Kodandaram :  కేసీఆర్ చేసిన తప్పులను సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని  తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట ఆయన హాజరయ్యారు.  హైదరాబాద్ లోని బీఆర్కే భవన్‌లోని కమిషన్ కార్యాలయానికి కోదండరాంతో పాటు విద్యుత్ శాఖ అధికారి రఘు వచ్చారు. వారిద్దరి నుంచి కమిషన్ వివరాలు అడిగి తెలుసుకుంది.                      


ఛత్తీస్ గఢ్ తో 2000 మెగావాట్లకు ఒప్పందం చేసుకుంటే 200 మెగావాట్లు కూడా రాలేదని  కాంపిటేటివ్ బిడ్డింగ్ కు వెళ్లుంటే రేట్లు తగ్గేవని.. ఎంవోయూ ద్వారా ముందుకెళ్లారని ఇది అనుమానించదగ్గదేనని కోదండరాం కమిషన్‌కు తెలిపినట్లుగా తెలుస్తోంది.  ఛత్తీస్ గఢ్ తో కరెంట్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లపై గతంలో అఫిడవిట్ వేశామని కోదండరాం  మీడియాకు తెలిపారు.  అందుకు సంబంధించిన ఆధారాలను కమిషన్ ముందు ఉంచామన్నారు.   ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలన్నారు. అభివృద్ధి అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదన్నారు. గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల ట్రాన్స్‌కో, జెన్‌కోలకు రూ.81 వేల కోట్ల అప్పులు అయ్యాయన్నారు. గత ఏడాది వరదలు వస్తే భద్రాద్రి ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చిందన్నారు.                      


భవిష్యత్తులో గోదావరి వద్ద నీటి మట్టం పెరిగితే భద్రాద్రి ప్లాంటును కాపాడుకోగలమా? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఆ తప్పిదాలపై క్రిమినల్ చర్యలకు వెనుకాడవద్దని సూచించారు. అందరూ కూడా చట్టం ప్రకారమే నడుచుకోవాలని స్పష్టం చేశారు.                      
 
మరో వైపు  పవర్ కమిషన్‌ విచారకు సంబంధించి కేసీఆర్ పంపిన లేఖపై పవర్ కమిషన్ చైర్మ సమీక్ష చేపట్టారు.   భద్రాద్రి యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారన్న కమిషన్ కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చిస్తారు. వాస్తవాలపై BHEL ప్రతినిధులని కూడా వివరాలు అడుగనున్న కమిషన్ నేడు చర్చ అనంతరం దాని అనుగుణంగానే తదుపరి చర్యలు తీసుకోనున్నారు.                        


ఈ కమిషన్ తీరుపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. విచారణ అర్హత లేదంటున్నారు. అయితే జస్టిస్ నరసింహారెడ్డి మాత్రం ఎవరి అభిప్రాయాలు  వారు చెప్పే అవకాశం ఉందన్నారు.