అన్వేషించండి

బిహార్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ 2025

(Source:  Poll of Polls)

Rangareddy Accident Exgratia: చేవెళ్ల బస్సు ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం

PM Modi announces Rs 2 lakh exgratia | రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదం బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించాయి.

Chevella Accidents Exgratia | చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మీర్జాగూడ వద్ద కంకర లోడుతో వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మృతిచెందిన వారితో పాటు గాయపడిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచాయి. కేంద్రం మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50000 పరిహారం ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల మేర నష్టపరిహారం అందిస్తామని ప్రకటించింది.

మృతులను గుర్తిస్తున్నాం.. మంత్రి పొన్నం ప్రభాకర్..
చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ దుర్ఘటనలో 19 మంది చనిపోయినట్లు మంత్రి ధృవీకరించారు. మృతదేహాలకు సంబంధించిన పోస్టుమార్టం ప్రక్రియ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతోందని ఆయన తెలిపారు. మరణించిన 19 మందిలో పది మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు, మరియు ఒక చిన్నారి ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. పోలీసులు ఇప్పటికే ఈ 19 మందిలో 13 మంది మృతులను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా..

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే, ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 2 లక్షల పరిహారం అందిస్తున్నామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించి వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.

బాధితులకు పరిహారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణనష్టం తనను తీవ్రంగా బాధించిందన్నారు ప్రధాని మోదీ. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తా అన్నారు. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ ఆర్ ఎఫ్ నుండి రూ.2 లక్షలు నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్ట పరిహారాన్ని అందిస్తాంమని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
Rangareddy Accident Exgratia: చేవెళ్ల బస్సు ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం

రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా గారు  చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటన లో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స ను అందించాలని రాష్ట్ర వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన  చికిత్స ను అందించేందుకు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత , రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్  డైరెక్టర్ డా. నరేంద్ర కుమార్ ,  రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డా . అజయ్ కుమార్ లను ఆదేశించారు.  మంత్రి అధికారులతో ఎప్పటికప్పుడు టెలిఫోన్ లో మాట్లాడి పరిస్థితి ని సమీక్షిస్తున్నారు .

ఘటన లో గాయపడిన వారికి మెరుగైన చికిత్స ను అందించేలా వైద్యుల కమిటీ ని నియమించాలని అధికారులతో టెలిఫోన్ లో ఆదేశించారు. ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను త్వరగా వారి కుటుంబ సభ్యులకు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు .

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
YS Jagan:  వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
Bihar News: బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
Delhi Blasts Case: షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
Advertisement

వీడియోలు

Bihar Election 2025 Exit Poll Results | బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
Drone in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
YS Jagan:  వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
Bihar News: బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
Delhi Blasts Case: షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
Priyanka Jawalkar: అరెరే ప్రియాంక... కుర్రకారు గుండెలు అదిరేలా... లేటెస్ట్ ఫోటోలు చూశారా?
అరెరే ప్రియాంక... కుర్రకారు గుండెలు అదిరేలా... లేటెస్ట్ ఫోటోలు చూశారా?
Ande Sri Last Rites: అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న  సీఎం
అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న సీఎం
Gopi Galla Goa Trip: నిరుద్యోగ నటులు నుంచి గోవాకు... పర్మిషన్స్ లేకుండా అవుట్‌ డోర్‌లో... సినిమా ఎలా చేశారంటే?
నిరుద్యోగ నటులు నుంచి గోవాకు... పర్మిషన్స్ లేకుండా అవుట్‌ డోర్‌లో... సినిమా ఎలా చేశారంటే?
Surendra Koli: ఉరిశిక్ష పడినా నిర్దోషిగా బయటకు వస్తున్న కోలీ - మరో సారి హాట్ టాపిక్ గా మారిన నిథారీ హత్యల కేసు
ఉరిశిక్ష పడినా నిర్దోషిగా బయటకు వస్తున్న కోలీ - మరో సారి హాట్ టాపిక్ గా మారిన నిథారీ హత్యల కేసు
Embed widget