న్యాయస్థానాన్ని ప్రభావితం చేసేలా, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించిన రాయసం దామోదర్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!
Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్ పోక్సో కేసు మరో మలుపు తిరగబోతోంది. ఈయన చేతిలో మోసపోయిన బాధితులు మరికొందరు ఉన్నట్టు న్యాయవాదులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.

- బండి భగీరథ్ పోక్సో కేసు: న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే కుట్ర.
- హైకోర్టు న్యాయమూర్తి ప్రతిష్ట దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం: అరెస్టు.
- సామాజిక మాధ్యమాల్లో బాధితుల వివరాలు బయటపెట్టి వేధింపులు.
- భగీరథ్ చేతిలో మోసపోయిన మరికొందరు బాధితులు బయటకు రావచ్చు.
Bandi Bhagirath POCSO Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసు ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. బాధితుల సంఖ్య చాాలా ఉందని ఇప్పుడు కేసు పెట్టిన బాధితురాలు తరఫున వాదిస్తున్న న్యాయవాది కోర్టుకు చెప్పడం మరింత సంచలనంగా మారుతోంది. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన కేసులో న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేలా, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై దుష్ప్రచారం చేసేలా సాగుతున్న కుట్రలను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసులో హైకోర్టు న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బ తీసేలా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రధాన నిందితుడు రాయసం దామోదర్ (Rayasam Damodar Arrest) ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఫోక్స్ కేసులో కేవలం ఒకరే కాకుండా, బండి భగీరథ్ చేతిలో మోసపోయిన వారు ఇంకా ఉన్నారనే విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. బాధితురాలి తరఫు న్యాయవాది పీవీ నాగేశ్వరరావు హైకోర్టు న్యాయమూర్తి మాధవీ దేవి ఎదుట ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భగీరథ్ చేతిలో మోసపోయిన మరో ఇద్దరు మైన్లు త్వరలోనే బయటకు వస్తారని, వారు కూడా భగీరథ్ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. గతంలోనూ భగీరథ్ ఆగడాల వల్ల ఇద్దరు యువతులు అభాసుపాలయ్యారని, ఆ బాధితులకు జరిగిన అన్యాయాన్ని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్(Hyderabad Cyber Crime Police)లో నమోదైన ఫిర్యాదు మేరకు, ఈ నెల 16న హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండి భగీరథ్ను కాపాడే ప్రయత్నంలో భాగంగా కొందరు వ్యక్తులు హైకోర్టు న్యాయమూర్తిపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టను భంగం కలిగించే చర్య అని అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, టెక్నికల్ ఆధారాలతో రాయసం దామోదర్ను గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని, జాయింట్ సీపీ శ్వేత నాయకత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో మరో 15మందిపై కేసులు నమోదు అయ్యాయని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని తెలుస్తోంది.
ఈ సోషల్ మీడియా దాడుల వెనుక పెద్ద నెట్వర్క్ ఉందనే అనుమానంతో పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాధితుల వివరాలను బయటపెట్టడం ద్వారా వారిని భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరుగుతోంది. నిందితుడి తరఫున మద్దతుదారులు బాధితురాలి ఫొటోలు, వీడియోలు, ఆమె వ్యక్తిగత వివరాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసి ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని సమాచారం. ఈ స్థాయిలో దుష్ప్రచారం చేయం వల్ల మిగతా బాధితులు భయపడి బయటకు రాకుండా అడ్డుకోవడమే వీరి ప్రధాన ఉద్దేశమని న్యాయ నిపుణులు అనుమానిస్తున్నారు.
సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని కేసులను ప్రభావితం చేయాలనుకోవడం నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. బాధితులు మైనర్లు అయినప్పుడు వారి వివరాలను గోప్యంగా ఉంచాలనే రూల్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
బండి భగీరథ్ పోక్సో కేసులో పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారు?
హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు?
బండి భగీరథ్ కేసులో హైకోర్టు న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారా?
అవును, ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, జాయింట్ సీపీ శ్వేత నాయకత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
సోషల్ మీడియా దాడుల వెనుక ఉద్దేశ్యం ఏమిటని భావిస్తున్నారు?
సోషల్ మీడియాలో బాధితుల వివరాలు బయటపెట్టడం ద్వారా వారిని భయబ్రాంతులకు గురిచేసి, ఇతర బాధితులు బయటకు రాకుండా అడ్డుకోవడమే ప్రధాన ఉద్దేశమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















