అన్వేషించండి

Asaduddin Owaisi: గన్‌తో ముస్లింలకు గురిపెట్టిన హిమంత బిశ్వ శర్మ! పోలీసులకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు

Himanta biswa sarma |అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వీడియోపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ముస్లింల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీగా ఉన్నారు. ముస్లింలకు సంబంధించి ఏ అన్యాయం, తప్పిదం జరిగిన ఆయన వెంటనే రియాక్ట్ అవుతారు. ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయంలో క్రిమినల్ ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోలో హిమంత బిస్వ శర్మ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నట్లు కనిపించారు. ఈ వీడియోను జాతి విద్వేషంగా పేర్కొంటూ తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ వీడియోను ఆధారంగా చేసుకుని ఫిర్యాదు చేసిన ఒవైసీ.. అస్సాం సీఎంపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని కోరారు.

హిమంత బిశ్వ శర్మ చాలా కాలం నుంచి వివిధ వేదికల ద్వారా ముస్లిం వ్యతిరేక భావాలను రెచ్చగొడుతున్నారని తన ఫిర్యాదులో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. బిశ్వ శర్మ గన్ తో ముస్లింలను కాల్చేందుకు టార్గెట్ చేస్తున్న  తాజా వీడియో అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తరువాత ఆయన ఈ వీడియో డిలీట్ చేశారని ఒవైసీ పేర్కొన్నారు. 

నాగరిక సమాజానికి ఇది ఆమోదయోగ్యం కాదు - ఒవైసీ

AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోమవారం (ఫిబ్రవరి 9)న తన మీడియాతో మాట్లాడుతూ.. ఓ వీడియోలో హిమంత బిశ్వ శర్మ తుపాకీతో కనిపించారని, 'పాయింట్ బ్లాంక్ షాట్', నో మెర్సీ వంటి పదాలను ఉపయోగించారని తెలిపారు. మనం ఏ నాగరిక సమాజంలో ఉన్నాం, ఇది ఎక్కడా ఆమోదయోగ్యం కాదన్నారు. ఇలాంటి వీడియోలు ఓ వర్గాన్ని నేరుగా సమాజాన్ని భయపెట్టడానికి చేసే ప్రయత్నమని అన్నారు.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అనేక తీర్పులను తన ఫిర్యాదులో ఉటంకిస్తూ, ఏదైనా మతం లేదా సమాజంపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం నేరమని కోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. హిమంత బిశ్వ శర్మ తన అధికారిక సోషల్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోపై సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సీపీని కోరారు.

అస్సాం ముఖ్యమంత్రిపై విమర్శలు

హిమంత బిశ్వ శర్మపై అసదుద్దీన్ విమర్శలు గుప్పించడం ఇదే మొదటిసారి కాదు. గత కొంతకాలంగా శర్మ తన ప్రకటనలతో వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అస్సాంలో ఎన్‌ఆర్‌సీ, అక్రమ చొరబాటుదారుల అంశంపై ఆయన కఠిన వైఖరి ప్రతిపక్షాల నుంచి విమర్శలకు కారణమవుతోంది. ఈసారి వ్యవహారం మాటలు దాటి హింసాత్మక వీడియోకు చేరుకుందని, ఇది దేశ ఐక్యత, సమగ్రతకు ముప్పుగా ఒవైసీ అభివర్ణించారు. దే

హైదరాబాద్ సీపీ చర్యలపై ఉత్కంఠ

ఒవైసీ ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. విద్వేషపూరిత ప్రసంగాలు దాటి, ఓ వర్గానికి చెందిన ప్రజలను సీఎం టార్గెట్ చేస్తున్నట్లు ఉన్న వీడియో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా అనే ప్రశ్న తలెత్తింది. ఈ ఘటన రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget