<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>hyderabad</title><atom:link href="https://telugu.abplive.com/hyderabad/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Wed, 19 Aug 2026 05:54:47 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/minister-ponguleti-srinivas-reddy-clarifies-22a-land-registry-issues-and-counters-opposition-claims-256651</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/minister-ponguleti-srinivas-reddy-clarifies-22a-land-registry-issues-and-counters-opposition-claims-256651#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 20:52:33 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/minister-ponguleti-srinivas-reddy-clarifies-22a-land-registry-issues-and-counters-opposition-claims-256651</guid><description><![CDATA[&lt;p&gt;22A Land Registrations | హైదరాబాద్: 22ఏ నిషేధిత భూముల జాబితాలో అధికారుల పొరపాట్ల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయితే ఈ సమస్యను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ జాబితాలోని 5కి పైగా భూముల రిజిస్ట్రేషన్లు నిన్న పూర్తయ్యాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో సమస్యలను అర్థం చేసుకుంటామన్నారు. ఈ అంశంపై అధికారులతో ప్రత్యేక కమిటీ వేశామని, ఈ నెలాఖరు నాటికి 22ఏ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రబ్బరు చెప్పులతో వచ్చి సంపాదించినవాడ్ని కాదు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పదేళ్లు అధికారంలో ఉన్న హరీష్ రావు 30% కమిషన్ల వ్యవహారాన్ని ఇంకా మర్చిపోలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినప్పుడు ఆయన ఎందుకు బాధ్యత తీసుకోలేదని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. అబద్ధాలతో అధికారంలోకి రావాలనుకుంటున్న అగ్గిపెట్టె రావు కల ఎప్పటికీ పగటికలగానే మిగిలిపోవడం ఖాయమంటూ ఎద్దేవా చేశారు. తాను బాధ్యతగల మంత్రిగా సమస్యలను పరిష్కరిస్తున్నానని స్పష్టం చేశారు. &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, ఆయన వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఛాలెంజ్ చేశారు. ఫీనిక్స్, రాఘవ కంపెనీల మధ్య వ్యాపార లావాదేవీలు సాధారణంగానే జరుగుతాయని పేర్కొన్నారు. తాను 20 ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉంటూ అంచలంచెలుగా ఎదుగుతూ మంత్రి స్థాయికి వచ్చానని, రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదని వ్యాఖ్యానించారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;te&quot;&gt;ఒక చిన్నఅప్లికేషన్ ఇస్తే చాలు న్యాయబద్దంగా ఉంటే, &lt;br /&gt;ప్రైవేటు ఆస్తి 22Aలో ఉంటే క్లియర్ చేపించే బాధ్యత మాది.. &lt;br /&gt;&lt;br /&gt;-నిషేధిత భూముల అంశంపై సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు&lt;a href=&quot;https://x.com/hashtag/Adminpost?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#Adminpost&lt;/a&gt;&lt;a href=&quot;https://x.com/TelanganaCMO?ref_src=twsrc%5Etfw&quot;&gt;@TelanganaCMO&lt;/a&gt; &lt;a href=&quot;https://t.co/csIySvUn3q&quot;&gt;pic.twitter.com/csIySvUn3q&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) &lt;a href=&quot;https://x.com/INC_Ponguleti/status/2089361906004050078?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 17, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;నిషేధిత (22ఏ) జాబితాలో ప్రైవేటు భూములు చేరడానికి అధికారుల పొరపాట్లే ప్రధాన కారణమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి జీవోలు, మెమోల ద్వారా హక్కులు పొందిన భూ రికార్డులను, కోర్టు ఆదేశాలను సరిగ్గా ఆన్&amp;zwnj;లైన్&amp;zwnj;లో అప్&amp;zwnj;లోడ్ చేయకపోవడం వల్ల ఈ సమస్య ఎదురైందని క్లారిటీ ఇచ్చారు. గతేడాది హైకోర్టు సూచనల మేరకు జాబితాను ఆన్&amp;zwnj;లైన్ చేసినప్పుడు పాత రికార్డులే ఉండటంతో ప్రైవేటు ఆస్తులు నిషేధిత పరిధిలోకి వెళ్లాయి.&amp;nbsp;ఇటీవల భూ రిజిస్ట్రేషన్ల ప్రక్షాళన సమయంలో పన్నులు చెల్లించిన భూములను కూడా రిజిస్టర్ చేసేందుకు అధికారులు నిరాకరించడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. దీనిని ప్రభుత్వం సరిదిద్దుతోందని మంత్రి స్పష్టం చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;22 ఏ భూముల వివాదం ఏంటీ..&lt;/strong&gt;&lt;br /&gt;రిజిస్ట్రేషన్ చట్టం 1908 లోని సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వం, దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ పోరంబోకు, అసైన్డ్ భూముల క్రయవిక్రయాలను నిషేధిత జాబితాలో ఉంచుతారు. అయితే, తెలంగాణలో ధరణి పోర్టల్, అధికారుల రికార్డుల నమోదు పొరపాట్ల కారణంగా వేలాది మంది రైతులు, పట్టణ యజమానుల పట్టా భూములు, ప్రైవేటు ఆస్తులు కూడా పొరపాటున ఈ 22A నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. దీనివల్ల బాధితులు తమ ఆస్తులను అమ్ముకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, నిషేధిత జాబితాను సమీక్షిస్తూ అర్హులైన ప్రైవేటు భూములను 22A నుండి తొలగించి రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తోంది. ప్రజలు ఆందోళన చెందవద్దని, సాధ్యమైనంత త్వరగా వీటికి పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం చెబుతోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/4e4f253fe99a0754b6fd8e7ad22cce8e1787066202986233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/cm-revanth-reddy-unveils-sardar-sarvai-papanna-gaud-statue-at-tank-bund-hyderabad-256646</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/cm-revanth-reddy-unveils-sardar-sarvai-papanna-gaud-statue-at-tank-bund-hyderabad-256646#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 19:37:14 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/cm-revanth-reddy-unveils-sardar-sarvai-papanna-gaud-statue-at-tank-bund-hyderabad-256646</guid><description><![CDATA[&lt;p&gt;Sardar Sarvai Papanna Gaud Statue at Tank Bund |&amp;nbsp;హైదరాబాద్: ఇది బహుజనుల తెలంగాణ అని, తమ ఇందిరమ్మ పాలనలో సామాజిక న్యాయం, జీవించే స్వేచ్ఛ ఉందని నిరూపించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో కొడుకు, బిడ్డకు పదవులివ్వగా.. బీసీలకు పదవులిచ్చి గౌరవించకున్న ప్రభుత్వం తమదన్నారు. సందర్శకులు ట్యాంక్ బండ్ పైకి వచ్చినప్పుడు పాపన్న గౌడ్ దర్శనంతో వారిలో స్ఫూర్తి నిండాలనేది తమ సంకల్పమని చెప్పారు. అలాగే నెక్లెస్ రోడ్డులో జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్&amp;zwnj;పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంగళవారం&amp;nbsp; ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. &amp;nbsp;గౌడ సోదరుల సుదీర్ఘ నిరీక్షణకు ఫలితంగా, నెక్లెస్ రోడ్డులోని పర్యాటక కార్యాలయాన్ని తొలగించి మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/b0673f9926479eaf9be5af819cf34e341787061918601233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్&lt;/strong&gt;&lt;br /&gt;సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన మహా వీరుడని, ఆయన తన కుటుంబం కోసమే కాకుండా బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో, తెలంగాణలో పాపన్న గౌడ్&amp;zwnj;కు బహుజనులు అంతే ప్రాధాన్యం ఇస్తారని స్పష్టం చేశారు. బ్రిటిష్ లైబ్రరీలోని ఆధారాల ద్వారా ఆయన పోరాట పటపటిమను నేటి తరం తెలుసుకుందని, బహుజనుల కోసం జీవితాన్ని అంకితం చేయడం వల్లే వందల ఏళ్లు గడిచినా ఆయన కీర్తి నిలిచి ఉందన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపం స్థాయిలోనే ఈ విగ్రహానికి ప్రాధాన్యత ఉంటుందని, ఈ ప్రతిమను కాపాడుకునే బాధ్యత గౌడ సోదరులదేనని, నిత్యం కాంతులీనేలా లైటింగ్, అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/84324282ee769ea67c7d6361374b30b71787061173591233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇదే వేదికపై పాలమూరు వీరుడు పండుగ సాయన్న పోరాట పౌరుషాన్ని గుర్తుచేస్తూ, అక్టోబర్ 22న ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ బాలా గౌడ్, మల్లికార్జున్ గౌడ్ వంటి నేతలను అందించిన చరిత్ర కలిగినదని, వర్కింగ్ ప్రెసిడెంట్&amp;zwnj;గా మహేష్ గౌడ్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తాము కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని, దీనికి గౌడ సోదరులు 100 శాతం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గీత కార్మికుల వృత్తిని రక్షించేందుకు అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని ఆదేశించామన్నారు. రూ.50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేయడంతో పాటు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షల పరిహారం అందిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రభుత్వ భూములు, కాలువ గట్లపై ఈత, తాటి చెట్లను విస్తృతంగా నాటాలని నిర్ణయించామని తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/2f1e2c33eb0d9010d51b0db9693ec7b41787061849659233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కులవృత్తులను గౌరవిస్తూనే డాక్టర్లు, ఇంజనీర్లుగా చేయండి&lt;/strong&gt;&lt;br /&gt;పిల్లలను చదివించి గొప్ప వారిని చేయడమే ఏకైక మార్గమని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. కులవృత్తులను గౌరవిస్తూనే, పిల్లలను చదివించి డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్&amp;zwnj;లుగా తీర్చిదిద్దాలని, చదువుల వల్లనే మధుయాష్కీ గౌడ్ అమెరికా వెళ్లారని, ఆ తర్వాత ఎంపీ కాగలిగారని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం, రాగిజావ, పాలు, నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. ఏటీసీల్లో చేరే విద్యార్థులకు నెలకు రూ. 2 వేల స్టైపెండ్ ఇస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా సమగ్ర పాఠశాలలు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/1c2668ac3858889897e7c6d8e5a078291787061877648233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;కేసీఆర్ కొడుకు, బిడ్డలకు పదవులు.. మనం బీసీలకు పదవులిచ్చాం..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ పాలనకు, తమ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. కేసీఆర్&amp;zwnj;ది కుటుంబ న్యాయం అయితే తమది సామాజిక న్యాయమని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. కేసీఆర్ తన కొడుకు, అల్లుడు, బిడ్డ, బావమర్దులకు పదవులు ఇచ్చుకుంటే, తమ ప్రభుత్వంలో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, వాకిటి శ్రీహరిలకు మంత్రిపదవులు, అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డిలకు రాజ్యసభ, చాకలి ఐలమ్మ మనుమరాలికి, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు మహిళా కమిషన్ సభ్యత్వాలు, కోదండరామ్&amp;zwnj;కు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; రూ. 8.11 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టినందున, ఏడాదికి రూ. 75 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని, అయినా కూడా తాము రూ. 36 వేల కోట్ల రైతు భరోసా, రూ. 95 వేల కోట్ల ధాన్యం కొనుగోలు, మహిళా సంఘాలకు రూ. 60 వేల కోట్ల బ్యాంకు రుణాలు అందించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తోందని పేర్కొన్నారు. విపక్షాలు అసత్యాలతో దాడి చేస్తున్నాయని, చేతబడి పూజలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ ప్రభుత్వం పేదలదని, ప్రతి ఒక్కరూ ఆలోచించి మద్దతుగా నిలవాలని సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; కోరారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/f3ec753bb92a95176aa3fa6989d0b9c91787061640379233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/tpcc-chief-mahesh-kumar-goud-allegations-on-electoral-roll-revision-256638</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/tpcc-chief-mahesh-kumar-goud-allegations-on-electoral-roll-revision-256638#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 16:57:24 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/tpcc-chief-mahesh-kumar-goud-allegations-on-electoral-roll-revision-256638</guid><description><![CDATA[&lt;p&gt;Telangana Politics |&amp;nbsp;హైదరాబాద్: నల్గొండ, వనపర్తి కాంగ్రెస్ పంచాయితీ ముదిరి హైదరాబాద్&amp;zwnj;లోని గాంధీ భవన్&amp;zwnj;కు చేరింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జి. చిన్నారెడ్డికి వ్యతిరేకంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి అనుచరులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. &quot;చిన్నారెడ్డి హటావో, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; బచావో&quot; అంటూ గాంధీ భవన్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలిపారు. గతంలో ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకున్నారంటూ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్&amp;zwnj;ను కలిసి చిన్నారెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డి ఆరోపణలు పార్టీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన ఈ ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకుంది.&lt;/p&gt;
&lt;p&gt;ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని, పరిశీలించిన తర్వాత తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మేఘా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిలకు సంబంధించిన అంశాలన్నింటినీ పార్టీ క్రమశిక్షణా కమిటీ సమగ్రంగా పరిశీలిస్తుందని ఆయన స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;తెలంగాణలో లక్షల ఓట్లు తొలగించారు: మహేష్ కుమార్ గౌడ్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SSR) ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా లక్షలాది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్&amp;zwnj;కుమార్&amp;zwnj; గౌడ్&amp;zwnj; తీవ్రస్థాయిలో ఆరోపించారు. గాంధీభవన్&amp;zwnj;లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన సర్&amp;zwnj; ముసాయిదా జాబితాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని హైదరాబాద్&amp;zwnj;తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు (BLO) సరిగ్గా ఇళ్లను సందర్శించకుండానే పేదలు, వలస కూలీల ఓట్లను అత్యధికంగా డిలీట్ చేశారని ఆయన ధ్వజమెత్తారు.&lt;/p&gt;
&lt;p&gt;కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ తరహాలోనే ఎన్నికల సంఘాన్ని కూడా తమ అధీనంలోని సంస్థగా మార్చుకుందని మహేశ్&amp;zwnj;కుమార్&amp;zwnj; గౌడ్&amp;zwnj; విమర్శించారు. 2002 నాటి ఓటర్ల జాబితా ప్రాతిపదికగా మార్పులు చేయడంపై స్పందిస్తూ, ఆ వివరాలు ప్రస్తుతం ఎంతమందికి అందుబాటులో ఉన్నాయని ప్రశ్నించారు. నియోజకవర్గాల డీలిమిటేషన్, పోలింగ్ కేంద్రాల మార్పుల వల్ల పాత వివరాలు సక్రమంగా లేవని, 2002 జాబితాతో ముడిపెట్టకుండా పౌరులకు నేరుగా ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. అకారణంగా 73 లక్షల ఓట్లను తొలగించి, మొత్తం 92 లక్షల ఓట్లను ప్రశ్నార్థకం చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/4c3696effd8939b53d24e0c4deced2241787051909476233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-22a-prohibited-list-hyderabad-rangareddy-land-registrations-ponguleti-srinivasa-reddy-was-targeted-harish-rao-eatela-rajendar-kavitha-256631</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-22a-prohibited-list-hyderabad-rangareddy-land-registrations-ponguleti-srinivasa-reddy-was-targeted-harish-rao-eatela-rajendar-kavitha-256631#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 15:36:54 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-22a-prohibited-list-hyderabad-rangareddy-land-registrations-ponguleti-srinivasa-reddy-was-targeted-harish-rao-eatela-rajendar-kavitha-256631</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana 22A Lands Issue:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణ రాష్ట్రంలో భూములు రిజిస్ట్రేషన్ల వ్యవహారం మరోసారి తీవ్రమైన చర్చనీయాంశమైంది. ముఖ్యంగా హైదరాబాద్&amp;zwnj;, రంగారెడ్డి, మేడ్చల్&amp;zwnj; మల్కాజిగిరి జిల్లాల్లో లక్షలాది ప్రైవేటు ఆస్తులు అకస్మాత్తుగా 22ఏ(నిషేధిత జాబితా)లోకి చేరడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తమ సొంత భూములు, అపార్టమెంట్&amp;zwnj;లు, కమర్షియల్&amp;zwnj; కాంప్లెక్స్&amp;zwnj;లు నిషేధిత జాబితాలో ఉండటంతో క్రయవిక్రయాలు నిలిచిపోయి ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అస ఏంటీ 22ఏ వివాదం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములను, ఆస్తులను అధికారులు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. దీని వల్ల ఆ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. చాలా చోట్ల ప్రభుత్వం విక్రయించిన ప్లాట్లు, హెచ్&amp;zwnj;ఎండీఏ లేఅవుట్లు కూడా ఈ జాబితాలో ఉంచారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నిషేధిత జాబితాలో ప్రైవేటు భూములు ఎల వచ్చాయి?&lt;/h2&gt;
&lt;p&gt;రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరణ ప్రకారం, ఇది ప్రధానంగా అధికారుల పొరపాటు వల్ల జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్&amp;zwnj; కాలం నుంచి ప్రభుత్వ జీవోలు, మెమోల ద్వారా హక్కులు పొందిన భూములకు సంబంధించిన రికార్డులు ఆన్&amp;zwnj;లైన&amp;zwnj;లో అప్&amp;zwnj;లోడ్ కాకపోవడమే దీనికి ప్రధాన కారణం. గతేడాది హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ జాబితాను కలెక్టర్లు ఆన్&amp;zwnj;లైన్&amp;zwnj;లో అప్&amp;zwnj;లోడ్ కాకపోవడమ దీనికి ప్రధాన కారణం. గతేడాది హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ జాబితాను ఆన్&amp;zwnj;ైన్&amp;zwnj;లో అప్&amp;zwnj;లోడ్ చేసినప్పుడు పాత వివరాలు కూడా అందులో ఉండంతో ఈ సమస్య తలెత్తింది. కోర్టు ఆదేశాలను సరిగ్గా ఆన్&amp;zwnj;లైన్&amp;zwnj;లో సబ్&amp;zwnj;మిట్ చేయకపోవడం వల్ల ప్రైవేటు ఆస్తులు నిషేధిత జాబితాలోకి వెళ్లాయని ప్రభుత్వం పేర్కొంది.&lt;/p&gt;
&lt;p&gt;ఇటీవల కాలంలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రక్షాళన చేస్తున్న క్రమంలో, పెద్ద ఎత్తున ప్రైవేటు ఆస్తులు రిజిస్ట్రేషన్లకు నిరాకరించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రభుత్వం పన్నుల వసూలు చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ సమయంలో ఆ భూమి నిషేధిత జాబితాలో ఉందని చెప్పడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్రభుత్వం చర్యలు, పరిష్కార మార్గాలు &amp;nbsp;&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ప్రజల ఆస్తులకు ఆటంకం కలిగించడం తమ ప్రభుత్వ విధానం కాదని మంత్రి పొంగులేటి భోసా ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెవెన్యూ ప్రన్సిపల్&amp;zwnj; సెక్రటరీ, స్టాంప్స్&amp;zwnj; అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ లోకేష్ కుమార్&amp;zwnj;తో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాబోయే 15 రోజుల పాటు ప్రతిరోజూ సమస్యలను సమీక్షిస్తుంది. ప్రజలు తమ ఫిర్యాదులను తెలియజేయడానికి 18005994788 అనే టోల్&amp;zwnj;ఫ్రీ నంబర్&amp;zwnj;ను అందుబాటులోకి తెచ్చారు. నెలాఖరుకు జెన్యూన్ కేసులన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అధికారుల వల్ల జరిగిన తప్పిదానికి తాను క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పొంగులేటి రాజీనామాకు డిమాండ్&amp;zwnj;&lt;/h2&gt;
&lt;p&gt;ప్రతి పనిలో కమీషన్లు తీసుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు సామాన్యుల భూములపై పడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ హరీష్&amp;zwnj;రావు ఆరోపించారు. నిషేదిత జాబితాలో చిక్కుకున్న భూములు రిలీజ్ చేయాలంటే 30 శాతం కమీషన్ ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను అక్రమంగా లాక్కునేందుకు ప్రయత్నించి తప్పును అధికారులపైకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గత ప్రభుత్వాని కంటే ఈ ప్రభుత్వంలో భూదోపిడీ రెండు రెట్లు పెరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి, &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; ఎంపీ ఈటల రాజేందర్. ప్రభుత్వం వేసిన లేఅవుట్&amp;zwnj;లను కూడా 22ఏలో చేర్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటే కచ్చితంగా ఈ వ్యవహారంలో మాఫియా హస్తం ఉందని ఆరోపించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రజల భూములను అన్యాయంగా లాక్కోవాలని చూస్తే ప్రభుత్వంపై తిరగబడతామని టీఆర్&amp;zwnj;ఎస్ చీఫ్&amp;zwnj; కవిత హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబానికి ఎకరా భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో ఉద్యోగ సమస్యతోపాటు ఈ 22A వివాదం కూడా సభను షేక్ చేసే ఛాన్స్ గట్టిగానే కనిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/ba3cd4b064368135deca728b4b974b021787047351640215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/kbr-park-one-way-system-hyderabad-jubilee-hills-banjara-hills-256609</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/kbr-park-one-way-system-hyderabad-jubilee-hills-banjara-hills-256609#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 11:45:42 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/kbr-park-one-way-system-hyderabad-jubilee-hills-banjara-hills-256609</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;KBR Park Traffic Rules:&lt;/strong&gt;హైదరాబాద్&amp;zwnj;లోని జూబ్లీహిల్స్&amp;zwnj;, బంజారాహిల్స్ ప్రాంతాల మీదుగా ప్రయాణించే వాహనదారులకు కీలక సూచన చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి పూర్తి స్థాయిలో వన్&amp;zwnj;వే విధానాన్ని ప్రారంభించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని శాశ్వతంగా పరిష్కరించేందుకు చేపట్టిన హెచ్&amp;zwnj; సిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కేబీఆర్&amp;zwnj; పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్&amp;zwnj;లు&lt;/h2&gt;
&lt;p&gt;కేబీఆర్&amp;zwnj; పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం 1300 కోట్ల భారీ వ్యయంతో ఫైఓవర్లు, అండర్&amp;zwnj;పాస్&amp;zwnj;లను నిర్మిస్తోంది. ఈ పనులు సాఫీగా సాగడంతోపాటు భవిష్యత్&amp;zwnj;లో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులను దాదాపు 80 నుంచి వంద శాతం వరకు తగ్గించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ భారీ నిర్మా పనుల దృష్ట్యా, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ఉండేందుకు వన్&amp;zwnj;వే విధానాన్ని ప్రవేశ పెట్టారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/amplify_video_thumb/2089231207259365376/img/RRaIf4mU8h8TrJo9?format=jpg&amp;amp;name=small&quot; alt=&quot;Embedded video&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;360 డిగ్రీల వన్&amp;zwnj;వే విధానం అమలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఆగస్టు 18, 2026 మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఆంక్షలు నిర్మాణ పనులు పూర్తి అయ్యే వరకు సుమారు రెండేళ్ల పాటు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.&amp;nbsp;కేబీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీల వన్&amp;zwnj;వే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని వల్ల వాహనాలు పార్క్ చుట్టూ నిర్ణీత రూట్&amp;zwnj;లలో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. వాహనదారుల సౌకర్యార్థం ఈ మార్గంలో 13 లైన్&amp;zwnj; ఛేంజర్లు, పది ఎగ్జిట్&amp;zwnj; పాయింట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే గూగుల్&amp;zwnj; మ్యాప్స్&amp;zwnj;, ఇతర నావిగేషన్ యాప్&amp;zwnj;లో ఈ మార్పులకు అనుగుణంగా రూట్లను అప్&amp;zwnj;డేట్ చేసినట్టు అధికారులు తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot; data-media-max-width=&quot;560&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;&lt;a href=&quot;https://x.com/hashtag/HYDTPinfo?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#HYDTPinfo&lt;/a&gt;&lt;br /&gt;🚦 KBR PARK ONE-WAY TRAFFIC SYSTEM IS NOW LIVE! 🚦&lt;br /&gt;&lt;br /&gt;The One-Way Traffic System around KBR Park is now operational.&lt;br /&gt;&lt;br /&gt;📍 Google Maps have been updated with the new routes for the convenience of commuters.&lt;br /&gt;&lt;br /&gt;🪧 Proper signage boards and necessary traffic equipment have&amp;hellip; &lt;a href=&quot;https://t.co/AYxDVuiBkj&quot;&gt;pic.twitter.com/AYxDVuiBkj&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Hyderabad Traffic Police (@HYDTP) &lt;a href=&quot;https://x.com/HYDTP/status/2089532702794055929?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 18, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HP8LLNkawAA5gie?format=jpg&amp;amp;name=4096x4096&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;నిరంతరం ట్రాఫిక్&amp;zwnj; రద్దీని గమనిస్తూ చర్యలు&lt;/h2&gt;
&lt;p&gt;ఈ కొత్త విధానాన్ని పర్యవేక్షించేందుకు భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వివిధ షిఫ్టుల్లో 450 నుంచి వెయ్యి మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ జోన్&amp;zwnj;లకు చెందిన ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి ట్రాఫిక్&amp;zwnj; కదలికలను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరైజ్&amp;zwnj; కెమెరాల ద్వారా నిరంతరం ట్రాఫిక్&amp;zwnj; రద్దీని గమనిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HP8LLMnbsAAzcst?format=jpg&amp;amp;name=4096x4096&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;h2&gt;బస్టాప్&amp;zwnj;లు రీలొకేషన్&lt;/h2&gt;
&lt;p&gt;హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్&amp;zwnj; వీసీ సజ్జనార్&amp;zwnj; హైదరాబాద్ నగరవాసులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. అక్కడక్కడ ఇబ్బందులు ఉంటాయని వాటిని వెంటనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రాంగ్ రూట్&amp;zwnj;లో ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.&amp;nbsp;బస్టాప్&amp;zwnj;ల మార్పు విషయంలో ఇప్పటికే ఆర్టీసీ ఎండీతో పోలీసులు చర్చలు జరిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాప్&amp;zwnj;లను రీలొకేట్ చేశారు. కేబీఆర్ పార్క్&amp;zwnj;కు వచ్చే వాకర్స్&amp;zwnj; కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. రాత్రివేళల్లో ట్రాఫిక్ తక్కువగా ఉందని అతివేగంగా వెళ్లొద్దని, సైన్ బోర్డులు గమనిస్తూ ప్రయాణించాలని సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HP8LLMoaQAAebfI?format=jpg&amp;amp;name=4096x4096&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ వన్&amp;zwnj;వే విధానాన్ని నేరుగా అమలు చేయకుండా రెండు సార్లు ట్రయల్స్ నిర్వహించారు. అప్పుడు ఎదురైన ఇబ్బందులు గమనించి అవి రిపీట్ కాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ హెచ్&amp;zwnj;-సిటీ పూర్తి అయితే జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్ నెంబర్ 45, ఫిలింనగర్&amp;zwnj; వంటి జంక్షన్ల వద్ద ట్రాఫిక్&amp;zwnj; కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;img src=&quot;https://pbs.twimg.com/media/HP8LLMVbQAAy6Lh?format=jpg&amp;amp;name=4096x4096&quot; alt=&quot;Image&quot; /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/f788fc75217accdd797666726b86ad641787033672045215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు..  7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/h-city-project-works-7-flyovers-and-7-underpasses-planned-for-signal-free-traffic-around-kbr-park-256584</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/h-city-project-works-7-flyovers-and-7-underpasses-planned-for-signal-free-traffic-around-kbr-park-256584#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 03:30:23 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/h-city-project-works-7-flyovers-and-7-underpasses-planned-for-signal-free-traffic-around-kbr-park-256584</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్: మీరు కేబీఆర్ పార్క్, చుట్టుపక్కల ఏరియా నుంచి ప్రయాణిస్తుంటారా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. నేటి (ఆగస్టు 18) నుంచి దాదాపు రెండేళ్లపాటు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీసులు నిర్ణయించారు. హైదరాబాద్ లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్&amp;zwnj;ఫార్మేటివ్ ఇన్&amp;zwnj;ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటి) ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా సిటీలో అత్యంత ముఖ్యమైన జంక్షన్లలో ఒకటైన కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 ప్రధాన జంక్షన్లలో ఫ్లైఓవర్లు, అండర్&amp;zwnj;పాస్&amp;zwnj;ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ. 1,090 కోట్ల అంచనా వ్యయంతో 7 మల్టీ-లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్లు, 7 డైరెక్షనల్ అండర్&amp;zwnj;పాస్&amp;zwnj;లు నిర్మించనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నిర్మాణ సమయాన్ని తగ్గించి త్వరగా ట్రాఫిక్ సమస్యకు చెక్&lt;/strong&gt;&lt;br /&gt;ఈ వన్-వే అమలుపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, నిర్మాణ సమయాన్ని తగ్గించేందుకే ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు &amp;nbsp;తెలిపారు. సమగ్ర అధ్యయనం చేసి, 2 విడతల ట్రయల్ రన్స్ తరువాత GHMC సహకారంతో సమస్యలను పరిష్కరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. KBR Park పరిసర కాలనీవాసులు, వాకర్స్, సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ప్లాన్&amp;zwnj;లో మార్పులు చేస్తున్నామన్నారు. కేబీఆర్ కారిడార్&amp;zwnj;లో ట్రాఫిక్ రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చేపట్టిన మొత్తం 14 నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/8rqpynak83Q?si=-VOud9DPSDmTgner&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;హెచ్-సిటీ ప్రాజెక్టులో నిర్మాణాల వివరాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మొత్తం రెండేళ్లు (24 నెలలు) కాలపరిమితితో రూపుదిద్దుకుంటున్న ఈ హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 6 ప్రధాన జంక్షన్లను 2 ప్యాకేజీలుగా వర్గీకరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్యాకేజీ-1 కింద 3 జంక్షన్ల వద్ద నిర్మాణాలు&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, &amp;nbsp;ముగ్ధ జంక్షన్లు&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;జూబ్లీహిల్స్ చెక్&amp;zwnj;పోస్ట్ జంక్షన్ వద్ద&lt;/span&gt;&lt;/strong&gt;&lt;br /&gt;- రోడ్ నం. 45 జంక్షన్ నుండి KBR పార్క్ ఎంట్రెన్స్, యూసుఫ్&amp;zwnj;గూడ వైపు వెళ్లే స్ట్రెయిట్, రైట్ టర్నింగ్ చేసే వాహనాల కోసం 740 మీటర్ల వై షేప్ (4/3/2 లేన్) యూని-డైరెక్షనల్ అండర్&amp;zwnj;పాస్ నిర్మాణం.&lt;/p&gt;
&lt;p&gt;- కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ నుంచి రోడ్ నం. 36 వైపు వెళ్లే ట్రాఫిక్ కోసం 745 మీటర్ల 4-లేన్ బై-డైరెక్షనల్ పస్ట్ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;- యూసుఫ్&amp;zwnj;గూడ వైపు నుంచి రోడ్ నం. 45 వైపు నేరుగా వెళ్లే ట్రాఫిక్ కోసం 770 మీటర్ల 2 లేన్ యూని-డైరెక్షనల్ సెకండ్ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్ కట్టాలని నిర్ణయించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;strong&gt;కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్&amp;nbsp;&lt;/strong&gt;&lt;/span&gt;&lt;br /&gt;- జూబ్లీహిల్స్ చెక్&amp;zwnj;పోస్ట్ నుంచి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ వైపు వెళ్లే ట్రాఫిక్ కోసం కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ వద్ద 330 మీటర్ల 2 లేన్ యూని-డైరెక్షనల్ అండర్&amp;zwnj;పాస్ నిర్మిస్తారు.&lt;/p&gt;
&lt;p&gt;- అదే విధంగా పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్&amp;zwnj;పోస్ట్ వైపు రైట్ టర్నింగ్ చేసే ట్రాఫిక్ కోసం కేబీఆర్ జంక్షన్ ఎంట్రెన్స్ వద్ద 900 మీటర్ల 3 లేన్ యూని-డైరెక్షనల్ ఫస్ట్ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;strong&gt;ముగ్ధ జంక్షన్ల వద్ద&lt;/strong&gt;&lt;/span&gt;&lt;br /&gt;- కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే ట్రాఫిక్ కోసం ముగ్ధ జంక్షన్ వద్ద 260 మీటర్ల 3-లేన్ యూని-డైరెక్షనల్ అండర్&amp;zwnj;పాస్ వస్తుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ప్యాకేజీ-2 కింద 4 జంక్షన్ల వద్ద నిర్మాణాలు&lt;/strong&gt;&lt;br /&gt;ఫిలింనగర్ జంక్షన్, రోడ్ నంబర్ 45 జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద నిర్మాణాలు చేపడతారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;strong&gt;ఫిలింనగర్ జంక్షన్ వద్ద&lt;/strong&gt;&lt;/span&gt;&lt;br /&gt;- మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నం. 45 వైపు నేరుగా వెళ్లే ట్రాఫిక్ కోసం 430 మీటర్ల 2 లేన్ యూని-డైరెక్షనల్ అండర్&amp;zwnj;పాస్ నిర్మించనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;- ఫిలింనగర్ వైపు నుంచి మహారాజా అగ్రసేన్ వైపు రైట్ టర్నింగ్ చేసే వాహనాల కోసం 600 మీటర్ల 2 లేన్ యూని-డైరెక్షనల్ ఫస్ట్ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం.&lt;/p&gt;
&lt;p&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;strong&gt;రోడ్ నంబర్ 45 జంక్షన్ వద్ద&lt;/strong&gt;&lt;/span&gt;&lt;br /&gt;- ఫిలింనగర్ నుంచి వస్తూ జూబ్లీహిల్స్ చెక్&amp;zwnj;పోస్ట్ వైపు వెళ్లే వాహనాల కోసం 290 మీటర్ల 2-లేన్ యూని-డైరెక్షనల్ అండర్&amp;zwnj;పాస్ నిర్మించనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;- జూబ్లీహిల్స్ చెక్&amp;zwnj;పోస్ట్ నుంచి రోడ్ నం. 45 వైపు రైట్ టర్న్ తీసుకునే ట్రాఫిక్ కోసం 500 మీటర్ల 2-లేన్ యూని-డైరెక్షనల్ ఫస్ట్ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్ కట్టనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;strong&gt;మహారాజా అగ్రసేన్ జంక్షన్ వద్ద&lt;/strong&gt;&lt;/span&gt;&lt;br /&gt;- బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైపు నుంచి ఫిలింనగర్ వైపు వెళ్లే ట్రాఫిక్ కోసం 410 మీటర్ల 2 లేన్ యూని-డైరెక్షనల్ అండర్&amp;zwnj;పాస్ నిర్మాణానికి నిర్ణయం.&lt;/p&gt;
&lt;p&gt;- ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నం. 12 వైపు రైట్ టర్నింగ్ వాహనాల కోసం 590 మీటర్ల 2 లేన్ యూని-డైరెక్షనల్ ఫస్ట్ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్ కడతారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;span style=&quot;color: #e03e2d;&quot;&gt;&lt;strong&gt;బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద&lt;/strong&gt;&lt;/span&gt;&lt;br /&gt;- కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ నుంచి మహారాజా అగ్రసేన్ వైపు రైట్ టర్న్ అయ్యే వాహనాల కోసం 330 మీటర్ల 2 లేన్ యూని-డైరెక్షనల్ అండర్&amp;zwnj;పాస్ నిర్మిస్తున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;- మహారాజా అగ్రసేన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నం. 10 వైపు వెళ్లే వాహనాల కోసం 540 మీటర్ల 2 లేన్ యూని-డైరెక్షనల్ ఫస్ట్ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్ కట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/a5dc9395027d19bd7a9276c752cac2791787003646432233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/cm-revanth-reddy-inaugurates-sanathnagar-mcr-tims-outlines-vision-for-free-public-healthcare-256583</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/cm-revanth-reddy-inaugurates-sanathnagar-mcr-tims-outlines-vision-for-free-public-healthcare-256583#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 23:22:21 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/cm-revanth-reddy-inaugurates-sanathnagar-mcr-tims-outlines-vision-for-free-public-healthcare-256583</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్: పేదవాడికి వైద్యం భారం కాకూడదు.. ప్రభుత్వ ఆసుపత్రి అంటే నాణ్యమైన వైద్యం, నమ్మకమైన భరోసా కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ రంగాలపై చేసే ప్రతి రూపాయి వ్యయాన్ని భవిష్యత్తుపై పెట్టే విలువైన పెట్టుబడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. &amp;nbsp;2027 డిసెంబర్ 9 నాటికి ఉస్మానియా, అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్&amp;zwnj;లోని సనత్&amp;zwnj;నగర్&amp;zwnj;లో నూతనంగా నిర్మించిన తెలంగాణ ఇన్&amp;zwnj;స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆస్పత్రిని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. 1000 పడకలతో నిర్మించిన ఈ ఆసుపత్రికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్&amp;zwnj;గా నామకరణం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి రోజుల్లో ప్రైవేటు వైద్యం సామాన్యులకు అత్యంత ఖరీదుగా మారిందని, అందుకే ప్రతి పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ స్థాయి సూపర్&amp;zwnj;స్పెషాలిటీ వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.2,700 కోట్లకు పైగా నిధులను విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆస్పత్రులకు వచ్చే రోగుల ఆరోగ్యంతో పాటు వారి వద్దకు వచ్చే బంధువులు, సహాయకులకు వసతి, ఆహార సౌకర్యాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. నర్సింగ్ విద్యార్థులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు మన నర్సింగ్ సిబ్బంది సేవలను ఆహ్వానిస్తున్నాయని వివరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/f6bae25b6053d479ee4b143f9f8968a01786989028007233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు చేపట్టిన భారీ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2027 డిసెంబర్ 9 నాటికి ఉస్మానియా, ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్ ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఆరు నెలలకు ఒక ఆస్పత్రిని ప్రారంభించి, కార్పొరేట్ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోని రీతిలో వీటిని నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ఆస్పత్రుల్లో రోగుల సేవల్లో 70 శాతం పాత్ర నర్సింగ్ సిబ్బందిది కాగా, మిగిలిన 30 శాతం డాక్టర్లది ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్దేశిత సమయం కంటే అదనంగా బాధ్యతలు నిర్వర్తించే స్పెషలిస్ట్ వైద్యులకు ప్రత్యేక ఇన్సెంటివ్&amp;zwnj;లు అందిస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలపై ఆధారపడటం కంటే ప్రతి పౌరుడు స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో బతికేలా అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/5c31125ee0253e06a2bd333f7d33485e1786989047772233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఎర్రవెల్లి, జన్వాడ, మొయినాబాద్, శంకర్ పల్లి ఫామ్ హౌసులు నిర్మించుకునేందుకు ఒక్క క్షణం కూడా ఆలస్యం కానివ్వలేదు. కానీ పేదలకు వైద్యం అందించే ఆసుపత్రులు పూర్తి చేయాలని ఆలోచన రాలేదా?. టిమ్స్ లు కట్టింది మేం అని కేటీఆర్ వచ్చి చెప్పి వెళ్లారు. మీరు కడితే పదేళ్లలో ప్రారంభించడానికి సమయం దొరకలేదా?. &amp;nbsp;మీరు అధికారంలో వున్నపుడు ఎందుకు రిబ్బన్ కట్ చేయలేదు? - &amp;nbsp;తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/cI5w_DiTtn4?si=TkPwdrjjfYEWFeOV&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పదేళ్లలో బీఆర్ఎస్ ఖర్చు చేసింది రూ.70 కోట్లు&lt;/strong&gt;&lt;br /&gt;టిమ్స్ హాస్పిటల్ కి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఖర్చు పెట్టింది కేవలం 70 కోట్లు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కానీ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం రెండున్నర ఏళ్ల లో టిమ్స్ హాస్పిటల్ కోసం 1,126 కోట్లు కర్చుపెట్టిందన్నారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రికి మర్రి చెన్నారెడ్డి పేరును ఖరారు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;ఇదే స్ఫూర్తితో సీఎంకి నాదొక విజ్ఞప్తి... తెలంగాణ సాధన కోసం తన మంత్రి పదవిని సైతం వదులుకుని, 94 ఏళ్ల వయసులో ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో దీక్ష చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ &amp;nbsp;పేరును ఎల్బీనగర్ టిమ్స్ కు పెట్టాలని కోరారు. అలాగే, అల్వాల్ టిమ్స్ కు అంజయ్య పేరును, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును కూడా పెట్టాలని సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt;ని కోరారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయుల పేర్లను ప్రజలకు సేవలందించే ప్రభుత్వ ఆసుపత్రులకు పెట్టడం &amp;nbsp;వారికి అందించే ఘనమైన నివాళి అన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/3848782128784bf679847e3c984131c31786988944227233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[TIMS Sanathnagar Hospital Inauguration:హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/dr-mcr-tims-hospital-sanathnagar-hyderabad-super-specialty-medical-services-cm-revanth-reddy-inauguration-256566</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/dr-mcr-tims-hospital-sanathnagar-hyderabad-super-specialty-medical-services-cm-revanth-reddy-inauguration-256566#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 19:24:37 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/dr-mcr-tims-hospital-sanathnagar-hyderabad-super-specialty-medical-services-cm-revanth-reddy-inauguration-256566</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;TIMS Sanathnagar Hospital Inauguration:&lt;/strong&gt;తెలంగాణ రాజధాని హైదరాబాద్&amp;zwnj;లో ప్రభుత్వం వైద్య సేవలపై ఒత్తిడి తగ్గించేందుకు, ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్&amp;zwnj; ఆసుపత్రులపై భారాన్ని పంచుకునేందుకు ఒక భారీ సూపర్ స్పెషాలిటీ కేంద్రం అవసరం ఎంతో కాలంగా ఉంది. ఈ అవసరాన్ని తీరుస్తూ, &amp;nbsp;ఎర్రగడ్డ(సనత్&amp;zwnj;నగర్&amp;zwnj;)ప్రాంతంలో 22. 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ.1,100 కోట్ల పైచిలుకు వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తి చేసింది. ఒకే మాస్టర్&amp;zwnj; ప్లాన్ కింద, ఒకే విడతలో సంపూర్ణ సూపర్ స్పెషాలిటీ వైద్య సముదాయంగా దీని నిర్మించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సోమవారం సాయంత్రం 4.30గంటలకు ముఖ్యమంత్రి &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ఈ ఆసుపత్రిని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి ఆసుపత్రిలోని ఓపీ కౌంటర్లను సందర్శించి, అక్కడ అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మౌలిక సదుపాయాలు, సామర్థ్యం&lt;/h2&gt;
&lt;p&gt;మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్&amp;zwnj;స్ట్రిట్యూట్&amp;zwnj; ఆఫ్ మెడికల్&amp;zwnj; సైన్సెస్&amp;zwnj;(డా. ఎంసీఆర్&amp;zwnj; టిమ్స్&amp;zwnj;) కేవలం ఒక ఆసుపత్రి మాత్రమే కాదు. ఇది ఒక అత్యాధునిక వైద్య నగరం, దీని ప్రత్యేకతలు ఇవే.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మొత్తం 1, 082 పడకలు అందుబాటులో ఉండగా, అందులో 300 పడకలు కేవలం ఐసీయూ విభాగం కోసమే కేటాయించారు.&lt;/p&gt;
&lt;p&gt;సంక్లిష్టమైన సర్జరీల కోసం 31 అత్యాధునిక మేజర్&amp;zwnj; ఆపరేషన్ థియేటర్లు, 6మైనర్&amp;zwnj; థియేటర్లు సిద్ధం చేశారు. ఆసుపత్రిని నాలుగు ప్రధాన బ్లాకులుగా నిర్మించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బ్లాక్&amp;zwnj; -ఏ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అత్యవసర సేవలు, ఐసీయూ బెడ్లు, 15 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బ్లాక్&amp;zwnj; -బి&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్&amp;zwnj; ఫార్మసీ, కార్డియాక్&amp;zwnj; ఓటీ, న్యూక్లియర్&amp;zwnj; మెడిసిన్ విభాగాల కోసం కేటాయించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బ్లాక్ సి&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రేడియోలజీ, పాథాలజీ ల్యాబ్&amp;zwnj;లతోపాటు సాధారణ, వీఐపీ వార్డులు ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బ్లాక్ -డి&amp;nbsp;&lt;/strong&gt;&lt;br /&gt;అడ్మినిస్ట్రేషన్, విద్యా విభాగాలు, ఆడిటోరియం కోసం నిర్మించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;న్యూమాటిక్&amp;zwnj; ట్యూబ్&amp;zwnj; వ్యవస్థ&lt;/h2&gt;
&lt;p&gt;దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వం ఆసుపత్రిలో ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్&amp;zwnj; వ్యవస్థను ఏర్పాటు చేయడం టిమ్స్&amp;zwnj; సనత్&amp;zwnj;నగర్&amp;zwnj; ప్రత్యేకత. సీల్డ్&amp;zwnj; ట్యూబ్&amp;zwnj;, గాలి ఒత్తిడి సహాయంతో రోగుల రక్త నమూనాలు, మందులు, వైద్య నివేదికలను ఆసుపత్రిలోని ఒక విభాగం నుంచి మరొక విభాగానికి కేవలం రెండు నిమిషాల్లో పంపవచ్చు. దీని వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగవంతమైన చికిత్స, రోగ నిర్ధారణ ఫలితాలు అందుతాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;వైద్య విభాగాల విస్తృతి&lt;/h2&gt;
&lt;p&gt;సామాన్యులకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ఇక్కడ 37 ప్రధాన వైద్య విభాగాలు పని చేస్తాయి.&amp;nbsp; కిడ్నీ, కాలేయం, గుండె, మెదడు, క్యాన్సర్&amp;zwnj;, ట్రామా కేర్&amp;zwnj; వంటి ఆరు కీలక రంగాల్లో ఈ ఆసుపత్రి ఒక మేటి కేంద్రంగా నిలవనుంది. గుండె, కాలేయం మూత్రపిండాల వంటి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు ఇక్కడ ప్రత్యేక వసతులు కల్పించారు. 3టెస్లా ఎంఆర్&amp;zwnj;ఐ, 128 స్లైస్&amp;zwnj; సిటీ స్కానర్&amp;zwnj;, అత్యాధునిక మమ్మోగ్రఫీ యూనిట్&amp;zwnj; వంటి పరికరాలను రోగుల కోసం ఏర్పాటు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;రోగుల సహాయకుల కోసం వసతులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులతోపాటు ఉండే సహాయకుల ఇబ్బందులను గమనించి, ఆసుపత్రి ప్రాంగణంలోనే జీ+5 అంతస్తులతో ధర్మశాలను నిర్మించారు. ఇందులో &amp;nbsp;ఒకేసారి 200 మందికి వసతి కల్పించే వీలుంది. అంతేకాకుండా, 30 మృతదేహాల సామర్థ్యంతో కూడిన మార్చురీ, సెంట్రల్&amp;zwnj; కిచెన్, లాండ్రీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పర్యావరణ హితం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;టిమ్స్&amp;zwnj; నిర్మాణం పర్యావరణ పరిరక్షణ పెద్దపీట వేసింది. నీటి వినియోగాన్ని 75 శాతం తగ్గించే సాంకేతికత, వర్షపు నీటి సేకరణ, వ్యర్థాల శుద్ధి కోసం ఎస్టీపీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ కారణాల వల్ల ఈ ప్రాజెక్టుకు ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ లభించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ భారీ ఆసుపత్రి నిర్వహణకు గాను ఇన్&amp;zwnj;ఛార్జి డైరెక్టర్&amp;zwnj;గా మాజీ డీఎంఈ డాక్టర్&amp;zwnj; ఏ. నరేంద్ర కుమారు, ఇన్&amp;zwnj;ఛార్జి సూపరింటెండెంట్&amp;zwnj;గా డాక్టర్&amp;zwnj; మహబూబ్&amp;zwnj; ఖాన్ బాధ్యతలు స్వీకరించారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్&amp;zwnj; నుంచి వచ్చిన అనుభవజ్ఞులతోపాటు సుమారు 200 మంది కొత్త వైద్య సిబ్బంది ఇప్పటికే సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రయల్స్&amp;zwnj; రన్&amp;zwnj; సమయంలోనే రోజుకు సుమారు 250 మంది కొత్త వైద్య సిబ్బంది ఇప్పటికే సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రయల్ రన్ సమయంలోనే రోజుకు సుమారు 250 మందికి ఓపీ సేవలు అందించిన ఈ ఆసుపత్రి నేటి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/0afef3748e6f8c9352de6aebb1097e881786974849326215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు!  మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-sir-draft-voter-list-2026-updates-final-list-october-19-how-to-apply-for-new-vote-256562</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-sir-draft-voter-list-2026-updates-final-list-october-19-how-to-apply-for-new-vote-256562#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 17:47:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/telangana-sir-draft-voter-list-2026-updates-final-list-october-19-how-to-apply-for-new-vote-256562</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Voter List 2026:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం నాడు ఎస్&amp;zwnj;ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేశారు. ఓటర్ల జాబితాలో పారదర్శకతను పెంచడం, తప్పులను సరిదిద్దడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను చేపట్టినట్టు ఆయన వెల్లడించారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ముసాయిదా లెక్కలు ఇవే&lt;/h2&gt;
&lt;p&gt;రాష్ట్ర ఎన్నికల సంగం వెల్లడించిన వివరాల ప్రకారం, తెలంగాణలో ఎస్&amp;zwnj;ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు మొత్తం ఓటర్ల సంఖ్య 3, 38, 26, 448గా ఉంది. తాజా ముసాయిదా రూపకల్పనలో భాగంగా ఇప్పటి వరకు 2, 64, 87, 213 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇది మొత్తం ఓటర్లలో 7. 30 శాతానికి సమానం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మిగిలిన ఓటర్ల వివరాల్లో వివిధ రకాల వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించారు. సుమారు 60, 50, 918 మంది ఓటర్లు వివరాల్లో తప్పులు లేదా అసంపూర్ణ సమాచారం ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 32,36, 659 మంది ఓటర్లకు సంబంధించి ప్రాపర్ మ్యాపింగ్ లేదనని అధికారులు నిర్దారించారు. అబ్సెంట్&amp;zwnj;, షిఫ్టెడ్, డెడ్&amp;zwnj;, డూప్లికేట్, విభాగాల్లో మొత్తం 73, 39,235 మంది ఓటర్లు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;92 లక్షల మందికి నోటీసులు ఎందుకు?&lt;/h2&gt;
&lt;p&gt;ఓటర్ల జాబితాలో డూప్లికేట్&amp;zwnj; ఓట్లను తొలగించం, చిరునామాలు మారిన వారి వివరాలను సరిదిద్దడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నోటీసులను బూత్ లెవల్&amp;zwnj; ఆఫీసర్స్ ద్వారా నేరుగా లేదా పోస్టు ద్వారా ఓటర్లు చేరవేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నోటీసులు అందుకున్న వారు ఏం చేయాలి?&lt;/h2&gt;
&lt;p&gt;నోటీసులు అందిన ఓటర్లు తమ వివరాల ధృవీకరణ కోసం అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ ఓటరు చనిపోయినా, శాశ్వతంగా వేరే ప్రాంతానికి వలస వెళ్లినా, ఆ వివరాలను విచారణలో భాగంగా నిర్దారిస్తారు ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఒక మోడల్&amp;zwnj; నోటీసు సిద్ధం చేసింది. అందులో ఓటరు పేరు, గుర్తింపు కార్డు సంఖ్య, సంబంధిత పోలింగ్ కేంద్రం వివరాలు పొందుపరిచారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ముఖ్యమైన గడువులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం టైమ్&amp;zwnj;లైన్ ప్రకటించింది. నోటీసులు అందుకున్న వారు తమ సమాధానాలను లేదా అభ్యంతరాలను సెప్టెంబర్&amp;zwnj; 16 వరకు సమర్పించవచ్చు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు అందిన దరఖాస్తులను, అభ్యంతరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత అక్టోబర్&amp;zwnj; 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;జిల్లాల వారీగా స్థితిగతులు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఎన్నికల సంఘం విడుదల చేసిన 33 జిల్లాల నివేదిక పరిశీలిస్తే, గ్రామీణ జిల్లాల్లో డిజిటలైజేషన్ వేగంగా సాగగా, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సవాల్లు ఎదురవుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కుమరం భీం ఆసిఫాబాద్&amp;zwnj;లో డిజిటలైజేషన్ ప్రక్రియ 89 శాతానికిపైగా పూర్తి అయ్యింది. అత్యంత క్లిష్టమైన హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు గాను డిజిటలైజేషన్ శాతం కేవలం 59. 01శాతం మాత్రమే ఉంది. ఇక్కడ మాత్రం సుమారు 19.41 మంది ASDD ఓటర్లు ఉన్నట్టు నివేదిక స్పష్టం చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో డిజిటలైజేషన్ 65. 21 శాతం నమోదైంది. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాల్లో భారీగా ఓటర్ల వివరాల సవరణ అవసకం ఉంది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అధికారులు ఏం చెబుతున్నారు?&lt;/h2&gt;
&lt;p&gt;ఈ ప్రక్రియలో 2 వేల మందికిపైగా అధికారులు పాల్గొంటున్నారని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటరు జాబితాలో తన పేరు లేదని ఎవరైనా గుర్తిస్తే, వారు ఫామ్&amp;zwnj; 6A ద్వారా కొత్తా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;&lt;a title=&quot;మీరు పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకునే డైరెక్ట్ లింక్ ఇదే.&quot; href=&quot;https://voters.eci.gov.in/download-eroll?stateCode=S29&quot; target=&quot;_self&quot;&gt;ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకునే డైరెక్ట్ లింక్ ఇదే&lt;/a&gt;&lt;/h2&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/64ef16178053776da6c3da0ea9f1f1c21786968964579215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! ]]></title><link>https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555</link><comments>https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 16:23:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh and Telangana BJP:&amp;nbsp;&lt;/strong&gt;సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటించింది. నితిన్ జట్టులోకి తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఇద్దరికే చోటు దక్కింది. ఆ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు చెందిన వారే. రామ్&amp;zwnj;మాధవ్&amp;zwnj;కు చోటు దక్కినా ఆయన ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు లభించలేదు. అంతేకాకుండా మొన్నటి వరకు జాతీయ కార్యవర్గంలో ఉన్న డీకే అరుణకు కూడా చోటు కల్పించలేదు. అయితే ఈ మార్పులు చేర్పులపై ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు చెందిన నేతలు కాస్త నిరాశ చెందుతుంటే, తెలంగాణకు చెందిన నేతలు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫుల్&amp;zwnj; ఖుష్ అవుతున్నారు. పదవులు రాని వారందరూ ఎందుకు ఆనందపడుతున్నారో చూద్దాం. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీలో అన్&amp;zwnj;హ్యాపీ- తెలంగాణలో హ్యాపీ&lt;/h2&gt;
&lt;p&gt;మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఏవైనా సరే ఒక లీడర్&amp;zwnj;కు బూస్ట్ ఇస్తాయి. తన ప్రాంతంలో పెట్టు మరింత పెంచుకోవడానికి సహకరిస్తాయి. అందుకే పదవుల కోసం గ్రామస్థాయి లీడర్ నుంచి జాతీయ స్థాయి నాయకుడి వరకు పోటీ పడుతుంటారు. లాబీయింగ్ చేస్తుంటారు. పదవులు రాని వారు మాత్రం విమర్శలు చేస్తారు. ఆలిగి కూర్చుంటారు. మరికొందరు తిరుగుబాటు చేస్తారు. బీజేపీ నేతల ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. త్వరలోనే జరిగే మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అందుకే తమను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదని సంబరపడిపోతున్నారు. అదే తెలంగాణ నేతల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తే, ఆంధ్రప్రదేశ్ నేతల్లో నిరాశ నింపుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీ బీజేపీ నేతలకు ఆమాత్యయోగం లేనట్టే!&lt;/h2&gt;
&lt;p&gt;పార్టీలు ఏ పని చేసినా దాని వెనుక రాజకీయ వ్యూహం కచ్చితంగా ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అదే ఆలోచనతో పావులు కదుపుతోంది. వివిధ స్థాయి పదవులకు నాయకులను ఎంపిక చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పార్టీని అధికారంలోకి వచ్చే బలం బలగం బీజేపీకి లేదు. అందుకే కూటమితో ప్రయాణం సాగిస్తోంది. అందుకే సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తూనే కూటమిని కూడా కాపాడుకోవాలని ఆలోచనతో వెళ్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు ఒక మంత్రి పదవి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మంత్రి పదవి ఇచ్చే క్రమంలో లెక్కలు పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటికే మూడు మంత్రిపదవులు ఆ రాష్ట్రం నుంచే ఉన్నాయి. ఇందులో టీడీపీ లీడర్లు ఇద్దరు అయితే, మూడో వ్యక్తి బీజేపీ నుంచి ఎన్నికైన వ్యక్తే. టీడీపీ నుంచి శ్రీకాకుళం నుంచి ఎన్నికైన రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటే, గుంటూరు నుంచి ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్&amp;zwnj; గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. నరసాపురం నుంచి బీజేపీ గుర్తుపై గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమల, ఉక్కు శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పురంధేశ్వరిని పోటీ నుంచి తప్పించిన అధిష్ఠానం&lt;/h2&gt;
&lt;p&gt;ఇప్పుడు ఏపీకి ఇంకో పదవి ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా సీనియర్&amp;zwnj;, రాజమండ్రి నుంచి విజయం సాధించిన పురంధేశ్వరి పోటీకి వస్తారు. ఇవ్వాల్సిన మంత్రి పదవి ఈసారి కూటమి పార్టీల్లో ఒకరికి ఇవ్వాల్సిన మోదీ, అమిత్&amp;zwnj;షా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలా చేస్తే బీజేపీ కేడర్&amp;zwnj;ను నిరాశ పరచినట్టు అవుతుంది. అందుకే జాతీయ కార్యవర్గంలోకి పురంధేశ్వరిని తీసుకున్నారు. ఇప్పుడు ఆమెను మంత్రిపదవి రేసు నుంచి తప్పించారు. దీంతో సమీకరణాలు లెక్కించడం బీజేపీకి, కూటమి పార్టీలకు ఈజీ అవుతుంది. అందుకే ఇది తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో నేతల హ్యాపీకి కారణం!&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో బీజేపీ నేతలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటున్నారు. ఒక వేళ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించి ఉంటే కచ్చితంగా తమ మంత్రిపదవి ఆశలపై నీళ్లు చల్లినట్టేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎవర్నీ ఎంపిక చేయకపోవడం వారంతా తమ లాబీయింగ్&amp;zwnj;ను మరింత తీవ్రం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;తో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. అందుకే పార్టీ పదవులతో ఇక్కడి నేతలను డైవర్ట్ చేయలేమని గ్రహించి, వారి మంత్రి పదవుల ఆప్షన్&amp;zwnj;ను లైవ్&amp;zwnj;లో ఉంచింది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా వారిని తీసుకుంటారనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఇద్దరికి మంత్రిపదవులు ఉన్నాయి. కిషన్ రెడ్డి గనుల శాఖను చూస్తున్నారు. మరో నేత &lt;a title=&quot;బండి సంజయ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Bandi-Sanjay&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బండి సంజయ్&lt;/a&gt;&amp;zwnj; కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. వీరితోపాటు ఇంకో మంత్రిపదవి తెలంగాణలు దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి. అందుకే వారిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదనే విశ్లేషణ వినిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విష్ణువర్దన్ రెడ్డి పలుకుబడి!&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో బీజేపీ యువ నేత విష్ణువర్దన్ రెడ్డి మాత్రం కాస్త హ్యాపీగా ఉన్నారు. ఆయన కరుడుగట్టిన &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; లీడరే అయినప్పటికీ ఆయన మనసు వైసీపీలో ఉంటుందని కూటమి నేతలు సెటైర్లు వేస్తుంటారు. అందుకే ఆయన్ని రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులకు కానీ, ఎన్నికల్లో పోటీకి కానీ &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;, &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; అంగీకరించలేదు. నేరుగా ఆయనకు కేంద్రంలో ప్రత్యేక పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. మధ్యేమార్గంగా ఆయన్ని డైరెక్ట్&amp;zwnj;గా నబీన్ టీంలోకి తీసుకున్నారు. దీంతో అధిష్ఠానం వద్ద ఆయన పలుకుబడి బాగానే ఉందని ప్రచారం మొదలైంది. ఇది ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/f6776cb0dd10100a2bcd1c14c41ae34d1786963892353215_original.jpg" width="220"/></item></channel></rss>