాదని, అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించే &amp;lsquo;బహుజన తెలంగాణ&amp;rsquo; అని కవిత స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే తమ బతుకులు మారిపోతాయని ఆశించిన ప్రజలకు ఆశించిన ఫలితం దక్కక నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాల్లో నిజమైన గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముందని, &amp;nbsp;సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు బాగుపడాల్సిన అవసరముందని చెప్పారు. పార్టీ పెట్టిన నాలుగు నెలల తర్వాత తన సొంతూరు నిజామాబాద్&amp;zwnj;కు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా ఎలాగైతే ఆశీర్వదించారో, ఇప్పుడు కూడా అదే స్థాయి ఆదరణ అందించాలని అక్కడి ప్రజలను కోరారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;నేను ఏ తప్పు చేశానని తీహార్ జైల్లో పడేశారు: కవిత&lt;a href=&quot;https://x.com/hashtag/kavitha?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#kavitha&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/TiharJail?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#TiharJail&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/BRS?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#BRS&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/TelanganaNews?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#TelanganaNews&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/KCRDaughter?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#KCRDaughter&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/PoliticalControversy?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#PoliticalControversy&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/APandTSNews?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#APandTSNews&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/LegalBattle?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#LegalBattle&lt;/a&gt; &lt;a href=&quot;https://x.com/hashtag/TeluguNews?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#TeluguNews&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/DAylpkQiNc&quot;&gt;pic.twitter.com/DAylpkQiNc&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; ABP Desam (@ABPDesam) &lt;a href=&quot;https://x.com/ABPDesam/status/2094422264108511481?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 31, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న కవిత..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;సొంత గడ్డపై తన మనుషులను చూసిన కవిత తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. ఎంత ఆపుకుందామనుకున్నా కన్నీళ్లు ఆగడం లేదని, అయితే తనను పిరికిదానిగా భావించవద్దని, ఆడబిడ్డలకు బాధ ఉంటే కన్నీళ్లు రావడం సహజమని చెప్పారు. ఏ తప్పూ చేయకపోయినా తనను తీహార్ జైలులో పెట్టినప్పటికీ ధైర్యం సడలలేదని, దారి తప్పలేదని గుర్తుచేసుకున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/bd1f0ba39d96ed6a6c1cd5da7d84a8a61788198859503233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;తాను తప్పు చేయలేదని, నిజామాబాద్ నిప్పు బిడ్డనని ధైర్యంగా నిలబడ్డానన్నారు. ఈడీ, సీబీఐ దాడుల సమయంలో అండగా నిలవాల్సిన బీఆర్ఎస్ పెద్దలు కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనను అరెస్టు చేశారని చెప్పి, ఆ తర్వాత ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపించినప్పటికీ ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పంతోనే ముందుకెళ్తున్నానని వివరించారు.&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి &amp;lsquo;పాంచజన్యం&amp;rsquo; పేరుతో 5 కీలక అంశాలతో కార్యాచరణ రూపొందించామని కవిత వెల్లడించారు. ప్రతి కుటుంబానికి ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఏటా రాష్ట్రానికి వచ్చే రూ. 2 లక్షల కోట్ల ఆదాయంలో లక్ష కోట్లు కేటాయిస్తే ఉచిత విద్య, వైద్యం సునాయాసంగా అందించవచ్చని లెక్కలతో సహా వివరించారు. బహుజన తెలంగాణ అంటే అన్ని కులాలు, అన్ని రంగాలు సమానంగా అభివృద్ధి చెందడమేనని, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా న్యాయం జరగాలని ఆకాంక్షించారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే, మరోవైపు పార్టీని బలమైన శక్తిగా నిర్మిస్తామన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని 5 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు కాస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, నాయకులు గెలిచాక ప్రజలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;హరీష్, సంతోష్&amp;zwnj;లను క్షమించినా ఆయనను క్షమించను&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. తన తండ్రి కేసీఆర్&amp;zwnj;కు, తనకు మధ్య దూరం పెంచి తండ్రీకూతుళ్లను వేరు చేసిన వ్యక్తి ప్రశాంత్ రెడ్డేనని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావులను క్షమిస్తానేమో కానీ ప్రశాంత్ రెడ్డిని జీవితంలో క్షమించనని, ఆయనకు తన ఉసురు కచ్చితంగా తగులుతుందని అన్నారు. కేసీఆర్ అన్నం పెట్టి పెద్ద కొడుకులా చూసుకుంటే, బీఆర్ఎస్ ఓడిపోయిన రెండో రోజే ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్&amp;zwnj;లోకి వెళ్లేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. తాను ఎంతో కష్టపడి ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, బాజిరెడ్డిలను గెలిపిస్తే, వారే తనను ఓడించడానికి కుట్రలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;గత పదేళ్లలో బీఆర్ఎస్ నాయకులు ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచుకున్నారని కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దోచుకున్న డబ్బుల అహంకారంతో కొత్తగా పెట్టిన పార్టీ నాయకులను బెదిరిస్తున్నారని, అలాంటి బెదిరింపులకు భయపడే రోజులు పోయాయన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ వైఫల్యాలను నిలదీయాల్సిన BRS, తమ అవినీతి బయటపడుతుందనే భయంతో కాంగ్రెస్&amp;zwnj;తో మిలాఖత్ అయిందని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిల ఆస్తులు నియోజకవర్గ ప్రజలకు తెలుసని, వారి అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలని &amp;nbsp;&lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;నిజామాబాద్ ప్రజలే తన బలమని, ఈ ప్రాంత కోడలిగా ఇక్కడి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడతానని కవిత మాట ఇచ్చారు. గతంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు రూ. 18 కోట్లు ఇప్పించాలని &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt;, కేటీఆర్&amp;zwnj;లను ఎన్నోసార్లు కోరినా కేటీఆర్ తన మిత్రుడి ప్రయోజనాల కోసమే దానిని తెరిపించలేదని అన్నారు. స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ పేరులోనే ధర్మం ఉందని, ఆయన చేసేదంతా అధర్మమేనని ఎద్దేవా చేశారు. ఎంపీగా కేంద్రం నుంచి నిధులు తేలేకపోయారని, పసుపు బోర్డు వల్ల రైతులకు ఎలాంటి మేలు జరగలేదని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమ పార్టీ శ్రేణులు ముందుండి పోరాడతాయని హామీ ఇచ్చారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/b16dbcd35880a10d983c73a9c12627611788198569496233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Mancherial Crime News: బిడ్డను నడుముకు కట్టుకొని బావిలో దూకిన తల్లీ! మంచిర్యాల జిల్లాలో దారుణం!]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/mancherial-crime-news-mother-daughter-suicide-dandepalli-lingapur-257678</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/mancherial-crime-news-mother-daughter-suicide-dandepalli-lingapur-257678#respond</comments><pubDate>Mon, 31 Aug 2026 11:00:44 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shailender ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/mancherial-crime-news-mother-daughter-suicide-dandepalli-lingapur-257678</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Mancherial Crime News:&lt;/strong&gt; మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుమార్తెను నడుముకు కట్టుకొని ఓ తల్లి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రజిత(26)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో 7ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె అక్షిత(6), కుమారుడు మహేందర్(18 నెలలు) ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా కొన్నాళ్లుగా రజిత లింగాపూర్ గ్రామంలో తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. అంజయ్య అప్పుడప్పుడు వచ్చి పిల్లలను చూసుకొని వెళుతుంటారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆదివారం ఉదయం రజిత అమ్మానాన్నలు పనికి వెళ్లారు. లింగాపూర్ గ్రామంలోని తన అత్తగారింటికి రజిత భర్త అంజయ్య రాగా మరోసారి భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. దీంతో జీవితంపై విరక్తి చెందిన రజిత చంటి పిల్లాడైనా తన కుమారుడిని ఇంట్లోనే వదిలి తన కుమార్తెను తీసుకొని సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు చేరుకొని, పాపను తన నడుముకు కట్టుకొని బావిలోకి దూకడంతో తల్లి కూతురు మృతి చెందారు. అటుగా వెళ్తున్న వారికి బావిలో తేలియాడుతున్న మృతదేహాలు కనిపించడంతో కుటుంబీకులకు సమాచారం అందించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;భార్య, కూతురు మరణించిన విషయం తెలుసుకున్న రజిత భర్త అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు చెపుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దండేపల్లి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను లక్షేట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/31/8e4e9d5eb69b3735b863715347dcf4511788154202859215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Adivasi March: రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ కేంద్రాలలో ఆదివాసీ మార్చ్ కి కదిలిరండి: తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/tudum-debba-calls-for-success-of-adivasi-march-across-itda-centers-in-telangana-257574</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/tudum-debba-calls-for-success-of-adivasi-march-across-itda-centers-in-telangana-257574#respond</comments><pubDate>Sat, 29 Aug 2026 23:55:46 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/tudum-debba-calls-for-success-of-adivasi-march-across-itda-centers-in-telangana-257574</guid><description><![CDATA[&lt;p&gt;ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ కేంద్రాలలో &quot;ఆదివాసి మార్చ్&quot; కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డా. మైపతి అరుణ్ కుమార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద చలో ఐటిడిఏ ఆదివాసి మార్చ్ పోస్టర్లను ఆ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. వచ్చే నెల సెప్టెంబర్ 7న &amp;nbsp;ఏటూరు నాగారం, సెప్టెంబర్ 16న ఉట్నూర్, సెప్టెంబర్ 21న భద్రాచలం, సెప్టెంబర్ 28న మన్ననూరులోని ఐటిడిఎ కేంద్రాలలో అధివాసి మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భంగా డా.మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆదివాసీల మనుగడ దిన దిన గండంగా మారిందని, ఎన్ని ర్యాలీలు బహిరంగ సభలు నిర్వహణ చేసి ఆదివాసీల సమస్యలను విన్నవించినా కానీ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తుందన్నారు. అందుకే పోరాటాలు ఉధృతం చేయటం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పిలుపు ఇచ్చాం అన్నారు&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/29/478b7a00ce6f266dcaedf4df8fe0854f1788027876939233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;1976 నుండి 2026 వరకు 50 ఏళ్లుగా ఆదివాసీల రిజర్వేషన్ లను దోచుకుంటున్న లంబాడి లను ఎస్టీ జాబితాల నుండి తొలగించటం కోసం ప్రత్యేక కమిషన్ ను నియమించాలని &quot;5&quot; వ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలలో 29 శాఖల జీవోలను ట్రైబల్ అడ్వసరి కమిటీ (TAC) తీర్మానం ద్వారా ప్రత్యేక చట్టం చేయాలన్నారు. ఐటీడీఏ ద్వారనే ఉద్యోగ బర్తీ ప్రక్రియ ప్రమోషన్ లు బదిలీలు చేయాలనీ, కానిస్టేబుల్ ఉద్యోగాలలో 75 శాతం వాట ఏజెన్సీ DSC ఏర్పాటు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, గిరి వికాస్ బోర్లు దింపాలనీ, గోదావరి నది పై కట్టిన ప్రాజెక్ట్ లలో తుపాకుల గూడెం దేవాదుల కాళేశ్వరం నుండి ఆదివాసీ ప్రాంత రైతులకు సాగు నీరు ఇవ్వాలని, BTPS, KTPS, BPL, దేవపూర్ సిమెంట్ ప్యాక్టరీలో సింగరేణిలలో అధివాసి ల వాట, ఉద్యోగాల వాట, తదితర డిమాండ్ లతో ఈ మార్చ్ ల నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/29/e86706e0154ffeec6def7cd11d51e3941788028188117233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుర్క బాపురావ్ , జిల్లా అధ్యక్షులు పెందూరూ దాధిరావ్, రగల్ జెండా చైర్మన్ మెస్రం నాగ్ నాథ్, ప్రధాన కార్యదర్శి పుర్క చిత్రులు, జిల్లా ASU కార్యనిర్వాహక అధ్యక్షులు కనక గణేష్, మండల అధ్యక్షులు గెడం లాలు, నాయకులు కుర్సింగ రాందాస్, మెస్రం సందీప్ తదితరులు పాల్గొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/29/708dc2330e700c5bbc2c48bbffe7550f1788027741083233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Adilabad News: విశాఖ చిన్నారి ఘటనకు మించి.. నర్సరీ చిన్నారిని విచక్షణారహితంగా కొట్టిన లేడీ టీచర్]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/shocking-incident-nursery-student-brutally-beaten-by-teacher-in-adilabad-atn-257559</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/shocking-incident-nursery-student-brutally-beaten-by-teacher-in-adilabad-atn-257559#respond</comments><pubDate>Sat, 29 Aug 2026 18:31:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/shocking-incident-nursery-student-brutally-beaten-by-teacher-in-adilabad-atn-257559</guid><description><![CDATA[&lt;p&gt;బోథ్:&amp;nbsp;ఇటీవల ఓ టీచర్ కొట్టడంతో ఏపీలోని విశాఖలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా ఎవరూ మరిచిపోలేదు. ఆ దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతున్నప్పటికీ కొందరు టీచర్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. &amp;nbsp;అలాంటి మరో &amp;nbsp;ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతున్న ఒక చిన్నారిపై లేడీ టీచర్ అత్యంత దారుణంగా కొట్టి పనిష్మెంట్ ఇచ్చింది. స్కూల్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు ప్రతీ ఒక్కరిని తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఆమెకు మానవత్వం లేదా, పిల్లల్ని అంత దారుణంగా కొడుతూ హింసిస్తే ఎంత బాధ కలుగుతుందంటూ శరీరంపై ఉన్న గాయాలను చూపిస్తూ కుటుంబసభ్యులు సైతం వీడియో విడుదల చేయడంతో వైరల్ అవుతోంది. స్కూళ్లలో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రుల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;చెవి మెలితిప్పి, కర్రతో కొడుతూ నరకం..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆ టీచర్ మొదట చిన్నారి చెవి మెలితిప్పింది. నర్సరీ చదువుతున్న బాలుడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. అంతటవితో ఆగని మహిళా టీచర్ కర్రతో చెంపలు, వీపుపై పదేపదే కొట్టింది. దాదాపు 6 నిమిషాలకు పైగా బాలుడ్ని టీచర్ కొట్టిందని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. స్కూల్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన బాలుడి శరీరంపై పడిన గాయాల గుర్తులను చూసి అనుమానం వచ్చిన తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లి ఆరా తీయడంతో ఈ అమానుష ఘటన బయటపడింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/29/da4f6a4300af6705b3a59d7688bf08c81788007942909233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పిల్లల్ని జంతువుల్లా ట్రీట్ చేస్తున్నారంటూ తల్లిదండ్రుల ఆవేదన&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బోథ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్య నేర్పించాల్సిన టీచర్లే ఇలా చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేస్తే స్కూళ్లకు పిల్లలను ఎలా పంపాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తనకు ఏం జరుగుతుందో అర్థం కాక చిన్నారి నొప్పితో విలవిల్లాడుతుంటే సైతం టీచర్ మనసు కరగలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నిమిషాల పాటు రికార్డైన వీడియోలో చాలా సేపు చిన్నారిని కొడుతూనే హింసించిందని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్రతో చిన్నారిని పక్కకు నెట్టివేయడం చూసి.. బాబు ఏమైనా కుక్క అనుకున్నారా ఏంటంటూ కుటుంబసభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తనను టీచర్ కొట్టిందని ఇంట్లో చెప్పాలంటే కూడా భయపడ్డాడని తల్లిదండ్రులు తెలిపారు. విచక్షణారహితంగా పిల్లల్ని కొడితే వారికి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని, ఇంత దారుణంగా కొడుతుంటే స్కూళ్లకు పిల్లల్ని పంపిస్తారా అని ప్రశ్నించారు. కావాలని పిల్లల్ని కొట్టలేదని టీచర్లు, స్కూల్ మేనేజ్మెంట్ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంటే కూడా అబద్ధాలు చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/29/2dcc5eea974111895d5ea55ac984672e1788007435770233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Adilabad Congress Group War: ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు!]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/adilabad-congress-infighting-ade-gajender-naresh-jadhav-dcc-president-257535</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/adilabad-congress-infighting-ade-gajender-naresh-jadhav-dcc-president-257535#respond</comments><pubDate>Sat, 29 Aug 2026 12:12:01 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shailender ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/adilabad-congress-infighting-ade-gajender-naresh-jadhav-dcc-president-257535</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Adilabad Congress Group War: ​&lt;/strong&gt;ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నరేష్ జాదవ్&amp;zwnj; తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్&amp;zwnj;చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు, విలువ ఇవ్వడం లేదని, నరేష్ జాదవ్ ప్రతి విషయంలోనూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ నేతలను విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన అధిష్ఠానం వద్ద తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.&lt;/p&gt;
&lt;p&gt;​శనివారం ఉదయం ఆడే గజేందర్ తన అనుచరులు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్&amp;zwnj;తో హైదరాబాద్&amp;zwnj;కు తరలివెళ్లారు. అక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్&amp;zwnj;ను నేరుగా కలిసి జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ పీఏసీ కమిటీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై గజేందర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ల ఎంపిక ప్రక్రియలో బోథ్ నియోజకవర్గానికి చెందిన ఆశావహుల పేర్లను పక్కనబెట్టి, డీసీసీ అధ్యక్షుడు తన ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/29/a05bc7d1d935803d201669aba6ca4f0f1787985706446215_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;​జిల్లా అధ్యక్షుడి వ్యవహారశైలి వల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయని, క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆడే గజేందర్ అనుచరులు ఆరోపిస్తున్నారు. పార్టీ ప్రతిష్టను కాపాడటంతోపాటు సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే తక్షణమే జిల్లా అధ్యక్షుడిని మార్చాలని, పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే నేతకు జిల్లా పగ్గాలు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బోథ్ నియోజకవర్గ నేతల ఈ పర్యటన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/29/aea6f047d23d6e5fc5758e955780895b1787985634945215_original.jpg" width="220"/></item></channel></rss>