బండి భగీరథ్ పై ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Bandi Bhagirath Files:బండి సంజయ్కు బిగ్షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్!
Bandi Bhagirath:కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై హైదరాబాద్లో ఫోక్సో కేసు నమోదైంది. మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడినట్టు బాలిక పేర్కొంది. ఇదంతా హానీ ట్రాప్ అంటున్నారు బండి కుమారుడ భగీరథ్

- మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
- మైనర్ బాలికపై మద్యం తాగించి అత్యాచారం జరిగినట్టు ఫిర్యాదు.
- హనీట్రాప్ కేసు నమోదు చేశారు, ఐదు కోట్ల డిమాండ్ చేశారు.
Bandi Bhagirath Files: తెలంగాణ రాజకీయాల్లో మరో కలకలం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచారం జరిగినట్టు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం, బాధితురాలు మైనర్ కావడంతో ఫోక్సో చట్టం కింద నమోదు చేశారు.
అందిన సమాచారం ప్రకారం, ఈ ఘటనలో బాధితురాలు కేవలం 17 సంవత్సరాల వయసు ఉన్న బాలిక. భగీరథ్ సదరు బాలికకు మద్యం తాగించి, తనపై అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌజ్తోపాటు మరో రెండు ప్రాంతాల్లో జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న అర్ధరాత్రి సుమారు 6 గంటలపాటు పోలీస్ స్టేషన్ వేదికగా హైడ్రామా నడిచింది. నిందితుడు కేంద్రమంత్రి కుమారుడు కావడంతో పోలీసులు తీసుకోవడానికి మొద వెనుకడుగు వేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే బాధితుల ఒత్తిడి మేరకు పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు.
అయితే ఇదంతా హనీ ట్రాప్ను బండి భగీరథ్ కేసు నమోదు చేశారు. కరీంనగర్ టూ టౌన్ పోలీస్స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం చాట్ల అన్వి అనే యువతి తనతో స్నేహం పేరుతో పరిచయం పెంచుకుందని, ఆ పరిచయంతో ఆమె తన కుటుంబ వేడుకలకు, గ్రూప్ మీటింగ్స్కు ఆహ్వానించేంది. కొన్ని పవిత్ర స్థలాలకు కూడా వెళ్లినట్టు సమాచారం. అయితే కొంత కాలం తర్వాత తన అసలు రంగును బయటపడిందని, చాట్ల అన్వి, ఆమె తల్లిదండ్రులు తన పెళ్లి విషయంలో ఒత్తిడి తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన తిరస్కరించంతో వారు బెదిరంపులకు దిగారు. ఒక వేళ తమ మాట వినకపోతే, వేధింపులు, శారీరక సంబంధం పెట్టుకున్నాడనే తప్పుడు ఆరోపణలతో క్రిమినల్ కేసులు పెడతామని వారు హెచ్చరించినట్టు ఫిర్యాదులో ఉంది.
ఈ క్రమంలో భయపడిన భగీరథ్, ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి మొదట అన్వి తండ్రికి యాభై వేల నగదు ఇచ్చామన్నారు. అయితే వారు అంతటితో ఆగకుండా తమ డిమాండ్ను ఐదు కోట్లకు పెంచారని తెలిపారు. ఆ డబ్బు ఇవ్వకుంటే అన్వి తల్లి ఆత్మహత్య చేసుకుంటుందని, ఆ నెపం భగీరథ్పైనే వేస్తామని వారు బెదిరించినట్టు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ద్వారా తెలుస్తోంది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై ఎలాంటి ఆరోపణలు వచ్చాయి?
ఈ ఘటనపై బండి భగీరథ్ ఏమని ఫిర్యాదు చేశారు?
ఈ ఆరోపణలన్నీ హనీ ట్రాప్ అని బండి భగీరథ్ ఫిర్యాదు చేశారు. చాట్ల అన్వి అనే యువతి తనను పెళ్లి పేరుతో బ్లాక్ మెయిల్ చేసి, రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందని ఆయన ఆరోపించారు.
ఈ కేసులో పోలీసులు ఎలా స్పందించారు?
బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో కొంత ఉత్కంఠ నెలకొంది. నిందితుడు కేంద్రమంత్రి కుమారుడు కావడంతో పోలీసులు మొదట వెనుకడుగు వేశారని ఆరోపణలు వచ్చాయి, కానీ బాధితుల ఒత్తిడి మేరకు ఫిర్యాదు స్వీకరించారు.
ట్రెండింగ్ వార్తలు





















