<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>karimnagar</title><atom:link href="https://telugu.abplive.com/karimnagar/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Sun, 24 May 2026 21:54:39 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!]]></title><link>https://telugu.abplive.com/telangana/warangal/fire-breaks-out-at-l-and-t-office-near-medigadda-barrage-of-kaleshwaram-lift-irrigation-project-248303</link><comments>https://telugu.abplive.com/telangana/warangal/fire-breaks-out-at-l-and-t-office-near-medigadda-barrage-of-kaleshwaram-lift-irrigation-project-248303#respond</comments><pubDate>Sun, 24 May 2026 20:56:41 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ వరంగల్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/warangal/fire-breaks-out-at-l-and-t-office-near-medigadda-barrage-of-kaleshwaram-lift-irrigation-project-248303</guid><description><![CDATA[&lt;p&gt;జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్యారేజ్ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ (L&amp;amp;T) కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు ఆఫీస్ అంతటా వ్యాపించడంతో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి, దానికి సంబంధించిన నిర్వహణ పనులకు చెందిన పలు కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు పూర్తిగా కాలి బూడిదైనట్లు ప్రాథమిక సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు వ్యవహారంపై ఇప్పటికే వివాదం నడుస్తున్న తరుణంలో, దానికి సంబంధించిన రికార్డులు ఉన్న కార్యాలయంలోనే ఈ ప్రమాదం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.&amp;nbsp;&lt;br /&gt;ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం కేవలం ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేక దీని వెనుక మరేదైనా కుట్ర కోణం ఉందా అనే దిశగా పోలీసులు, ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/cm-revanth-reddy-telangana-govt-to-purchase-maize-directly-as-centre-delays-response-248258&quot;&gt;Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు, అవకతవకలపై ఆరోపణలు, కోర్టు కేసులు, పునరుద్ధరణ పనులకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.&amp;nbsp;&lt;br /&gt;&lt;strong&gt;కోర్టు కేసులు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక&lt;/strong&gt;&lt;br /&gt;కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరశీలించి, అధికారులను ప్రశ్నించి పలు వివరాలు సేకరించి ఘోష్ కమిషన్ నివేదిక అందించింది. ఈ నివేదికపై ఇటీవల తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని కోర్టు పేర్కొన్నప్పటికీ, సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన, సరైన నోటీసులు ఇవ్వని కారణంగా మాజీ సీఎం &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt;, మాజీ మంత్రి హరీష్ రావులకు వ్యతిరేకంగా కమిషన్ ఇచ్చిన కొన్ని అంశాలను కోర్టు పక్కన పెట్టింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/0MWTsyQCur8?si=VrFdCqNslHDZPjO3&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;అయితే, దీనిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని, కేవలం సాంకేతిక, విధానపరమైన లోపాల వల్లే వారికి తాత్కాలిక ఉపశమనం లభించిందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరిందని, హైకోర్టు తీర్పు సీబీఐ దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకి కాదని ప్రభుత్వం తెలిపింది.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/nizamabad/terror-ends-in-chandrapur-forest-officials-capture-t2-tigress-killing-four-women-atn-248290&quot;&gt;Tiger Trapped In Cage: నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;మరోవైపు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల మేరకు ప్రాజెక్టులోని 3 బ్యారేజీల పునరుద్ధరణ పనులను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పునాదిని పటిష్టం చేయడానికి డయాఫ్రామ్ వాల్స్ (Diaphragm walls) నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు మిలిటరీ డిఫెన్స్ సర్వీసెస్ నుండి ప్రత్యేకంగా కల్నల్ పరిక్షిత్ మెహ్రాను టన్నెల్స్ &amp;amp; సేఫ్టీ సెక్రటరీగా, కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్&amp;zwnj;గా ప్రభుత్వం నియమించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద జియో-ఫిజికల్, జియో-టెక్నికల్ పరీక్షలు వేగంగా జరుగుతున్నాయి. జూన్ నాటికి ఈ పరీక్షలు పూర్తి చేసి, అక్టోబర్ కల్లా వర్కింగ్ డిజైన్&amp;zwnj;ను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026 ఖరీఫ్ సీజన్ నాటికి ఈ బ్యారేజీలను పాక్షికంగా అందుబాటులోకి తెచ్చి, పూర్తి స్థాయి శాశ్వత మరమ్మతులను నిరంతరాయంగా కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/24/fb2489bdc188842637561695824d9f991779636247036233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం]]></title><link>https://telugu.abplive.com/telangana/cm-revanth-reddy-telangana-govt-to-purchase-maize-directly-as-centre-delays-response-248258</link><comments>https://telugu.abplive.com/telangana/cm-revanth-reddy-telangana-govt-to-purchase-maize-directly-as-centre-delays-response-248258#respond</comments><pubDate>Sun, 24 May 2026 16:06:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తెలంగాణ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/cm-revanth-reddy-telangana-govt-to-purchase-maize-directly-as-centre-delays-response-248258</guid><description><![CDATA[&lt;p&gt;Thummala Nageswara Rao | హైదరాబాద్: మొక్కజొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పండిన మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. మొక్కజొన్న పంటను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన రూ. 4,000 కోట్లకు అదనంగా, సీఎం రేవంత్ మరో రూ. 1,800 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారని మంత్రి తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;మొక్కజొన్న కొనుగోళ్లను తక్షణమే..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఏడాది రబీ మార్కెటింగ్ సీజన్&amp;zwnj;లో రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న అత్యంత భారీగా దిగుబడి వచ్చింది. ఈ క్రమంలో రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు, రూ. 1,100 కోట్లతో మొక్కజొన్న కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కేవలం మొక్కజొన్నే కాకుండా, &amp;nbsp;సన్&amp;zwnj;ఫ్లవర్ పంటను కూడా నిర్దేశిత 25 శాతం పరిమితికి మించి కొనుగోలు చేయాలని అధికారులను సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ఆదేశించారని ఆయన తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా తగిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అన్నదాతల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పంట చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల రైతులకు భరోసా ఇచ్చారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;🔴వరి కొయ్యలు కాల్చొద్దు &amp;ndash; రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక విజ్ఞప్తి&lt;br /&gt;&lt;br /&gt;హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు పొలాల్లో వరి కొయ్యలు, గడ్డి, పంట అవశేషాలను కాల్చడం వల్ల భారీ అగ్ని&amp;hellip; &lt;a href=&quot;https://t.co/ohO0gn7sjH&quot;&gt;pic.twitter.com/ohO0gn7sjH&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Padi Kaushik Reddy (@KaushikReddyBRS) &lt;a href=&quot;https://twitter.com/KaushikReddyBRS/status/2058467095445123549?ref_src=twsrc%5Etfw&quot;&gt;May 24, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వరి కొయ్యలు కాల్చొద్దని రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి&lt;/strong&gt;&lt;br /&gt;ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు పొలాల్లో వరి కొయ్యలు, గడ్డి, పంట అవశేషాలను కాల్చడం వల్ల భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. పొలాల్లో కొయ్యలు కాల్చడం వల్ల మంటలు పక్కనే ఉన్న పండ్ల తోటలు, తాటివనాలు, ఈతవనాలు, మోటారు విద్యుత్ వైర్లు దగ్ధమవుతున్నాయని తెలిపారు. ఈ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు, గౌడ సోదరులు, వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/telangana/nizamabad/watch-video-of-a-man-using-leaves-for-shade-highlights-severe-telangana-heatwave-atn-248185&quot;&gt;Telangana Heatwave: అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;అలాగే కొన్ని ప్రాంతాల్లో మంటలు వ్యాపించి వరి ధాన్యం నిల్వలు, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు కూడా కాలిపోతున్నాయన్న విషయాలను గుర్తుచేశారు. దీంతో రైతులకు లక్షల రూపాయల ఆర్థిక నష్టం జరుగుతోందని, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో నెలలు శ్రమించి పండించిన ధాన్యం క్షణాల్లో బూడిదవుతుండటం బాధాకరం అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/world/which-is-the-most-expensive-country-in-the-world-telugu-news-247845&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;వరి కొయ్యలు కాల్చడం వల్ల భూమిలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మ జీవులు నశించి భూమి సారవంతం తగ్గిపోతుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. దీని ప్రభావంతో భవిష్యత్తులో పంటల దిగుబడి కూడా తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు తాత్కాలికంగా సులభమని భావించి కొయ్యలు కాల్చితే, దీర్ఘకాలంలో నేల నాణ్యత దెబ్బతిని పంటలు పండించేందుకు నష్టం జరుగుతుందని.. పంట అవశేషాలను కాల్చకుండా వాటిని సేంద్రియ ఎరువులుగా, పశువుల మేతగా లేదా ఇతర అవసరాలకు వినియోగించడంపై ఫోకస్ చేయాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం వల్ల సంవత్సరాల కష్టం క్షణాల్లో బూడిదవుతోందని అన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;గ్రామ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా మంటలు కనిపిస్తే వెంటనే అగ్నిమాపక శాఖకు, స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రకృతి సంపదను, పంటలను, భూమి సారాన్ని, రైతుల జీవనాధారాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/24/4c2211c37cf71f2c04235d4b99c807701779618723958233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Heatwave: అమ్మో.. ఇవేం ఎండలురా బాబు..  తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/watch-video-of-a-man-using-leaves-for-shade-highlights-severe-telangana-heatwave-atn-248185</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/watch-video-of-a-man-using-leaves-for-shade-highlights-severe-telangana-heatwave-atn-248185#respond</comments><pubDate>Sat, 23 May 2026 18:42:43 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/watch-video-of-a-man-using-leaves-for-shade-highlights-severe-telangana-heatwave-atn-248185</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్: తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వాతావరణశాఖ హెచ్చరించినట్లుగానే భారీగా పగటి ఉష్ణోగ్రతలు (46 డిగ్రీలకు పైగా) నమోదవుతున్నాయి. దాంతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎన్నో కుటుంబాలలో ఎండలు విషాదాన్ని నింపుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎండలకు తట్టుకోలేక ఓ వ్యక్తి తలపై కానుగ ఆకుల కొమ్మను కట్టుకుని సేదతీరుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;భానుడి భగభగలకు మనుగడ సాగించడం తెలంగాణలో కొన్ని జిల్లాల ప్రజలకు కష్టంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రమైన వడగాల్పుల తీవ్రతకు అద్దం పట్టే ఒక ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్&amp;zwnj;గా మారింది. ఎండల తీవ్రతను తట్టుకోలేక ఒక వ్యక్తి తన తలపై పచ్చటి కానుగ ఆకులను కవచంలా పెట్టుకుని బైకు మీద ప్రయాణిస్తున్నారు. ఈ వినూత్న ఆలోచోన మొదట కాస్త వింతగా అనిపించినప్పటికీ, దీని వెనుక ఎండల తీవ్రతకు అర్థం చేసుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణవ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో, ఎండల బారి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఇలాంటి మార్గాలను వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, డెలివరీ బాయ్స్, రైతులు, అత్యవసర పనులపై రోడ్లెక్కి గంటల తరబడి ప్రయాణించే వారికి ఈ వేసవి కాలం ఒక పెద్ద సవాలుగా మారింది. ఎండ తీవ్రత కేవలం అసౌకర్యానికే పరిమితం కాకుండా, ప్రాణాలు సైతం తీస్తోంది. రోడ్ల నుంచి వచ్చే సెగలు, వీస్తున్న వేడి గాలుల మధ్య ప్రయాణించే వారు ఆ వ్యక్తికి వచ్చిన ఈ కానుగ ఆకుల ఐడియాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;Under the blazing Telangana summer sun, survival itself is becoming an innovation.&lt;br /&gt;&lt;br /&gt;A striking visual circulating on social media captured the reality of the ongoing heat wave in the state, a man riding a motorcycle with fresh Pongamia Pinnata (Kanuga) leaves placed on his head,&amp;hellip; &lt;a href=&quot;https://t.co/YuaGJHP5Bk&quot;&gt;pic.twitter.com/YuaGJHP5Bk&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Jacob Ross (@JacobBhoompag) &lt;a href=&quot;https://twitter.com/JacobBhoompag/status/2058126610193358897?ref_src=twsrc%5Etfw&quot;&gt;May 23, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.twitter.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;ఎండ బారి నుంచి కాపాడుకుంటున్నావు సరే.. మరి బైకుకు ప్రమాదం జరిగితే నీ ప్రాణాల పరిస్థితి ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎండల బారి నుంచి కాపాడుకోవడం ఒకే.. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే హెల్మెట్ లేకపోవడంతో నీ ప్రాణాలు పోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సైకిల్ మీద వెళ్లే వారికి మాత్రమే ఈ ఐడియా వర్కౌట్ అవుతుందని అంటున్నారు. కానుక ఆకులతో ఎండ నుంచి తప్పించుకోవచ్చు, కానీ ప్రమాదం నుంచి ప్రాణాలను ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోలేవు అని కామెంట్ చేస్తున్నారు. అందరూ ఇలా చెట్ల కొమ్మలు పీకేసి తలపై పెట్టుకుంటే చెట్లు మిగలవు అని సెటైర్లు వేస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp;&lt;a href=&quot;https://telugu.abplive.com/photo-gallery/telangana/nalgonda-revanth-reddy-lays-foundation-for-telanganas-largest-veda-pathashala-and-development-works-at-yadagirigutta-248180&quot;&gt;CM Revanth Reddy Visits Yadagirigutta: యాదాద్రిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల, పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణలో ఇట్లున్నయి ఎండలు.. మస్తు ఎండ కొడుతుందని అన్నారు. మీరు కూడా ఇలాగే కానుక ఆకులు,&amp;nbsp; చెట్ల కొమ్మలు కప్పుకుని ఎండల నుంచి ఉపశమనం పొందాలని సైతం సూచించారు. తెలంగాణలో అందరూ ఇలాగే బయట తిరగాలని సూచించారు. వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరికలను మరింత తీవ్రం చేస్తున్న సమయంలో ఈ వైరల్ వీడియో ఒక హెచ్చరికలా కనిపిస్తోంది. పెరుగుతున్న ఈ అసాధారణ ఉష్ణోగ్రతలు తెలంగాణవ్యాప్తంగా సామాన్యుడి రోజువారీ జీవితాన్ని, వారి ప్రయాణాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో ఈ ఘటనే స్పష్టం చేస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/world/which-is-the-most-expensive-country-in-the-world-telugu-news-247845&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;తెలంగాణలో భానుడి భగభగలు: వడదెబ్బతో 31 మంది మృతి!&lt;/strong&gt;&lt;br /&gt;తెలంగాణలో ఎండల తీవ్రతకు శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు గురై 31 మంది మృత్యువాత పడటం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. మృతుల్లో ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున, వరంగల్&amp;zwnj;లో ఏడుగురు ఉన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. ఆసిఫాబాద్&amp;zwnj; జిల్లా సిర్పూర్&amp;zwnj;లో అత్యధికంగా 46.5 డిగ్రీలు... జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 46.4 డిగ్రీలుగా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల వరకు చేరవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;రానున్న ఆది, సోమవారాల్లో తూర్పు, ఉత్తర జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే, శనివారం కొన్ని ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/b3ff6f6fb30b9c52f233d8b4bcbfe7ec1779541550312233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Bandi Bageerath POCSO case:  బండి భగీరథ్‌ పోక్సో కేసులో పోలీస్ కస్టడీపై సస్పెన్స్‌! మే 26న కోర్టు తుది నిర్ణయం!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/bandi-bageerath-pocso-case-hyderabad-court-reserves-order-police-custody-updates-248125</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/bandi-bageerath-pocso-case-hyderabad-court-reserves-order-police-custody-updates-248125#respond</comments><pubDate>Sat, 23 May 2026 09:16:54 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/bandi-bageerath-pocso-case-hyderabad-court-reserves-order-police-custody-updates-248125</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Bandi Bageerath POCSO case:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణ రాజకీయాల్లో, న్యాయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన కేంద్రమంత్రి &lt;a title=&quot;బండి సంజయ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Bandi-Sanjay&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బండి సంజయ్&lt;/a&gt; కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు కీలక దశకు చేరుకుంది. భగీరథ్&amp;zwnj;ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్&amp;zwnj;పై శుక్రవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తన ఉత్తర్వులను మే 26కు రిజ్వర్ చేసింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;కోర్టులో ఏం జరిగింది?&lt;/h3&gt;
&lt;p&gt;హైదరాబాద్ పోలీసులు భగీరథ్&amp;zwnj;ను మూడు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని, నిందితుడిని ప్రశ్నించడం అత్యవసరమని పోలీసులు తమ పిటిషన్&amp;zwnj;లో పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;POCSO కేసులో కొత్త ట్విస్ట్.. &amp;lsquo;మెడికోవర్&amp;zwnj;లోనే భగీరథ్ దాక్కున్నాడు&amp;rsquo; : KTR  | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/QNxwbAVQZB4&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;అయితే భగీరథ్&amp;zwnj; తరఫున న్యాయవాది కరుణ సాగర్ పోలీసులు విజ్ఞప్తిని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ పిటిషన్&amp;zwnj;ను కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు. ఒక వేళ కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చినా, నిందితుడి హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన వాదించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విచారణ కేవలం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే జరగాలి. విచారణ సమయంలో నిందితుడి న్యాయవాది సమక్షంలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ డిగ్రీ పద్ధతులు గానీ, బలవంతపు చర్యలు గానీ చేపట్టకూడదు.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;కేసు బ్యాక్&amp;zwnj;గ్రౌండ్ ఏంటీ?&lt;/h3&gt;
&lt;p&gt;మే 8న మైనర్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భగీరథ్&amp;zwnj;పై బీఎన్&amp;zwnj;ఎస్&amp;zwnj;, పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. సదరు బాలికతో భగీరథ్ సంబంధం పెట్టుకున్నాడని ఆమెను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన 8 రోజుల తర్వాత పోలీసులు భగీరథ్&amp;zwnj;ను అరెస్టు చేసి రిమాండ్&amp;zwnj;కు తరలించారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అంతకు ముందు తెలంగాణ హైకోర్టు భగీరథ్&amp;zwnj;కు అరెస్టు నుంచి ముందస్తు రక్షణ కల్పించే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా ఆయన హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కూడా ఉపసంహరించుకున్నారు.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;Bhageerath POCSO Case| భగీరథ్ కేసులో కీలక ఆధారాలను సిట్ అధికారులు ఎలా సేకరిస్తారు..?| ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/a5Qj4qJREas&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h3&gt;భగీరథ్ వెర్షన్ ఏంటీ?&lt;/h3&gt;
&lt;p&gt;ఈ కేసులో మరో కోణం కూడా ఉంది. భగీరథ్ కూడా సదరు బాలిక, ఆమె కుటుంబ సభ్యులపై ఎదురు ఫిర్యాదు చేశారు. ఆ బాలికతో తనకు పరిచయం ఉందని, ఆమె ఆహ్వానం మేరకే కుటుంబ వేడుకలకు, స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లామని ఆయన పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;బాలిక తల్లిదండ్రులు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని తాను నిరాకరించడంతో భారీగా డబ్బు డిమాండ్ చేశారని భగీరథ్ ఆరోపించారు. డబ్బు ఇవ్వకుంటే తప్పుడు కేసులు పెడతామని తనను బెదిరించారని ఆయన తన ఫిర్యాదులో వివరించారు. దీనిపై కూడా పోలీసులు ఎఫ్&amp;zwnj;ఐఆర్ నమోదు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో మే 26న వెలువడం కోర్టు తీర్పు అత్యంత కీలకం కానుంది. పోలీసులు కోరినట్టుగా మూడు రోజుల కస్టడీ లభిస్తుందా, లేక రక్షణ నిబంధనలతో, &amp;nbsp;షరతులతో కూడిన కస్టడీ ఉంటుందా అనేది వేచి చూడాలి. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;Bandi Sanjay| నన్ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేస్తారా..!? | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/r3Gcfu-XnCs&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/e31e0404052fc8e2b99866a9269619001779507952172215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-may-2026-248124</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-may-2026-248124#respond</comments><pubDate>Sat, 23 May 2026 08:50:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-may-2026-248124</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Breaking News:&lt;/strong&gt;భారత్&amp;zwnj;లో సామాన్యుడి రవాణా బడ్జెట్&amp;zwnj; మరోసారి తలకిందులైంది గత పది రోజుల్లోనే చమురు సంస్థలు మూడోసారి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. శనివారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ధరల పెంపుతో పెట్రోల్&amp;zwnj;, డీజిల్&amp;zwnj; రేట్లు సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;శనివారం చమురు సంస్థలు విడుదల చేసిన ప్రకటన ప్రకారం పెట్రోల్&amp;zwnj; లీటరుకు 87పైసలు పెరిగింది. డీజిల్&amp;zwnj; లీటరకు 91పైసలుపెరిగింది. సీఎన్జీ ఢిల్లీలో కిలోకు రూపాయి పెరిగింది. ఇప్పుడు అక్కడ కిలో సీఎన్జీ ధర 91.09రూపాయలుగా ఉంది. గడచిన పది రోజులను గమనిస్తే ఇంధన ధరలు మొత్తంగా లీటర్&amp;zwnj;కు దాదాపు ఐదు రూపాయలు పెరిగాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇంధన ధరల పెరుగుదలకు ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక పరిస్థితులు కారణమవుతున్నాయి. పశ్చిమాశియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలు అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో ముడి చమురు ధరలు పెంచుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;భారత్ తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లలో ధరలు పెరిగినప్పుడల్లా దేశీయంగా రేట్లు పెంచక తప్పడం లేదు. గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం, చమురు సంస్థలు ఆ భారాన్ని ప్రజలపై వేయకుండా తామే భరించాయి. 2021-24 మధ్య కాలంలో చమురు సంస్థలు సుమారు 24, 500 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. అలాగనే 2024-25లో ఎల్పీజీ వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు సుమారు నలభై వేల కోట్ల భారాన్ని భరించాయి. ఈ నష్టాలను భర్తీ చేసుకునే క్రమంలో ఇప్పుడు ధరలను పెంచుతున్నట్టు తెలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ వరుస ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాదు. డీజిల్ ధర పెరగడం వల్ల రవాణా,లాజిస్టిక్ ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, పండ్లు, ఇతర సరకుల రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది.మల్టిపుల్ సెక్టార్లలో ఉత్పత్తి వ్యయం పెరిగి ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుతం ధరలు పెరుగుతున్నప్పటికీ గత నాలుగేళ్లలో భారత్ నాలుగు సార్లు ఇంధన ధరలను తగ్గించిందని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 27న స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్&amp;zwnj;కు పది రూపాయలు తగ్గించారు. దీని వల్ల డీజిల్&amp;zwnj;పై ఎక్సైజ్ సుంకాన్ని దాదాపు సున్నాకి తీసుకొచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో నెలకొన్న అనిశ్చితి తగ్గే వరకు ఇంధన ధరల్లో ఈ హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇంధన వనరుల అన్వేషణపై దృష్టి సారించాలని ఇప్పటికే ప్రధాని మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/cc693aa25c5244d4a36d302b993e96381779506339312215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?]]></title><link>https://telugu.abplive.com/news/india/petrol-diesel-price-hike-india-third-time-in-may-2026-impact-analysis-248118</link><comments>https://telugu.abplive.com/news/india/petrol-diesel-price-hike-india-third-time-in-may-2026-impact-analysis-248118#respond</comments><pubDate>Sat, 23 May 2026 07:49:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/petrol-diesel-price-hike-india-third-time-in-may-2026-impact-analysis-248118</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Petrol Price Hike May 2026:&amp;nbsp;&lt;/strong&gt;దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది. మే నెలలో సామాన్యుడిపై మరోసారి భారం పడింది. శనివారం (మే 23, 2026) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. గత పది రోజుల్లోనే ధరలు పెరగడం ఇది మూడోసారి. అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు పుల్&amp;zwnj;స్టాప్ పడలేదని ఇలా పెట్రోల్ ధరలు పెంచుతున్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;నేటి తాజా ధరలు ఇవే&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు, డీజిల్ ధర 91 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 98.64 నుంచి రూ. 99.51కి, డీజిల్ ధర రూ.91.58 నుంచి రూ. 92.49కి చేరింది.&lt;/p&gt;
&lt;h3&gt;ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటరుకు):&lt;/h3&gt;
&lt;p&gt;హైదరాబాద్&amp;zwnj;: పెట్రోల్ రూ. 111.88 (+0.87), డీజిల్ రూ. 99.95 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;ముంబై: పెట్రోల్ రూ. 108.49 (+0.87), డీజిల్ రూ. 95.02 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;కోల్&amp;zwnj;కతా: పెట్రోల్ రూ. 110.64 (+0.87), డీజిల్ రూ. 97.02 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;చెన్నై: పెట్రోల్ రూ. 105.31 (+0.87), డీజిల్ రూ. 96.98 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;గురుగ్రామ్: పెట్రోల్ రూ. 100.38 (+0.87), డీజిల్ రూ. 92.92 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;నోయిడా: పెట్రోల్ రూ. 98.78 (+0.87), డీజిల్ రూ. 93.12 (+0.91).&lt;/p&gt;
&lt;h3&gt;గత 10 రోజుల్లో ఏం జరిగింది?&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఈ నెలలో పెట్రోల్ ధరల బాదుడు మే 16న ప్రారంభమైంది. ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా లీటరుకు రూ. 3 వరకు పెంచారు. ఆ తర్వాత మే 19న మెట్రో నగరాల్లో మరో 90 పైసలు పెరిగాయి. తాజా పెరుగుదలతో కలిపి చూస్తే, గత పది రోజుల్లోనే ఇంధన ధరలు దాదాపు రూ.5 మేర పెరిగాయి. కేవలం పెట్రోల్, డీజిల్ ధరలే కాకుండా ఇటీవలి రోజుల్లో సిఎన్&amp;zwnj;జి (CNG), పిఎన్&amp;zwnj;జి (PNG) ధరలు కూడా పలు నగరాల్లో పెరిగాయి. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;Adilabad Public Opinion on Petrol Rates | ఆదిలాబాద్ జిల్లాలో వాహనదారుల ఆందోళన | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/nJUeVpjXDNk&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇలా ధరలు పెంచుతున్నారు. ప్రపంచ మార్కెట్&amp;zwnj;లో క్రూడ్ ఆయిల్ ధరలు నిలకడగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. వెస్ట్ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో ఏ చిన్న మార్పు వచ్చినా, అది మన దేశీయ ధరలపై ప్రభావం చూపుతుంది&lt;/p&gt;
&lt;h3&gt;సామాన్యుడిపై ప్రభావం &amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు అన్ని రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.&lt;br /&gt;రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతాయి. దీంతో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. రవాణా భారం పెరిగితే అది చివరకు సామాన్య వినియోగదారుడిపైనే పడుతుంది, దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. మే నెలలో మూడోసారి జరిగిన ఈ ధరల పెంపు మధ్యతరగతి జీవి బడ్జెట్&amp;zwnj;ను అస్తవ్యస్తం చేస్తోంది.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/9c111b1825415d75fd5cd660a3a30ed31779502511854215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Heatwave deaths Telangana AP:అగ్ని గుండంలా తెలుగు రాష్ట్రాలు! వడదెబ్బకు పోతున్న ప్రాణాలు! రికార్డులు తిరగరాస్తున్న ఉష్ణోగ్రతలు!]]></title><link>https://telugu.abplive.com/news/telangana-ap-heatwave-deadly-summer-2026-updates-deaths-records-248115</link><comments>https://telugu.abplive.com/news/telangana-ap-heatwave-deadly-summer-2026-updates-deaths-records-248115#respond</comments><pubDate>Sat, 23 May 2026 06:19:01 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/telangana-ap-heatwave-deadly-summer-2026-updates-deaths-records-248115</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Heatwave deaths Telangana AP:&lt;/strong&gt;తెలుగు రాష్ట్రాల్లో సూరీడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. ఈ దెబ్బకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గత 24 గంటల్లోనే వడదెబ్బ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఎన్నడూ లేని విధంగా మే నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో సూరీ ఊచకోత&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో శుక్రవారం ఒక్క రోజు వడబెద్దకు 21 మంది మరణించారు. ఇందులో అత్యధికంగా విజయవాడలోనే ఉన్నారు. ఇక్కడ పది మంది మరణించారు. మృతుల్లో ఎనిమిది మంది యాచచకులే. రోడ్డు పక్కన, పార్కుల వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. &amp;nbsp;ఇక ఏలూరులో ముగ్గురు, కాకినాడలో ముగ్గురు, పల్నాడులో ఇద్దరు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;తెలంగాణ నిప్పుల కొలిమి&lt;/h3&gt;
&lt;p&gt;తెలంగాణలో ఎండల తీవ్రత మరింత భీకరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వడ దెబ్బతో 34మంది మరణించినట్టు తెలుస్తోంది. దాదాపు ఇరవైకిపైగా జిల్లాల్లో 46 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కుమురం భీం ఆసీఫాబాద్&amp;zwnj; జిల్లాలోని సిర్పూర్(టి)లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్&amp;zwnj; ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎందుకు ఈ పరిస్థితి&lt;/h3&gt;
&lt;p&gt;ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఎండలు కేవలం వేసవి ప్రభావం మాత్రమే కాదు. హిందూ మహాసముద్రంలో వేడి పెరగడం వల్ల ఏర్పడే ఎల్&amp;zwnj;నినో ప్రభావంతో వడగాలుల సంఖ్య, వాటి వ్యవధి పెరుగుతోంది. నగరాల్లో కాంక్రీట్ కట్టడాలు, వాహనాల వినియోగం వల్ల వేడి గాలి బయటకు వెళ్లకుండా అక్కడే నిలిచిపోతోంది. ఫలితంగా నగరాల్లో ఉష్ణోగ్రతలు గ్రామీణ ప్రాంతాల కంటే రెండు నుంచి పది డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మీ గుండె భద్రం&lt;/h3&gt;
&lt;p&gt;రాజస్థాన్, పంజాబ్ ఎడారి ప్రాంతాల నుంచి వీస్తున్న పొడి వేడి గాలుల మధ్య భారతంతోపాటు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా రాత్రి పూట చల్లబడాల్సిన వాతావరణం, ప్రస్తుతం 24-30 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు అవుతోంది. ఇది మానవుల గుండపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మరో నాలుగు రోజులు ఇదే తంతు&lt;/h3&gt;
&lt;p&gt;వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకం. అందుకే తెలంగాణలోని 18 జిల్లాలు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శని, ఆదివారాల్లో కూడా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎండల వల్ల కేవలం ప్రాణ నష్టమే కాదు ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రతకు రోడ్డుపై వెళ్తున్న స్కూటీ మంటల్లో చిక్కుకుంది. జనగామా జిల్లాలో ఎండల వల్ల పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. ధాన్యం కుప్పలు బూడిద అయ్యాయి. ఎండల వల్ల ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో గ్రిడ్&amp;zwnj; డిమాండ్ రికార్డు స్థాయిలో 15, 016 మెగావాట్లకు చేరింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రకృతి వైపరిత్యాలు మన చేతల్లో లేకపోయినా, అప్రమత్తతతో ప్రాణనష్టాన్ని తగ్గించవ చ్చు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, వృద్ధులు ఈ ఎండల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/d48fb75c61a4176b3cc996446019a3391779497175229215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Bandi Bhagirath Case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/bandi-bhagirath-pocso-case-sit-investigation-former-dcp-reddanna-exclusive-interview-248050</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/bandi-bhagirath-pocso-case-sit-investigation-former-dcp-reddanna-exclusive-interview-248050#respond</comments><pubDate>Fri, 22 May 2026 16:35:49 +0530 </pubDate><dc:creator><![CDATA[ M Seshu ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/bandi-bhagirath-pocso-case-sit-investigation-former-dcp-reddanna-exclusive-interview-248050</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Bandi Bhagirath Case:&lt;/strong&gt; హై ప్రొఫైల్ కేసుగా మారిన బండి భగీరథ్&amp;zwnj; పోక్సో కేసుపై సిట్ విచారణ ఎలా సాగనుంది? డిజిట్&amp;zwnj; ఆధారాలు శిక్ష పడేలా చేస్తాయా? &lt;a title=&quot;బండి సంజయ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Bandi-Sanjay&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బండి సంజయ్&lt;/a&gt;&amp;zwnj;ను కూడా సిట్ అధికారులు విచారిస్తారా అనే అంశాలపై ఏబీపీ దేశం ప్రతినిధితో రిటైర్డ్ డీసీపీ బి. రెడ్డన్న పంచుకున్న విశ్లేషణాత్మక వివరాలు చూద్దాం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;ABP దేశం:&amp;nbsp;బండి భగీరథ్&amp;zwnj;పై పోక్సో కేసులో సిట్ విచారణ ఎలా సాగుతోంది? వాట్సప్ చాట్, కాల్ రికార్డింగ్స్ , వీడియోలు కీలక మారుతాయా?&lt;/span&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బి. రెడ్డన్న, మాజీ డీసీపీ:&amp;nbsp;&lt;/strong&gt;బండి భగీరథ్&amp;zwnj;పై పోక్సో కేసులో వాళ్లిద్దరి మధ్య వాట్సప్ చాటింగ్, ఫోన్ కాల్స్ మాత్రమేకాదు అన్ని అధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు సిట్ అధికారులు. అంతేకాదు సోషల్ మీడియాలో ఇతర మాద్యమాల ద్వారా చాటింగ్ డేటాను కూడా ఆధారాలుగా తీసుకుంటారు. ఘటనకు ముందు తరువాత వీళ్లు ఎవరిని కలిశారు. ఎక్కడ తిరిగారు. మధ్యవర్తులు ఎవరైనా ఈ కేసులో మాట్లడారా? ఏం మాట్లడారు. ఇలా వాళ్లందరినీ పోలీసులు పిలిపించి, సమగ్రంగా విచారిస్తారు. పోలీసు విచారణలో లేదా న్యాయస్దానంలో విచారణ జరిగే క్రమంలో ఎవరైతే మైనర్ బాధితురాలు లేదా బాధితుడి ఫోటో అత్యంత గోప్యంగా ఉంచుతారు. వీటిని బహిర్గతం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలుంటాయి. బాధిత అమ్మాయి చెప్పిన సమాచారాన్ని స్పెషల్ కోర్టులో ఇన్ కెమెరాలో వన్ బై వన్ విచారణ చేస్తారు. జడ్జి చాంబర్&amp;zwnj;లో ఇతరులు చూడకుండా విచారణ జరపడమేకాదు, మొత్తం విచారణలో ఏం ప్రశ్నలు అడిగారు, బాధితురాలు ఎలా సమాధానం చెప్పింది అనే అన్ని విషయాలను పూర్తిగా వీడియో రికార్డ్ చేస్తారు. పోక్సో కేసులో నిందితుడ్ని సైతం ఇదే విధంగా విచారిస్తారు. అలా వీడియో రికార్డ్ చేయడంతోపాటు వాళ్లు ఏం మాట్లడారు అనేది పూర్తి గోప్యంగా ఉంచుతారు. కేవలం కోర్టులో జడ్జికి మాత్రమే వీడియో వివరాలు అందజేస్తారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;ABP దేశం:&amp;nbsp;బండి భగీరథ్ తండ్రిని కలిస్తే బెదరించారని బాధితురాలి తల్లి చెబుతోంది, నిందితుడి తండ్రిని విచారిస్తారా?&lt;/span&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బి. రెడ్డన్న, మాజీ డీసీపీ:&amp;nbsp;&lt;/strong&gt;బండి భగీరథ్&amp;zwnj;పై నమోదైన పోక్సో కేసులో ప్రతీ ఒక్కరినీ విచారించవచ్చు. మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తితో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులను అక్కడకు తీసుకెళ్లిన డ్రైవర్&amp;zwnj;ను సైతం విచారిస్తారు. ఈ నేపథ్యంలో నిందితుడు బండి భగీరథ్ తండ్రిని కూడా విచారించవచ్చు. ఈ కేసుతో ప్రమేయం ఉన్నవాళ్లు ఎవరైనా, వాళ్లు ఏ హోదాలో ఉన్నా విచారణ ఎదుర్కోక తప్పదు. సీఎం హత్య చేస్తే కచ్చితంగా విచారిస్తారో ఇది కూడా అంతే. పోలీసు అధికారి రేప్ చేస్తే కేసు అవుతుంది, అదేస్దాయిలో ప్రజాప్రతినిధులను కూడా విచారిస్తారు. పెద్ద హోదాలో ఉన్నా విచారించే హక్కు పోలీసు అధికారులకు ఉంటుంది. సాక్షిగా అయితే సాక్షిగా విచారిస్తారు. బెదిరించారు అని తేలితే, ప్రలోభ పెట్టారని ఆధారాలను చూపితే, కచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;ABP దేశం:&amp;nbsp;పోక్సో కేసులో మీడియా హద్దులేంటి..?&lt;/span&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బి. రెడ్డన్న, మాజీ డీసీపీ:&amp;nbsp;&lt;/strong&gt;ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరినీ ముందుగా విచారించిన తరువాత, వాళ్లిచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడ్ని కస్టడీకీ కోరే అవకాశాలున్నాయి. నిందితుడు ఇచ్చే సమాధానాలు ఆధారంగా అవసరమైతే 2 లేదా అంతకంటే ఎక్కువ రోజులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తారు. బాధితురాలు మైనర్ కావడంతో ఈ కేసులో మెడికల్ ఎగ్జామినేషన్ విషయంలో చాలా జగ్రత్తలు పాటిస్తారు. మెడికల్ ఎగ్జామిన్ చేస్తున్న డాక్టర్ ఎట్టి పరిస్దితిలోనూ బాధితురాలి ఐడెంటీని ఎక్కడా బహిర్గతం చేయకూడాదు. పోలీసు అధికారులు సైతం సాక్షులను, పంచనామా ద్వారా సేకరించిన ఆధారాలు సీల్డ్ కవర్&amp;zwnj;లో కోర్టులో జడ్జికి సమర్పిస్తారు. పూర్తి వివరాలతో ఛార్జిషీట్ దాఖలు చేస్తారు. విచారణ క్రమంలో ఏ రోజు ఎవరిని విచారించారో బయటకు చెప్పకూడాదు. కేసు విచారణపై సోషల్ మీడియాలో ,య్యూట్యూబ్ ఛానెల్స్&amp;zwnj;లో ఇష్టమొచ్చినట్లు థంబ్ నెయిల్ పెడితే వాళ్లు కూడా శిక్షార్హులవుతారు. చాలా కేసుల్లో సోషల్ మీడియా యాక్టీవ్&amp;zwnj;గా ఉంటుంది. అలా ఈ కేసుల్లో వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవచ్చు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;ABP దేశం:&amp;nbsp;రాజకీయ ప్రాభల్యం ఉన్న ఈ కేసులో విచారణ అధికారులపై రాజకీయ ఓత్తిడి ప్రభావం చూపుతుందా?&lt;/span&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బి. రెడ్డన్న, మాజీ డీసీపీ:&amp;nbsp;&lt;/strong&gt;ఉద్యోగాలు పణంగా పెట్టి పోలీసు అధికారులు ఎప్పుడూ ఉద్యోగాలు చేయరు. చట్టానికి లోబడే పనిచేస్తారు. చట్టం అతిక్రమిస్తే పోలీసులు సైతం జైలుకు వెళ్లక తప్పదు. అలా అనేకమంది జైలుకు వెళ్లిన అధికారులున్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే. పోలీసులు సైతం ఇందుకు అతీతులు కాదు. ఒత్తిడి అనేది చాలా కేసుల్లో ఉంటుంది. నిందితుల ప్రాబల్యం&amp;nbsp; ఉన్న ప్రతీ కేసులో ఒత్తిడి ఉంటుంది కానీ విచారణ అధికారులు అవేవీ పట్టించుకోరు. అలా ప్రభావం చూపితే, వాళ్లే జైలుకు వెళ్లక తప్పదు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;ABP దేశం: బండి భగీరథ్ కేసులో జీవిత ఖైదును డిసైడ్ చేసే కీలక ఆధారాలేంటి.?&lt;/span&gt;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బి. రెడ్డన్న, మాజీ డీసీపీ:&amp;nbsp;&lt;/strong&gt;నిందితురాలి హోమ్ నుంచి సెమన్ వస్తుంది. ఆ సెమన్ కలెక్ట్ చేస్తారు. నిందితుడి బ్లెడ్ గ్రూప్ టెస్ట్ చేస్తారు. ఆ సెమన్ అతనిదే అని తెలిస్తే రేప్ చేశాడని చెప్పడానికి అంతకంటే మించి ఆధారం ఇంకేముంటుంది. ఈ ఒక్క ఆధారంతోనే జైలు శిక్ష డిసైడ్ అవుతుంది. నేతరం తీవ్రతను బట్టి ఈ కేసుల్లో ఏడేళ్ల నుంచి జీతకాలం జైలు శిక్షపడిన సందర్భలున్నాయి. ఇటీవల వరంగల్&amp;zwnj;లో 33ఏళ్లు జైలు శిక్ష విధించారు. విదేశాల్లో 200 ఏళ్లు జైలు కూడా విధించారు. మైనర్ అమ్మాయి లేదా అబ్బాయి ఎవరో మనకు తెలియక పోయినా దారినపోతూ జరిగింది చూసినా, ఆ సాక్ష్యులు చెప్పిన ఆధారాలతో కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తారు. అరెస్ట్, రిమాండ్, ఆ తర్వాత సాక్ష్యాల సమీకరించాలని అనుకుంటే పోలీసు కస్టడీలో తీసుకుని నిందితుడ్ని విచారిస్తారు. సెక్స్ చేసేటప్పుడు కండోమ్ వాడాను, దాచేశానని నిందితుడు విచారణలో చెబితే, సెక్షన్ 27 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద చార్జ్ షీట్&amp;zwnj;లో అతనికి వ్యతిరేకంగా పెడతారు. ఇలా కేసును అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేస్తారు. సీల్డ్ కవర్&amp;zwnj;లో జడ్జికి మాత్రమే ఆధారాలను సమర్పిస్తారు సిట్ అధికారులు. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి విచక్షణపైన శిక్ష ఆధారపడి ఉంటుంది. పదేళ్లు, ఏడు లేదా జీవితకాలం ఒక్కోసారి ఉరి శిక్ష కూడా విధించిన సందర్భాలున్నాయి.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/22/063037155ef901367a5550cc4db4f55d1779440242658479_original.PNG" width="220"/></item><item><title><![CDATA[Breaking News: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల! జూన్ 18న పోలింగ్!]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-22nd-may-2026-248017</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-22nd-may-2026-248017#respond</comments><pubDate>Fri, 22 May 2026 07:16:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-22nd-may-2026-248017</guid><description><![CDATA[&lt;p&gt;Breaking News: విజయవాడ పటమటలోని వంద అడుగుల రోడ్డులో సినిమాను తలపించే యాక్షన్ సీన్స్ కనిపించాయి. అమ్మాయి కోసం ఇద్దరు యువకులు వార్&amp;zwnj;కు దిగారు. వారి వద్ద ఉన్న థార్&amp;zwnj; వాహనాలతో రోడ్డుపై పోట్లాడుకున్నారు. ఓం రోహిత్ అనే ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం అక్కడకు చేరుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మిగతా వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;హీరా గోల్డ్ నౌహీరా షేక్ అరెస్టు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్&amp;zwnj;ను &amp;nbsp;ఈడీ అధికారులు గురుగ్రామ్&amp;zwnj;లో అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, నకిలీ గుర్తింపు కార్డులతో పరారీలో ఉన్న ఆమెను ఎట్టకేలకు పట్టుకున్నారు. 5,600 కోట్ల మేర పెట్టుబడిదారులను మోసం చేసిన &amp;nbsp;ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తరలిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/22/4e66bd1dbd3a8edbe18d950968bebd951779414256927215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!]]></title><link>https://telugu.abplive.com/news/telugu-states-andhra-pradesh-telangana-heatwave-crisis-48-degrees-piduguralla-red-alert-2026-248016</link><comments>https://telugu.abplive.com/news/telugu-states-andhra-pradesh-telangana-heatwave-crisis-48-degrees-piduguralla-red-alert-2026-248016#respond</comments><pubDate>Fri, 22 May 2026 06:53:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/telugu-states-andhra-pradesh-telangana-heatwave-crisis-48-degrees-piduguralla-red-alert-2026-248016</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Heatwave in Andhra Pradesh and Telangana: &lt;/strong&gt;తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం నిప్పుల కొలిమిలా మారాయి. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎల్&amp;zwnj;నినో ప్రభావంతో మరిన్ని రోజులు ఈ వేడి కొనసాగే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం అగ్ని గుండాలను తలపిస్తున్నాయి. వేసవి తీవ్రత గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో భానుడు తన ప్రచండ రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 7 గంట నుంచే బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. వేడిగాలులు, ఉక్కపోతతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో రికార్డుల మోత&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఎండల తీవ్రత భయంకరంగా ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. బుధవారం పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, గురువారం అది ఏకంగా 48.1 డిగ్రీలకు చేరుకుంది. ఇది గత 11 ఏళ్లలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డు సృష్టించింది. 2019లో ఇక్కడ 45.5 డిగ్రీలు మాత్రమే నమోదు అయ్యింది. మొన్నటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డుల్లో ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేవలం పల్నాడుజిల్లా మాత్రమే కాదు, రాష్ట్రంలోని 20 జిల్లాలోని సుమారు 200 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. విజయనగరం జిల్లాలో వడదెబ్బ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. రాత్రి వేళల్లో కూడా ఉపశమనం లభించడం లేదు. దాదాపు 42 డిగ్రీల వేడి కొనసాగుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;తెలంగాణలో రెడ్ అలర్ట్&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే ఇరవై మందికిపైగా మరణించారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 9 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటాయి. పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేటజిల్లా మునగాలలో అత్యధిక 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;Breaking |  Fire accident at Charminar | పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. మదీనా చౌరస్తా| ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/9Lxo0q-Bp6o&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుతం విపత్కర పరిస్థితులకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పసిఫిక్&amp;zwnj; మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ఎల్&amp;zwnj;నినో పరిస్థితులు భారత ఉపఖండంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం. గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోవడంతో వేడి తీవ్రత రెట్టింపు అవుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం వల్ల వాతావరణం చల్లబడటం లేదు. రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి వీస్తున్న పొడి గాలులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్&amp;zwnj;ను ఉడికిస్తున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;పచ్చదనం తగ్గడంతో ప్రమాదం&lt;/h3&gt;
&lt;p&gt;అదనంగా ఉత్తర భారత్&amp;zwnj;లోని బాండా వంటి నగరాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటడానికి అడవులు నరికివేత, నదుల్లో ఇసుక తవ్వకాలు, గ్రీన్ కవర్ తగ్గడం వంటి మానవ తప్పిదాలు కూడా &amp;nbsp;కారణం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పచ్చదనం తగ్గడం ఈ వేడికి పరోక్ష కారణం కావచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మరో వారం రోజులు ఇదే పరిస్థితి&lt;/h3&gt;
&lt;p&gt;గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా మే నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7-8 డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. పల్నాడు నుంచి ఢిల్లీ వరకు ఉన్న స్ట్రెచ్&amp;zwnj;లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. &amp;nbsp;&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/22/1df6a35a5fe8c8cd3687960e25eb9ff11779412899529215_original.jpg" width="220"/></item></channel></rss>