Lady Constable Suicide: నిశ్చితార్థం రద్దవుతుందన్న భయంతోనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య!
Lady Constable Suicide: గతంలో ఓసారి నిశ్చితార్థం జరిగి పెళ్లి రద్దయింది. ఏడాది తర్వాత మరోసారి పెళ్లి నిశ్చయించగా... ఇది కూడా రద్దు అవుతుందేమోనన్న భయంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది.
Lady Constable Suicide: నిశ్చితార్థం రద్దవుతుందేమోనన్న భయంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. గతంలోనే ఓ సారి పెళ్లి నిశ్చయం అయి నిశ్చితార్థం అయ్యాక క్యాన్సిల్ అయింది. ఏడాది తర్వాత మళ్లీ పెళ్లి కుదిరింది. అయితే వరసకు అతడు.. సదరు మహిళకు కొడుకు అవుతాడని కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం విని.. ఈ నిశ్చితార్థం కూడా ఎక్కడ క్యాన్సిల్ అవుతోందనని భయపడింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.
అసలేం జరిగిందంటే..?
రంగారెడ్డి జిల్లా కందుకూరు జైతారం గ్రామానికి చెందిన 28 ఏళ్ల సురేఖ 2018 బ్యాచ్ కానిస్టేబుల్. అయితే ఈమె ప్రస్తుతం తన సోదరితో కలిసి అలియాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటోంది.హైదరాబాద్ లోని పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో పని చేస్తుంది. అయితే సురేఖకు ఏడాది క్రితం నిశ్చితార్థం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి రద్దు అయింది. అయితే ఏడాది తర్వాత అంటే ఈనెల 1వ తేదీన స్వగ్రామానికి చెందిన మరో యువకుడితో పెళ్లి కుదిరింది. అయితే ఆ యువకుడు సురేఖకు వరుసకు కొడుకు అవుతాడట. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు చర్చించుకుంటుండగా సురేఖ విన్నది. ఈ క్రమంలోనే గతంలో లాగానే ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుందేమోనని భయపడింది. తన పరువు పోతుందని భావించి ప్రాణాలు తీసుకోవడం మేలనుకుంది. అనుకున్నదే తడువుగా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న శాలిబండ పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
నెలరోజుల క్రితం జనగామలో ఎస్సై దంపతుల ఆత్మహత్య
జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలోనే ఎస్సై దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. ముందు ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుంటే కాసేపటికే భర్త కూడా గన్తో కాల్చుకొని తనువు చాలించారు. జనగామ పట్టణంలో ఎస్సైగా పని చేస్తున్న కాసర్ల శ్రీనివాస్, భార్య స్వరూపతో కలిసి వెంకన్నకుంటలో నివాసం ఉంటున్నారు. తెల్లవారు జామున ఎస్సై శ్రీనివాస్ లేచి చూసేసరికి బాత్రూంలో భార్య ఉరివేసుకొని విగతజీవిగా పడి ఉన్నారు. దాన్ని చూసి షాక్ అయిన శ్రీనివాస్.. విషయాన్ని బంధువులకు చెప్పారు. భార్య మరణంతో బోరున విలపించారు. బంధువులు, స్నేహితులు శ్రీనివాస్ ఇంటికి వచ్చి పరామర్శించారు. ఈ పరామర్శలు జరుగుతుండగానే... వాష్రూంకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లారు. ఇంతలో గన్ సౌండ్ వినిపించింది. ఏమైందో ఏమో అని స్నేహితులు వెళ్లి చూడగా రక్తపు మడుగులో శ్రీనివాస్ పడి ఉన్నారు. డోర్ తెరిచి చూస్తే తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నట్టు గుర్తించారు. గంటల వ్యవధిలోనే భార్యభర్త ఇలా సూసైడ్ చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రెండు ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం ఎస్సై దంపతుల మృతదేహాలను జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరుగుపొరుగు వారి నుంచి, స్నేహితుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets