Alair town in Yadadri Bhuvanagiri district- నల్గొండ: తెలంగాణలో మరో రైలు ప్రమాదం తప్పింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తుండగా పెద్ద శబ్దం వస్తుండటంతో ప్రయాణికులు రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. దాంతో  రైలును నల్గొండ (యాదాద్రి) జిల్లా ఆలేరు సమీపంలో సిబ్బంది సమాచారంతో అధికారులు నిలిపివేశారు. పరిశీలించగా రైలు పట్టా విరిగినట్లు గుర్తించారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. అయితే విచిత్రమైన శబ్దాలు రావడంతో రైలును నిలిపివేయడంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పిపోయింది.