YS Vijayamma: షర్మిల భయపడే రకం కాదు, రేపు ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు - వైఎస్ విజయమ్మ

Venkatesh Kandepu Updated at: 25 Apr 2023 11:47 AM (IST)

షర్మిలను చంచల్ గూడలోని మహిళా కారాగారానికి తరలించిన సంగతి తెలిసిందే. జైలులో ఉన్న షర్మిలను విజయమ్మ పలకరించేందుకు కారాగారం లోనికి వెళ్లారు.

జైలు వద్ద మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ విజయమ్మ

NEXT PREV

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ చంచల్ గూడ జైలుకు వెళ్లారు. పోలీసులపై దాడి చేశారనే కేసులో నిన్న (ఏప్రిల్ 24) రాత్రి కోర్టు షర్మిలకు రిమాండ్ విధించడంతో ఆమెను చంచల్ గూడలోని మహిళా కారాగారానికి తరలించిన సంగతి తెలిసిందే. జైలులో ఉన్న షర్మిలను విజయమ్మ పలకరించేందుకు కారాగారం లోనికి వెళ్లారు.


బయటకు వచ్చిన అనంతరం జైలు బయట వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఎందుకు ప్రశ్నిస్తుందనే విషయాన్ని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. యువతకు అన్యాయం జరిగినందున షర్మిల ప్రశ్నిస్తోందని అన్నారు. గ్రూపు ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో గళం ఎత్తుతుంటే ప్రభుత్వం అణచివేస్తుందని అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదని ప్రభుత్వం అనుకుంటే, రేపటి నాడు ప్రజలు, యువకులే ప్రభుత్వానికి సమాధానం చెబుతారని అన్నారు. నేడో, రేపో బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు.


ఇలాంటి పనులకు వైఎస్ షర్మిల భయపడే రకం కాదని అన్నారు. ప్రజలకు రాజశేఖర్ రెడ్డి ఆశయాలను చేరువ చేయాలనే లక్ష్యంతో షర్మిల పోరాడుతోందని చెప్పారు. అందుకే వేలాది కిలో మీటర్ల చొప్పున పాదయాత్ర చేసిందని గుర్తు చేశారు. 



ఇలాంటివాటికి భయపడే మనిషి కాదు షర్మిల. ప్రజల కోసం పోరాటానికే వచ్చిందామె. ఒక ఆడపిల్ల 3,800 కిలో మీటర్లు పాదయాత్ర చేసింది. ప్రజల కోసం ఇన్ని ప్రశ్నలు వేస్తుందనే దురుద్దేశంతోనే అరెస్టు చేశారు. ఇంకో రోజులో పాదయాత్ర ముగుస్తుందనగా కూడా అరెస్టు చేశారు. ఇది ఐదోసారి అరెస్టు చేయడం. ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్లే స్వేచ్ఛ కూడా లేదా? సిట్ ఆఫీసుకు వెళ్తే ఏమవుతుంది? ఆమె వేలాది మందితో వెళ్లట్లేదు. ఉద్యమకారిణి, టెర్రరిస్టు కాదు కదా? కాంగ్రెస్, బీజేపీలకు అన్ని అనుమతులు ఇస్తున్నారు. షర్మిలకు ఎందుకు బయటికి పోనివ్వడం లేదు? - విజయమ్మ

Published at: 25 Apr 2023 11:33 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.