<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>Telangana Assembly Session 2026: ఆవేశం స్టార్లతో బీఆర్ఎస్‌కు గండం -  పక్కా ప్లాన్‌తో వచ్చి కాంగ్రెస్ పొలిటికల్ ట్రాప్‌లో చిక్కుకుందా?</title><atom:link href="https://telugu.abplive.com/telangana/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Wed, 9 Sep 2026 19:52:37 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Railway Projects In AP and Telangana: రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు]]></title><link>https://telugu.abplive.com/news/india/pm-modi-union-cabinet-approves-5-railway-multi-tracking-projects-worth-10021-crore-across-4-southern-states-258516</link><comments>https://telugu.abplive.com/news/india/pm-modi-union-cabinet-approves-5-railway-multi-tracking-projects-worth-10021-crore-across-4-southern-states-258516#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 18:10:34 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/pm-modi-union-cabinet-approves-5-railway-multi-tracking-projects-worth-10021-crore-across-4-southern-states-258516</guid><description><![CDATA[&lt;p&gt;Indian Railways | న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించి 5 నూతన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 ప్రాజెక్టులు రైల్వే పరిధిని దాదాపు 540 కిలోమీటర్ల మేర పెంచనున్నాయి. ఆ ప్రాజెక్టుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;ఎ) అరక్కోణం- రేణిగుంట 3, 4వ లైన్ - 77 కిలోమీటర్ల ప్రాజెక్ట్&lt;br /&gt;బి) వైట్ ఫీల్డ్- బంగారుపేట 3, 4వ లైన్ - 47 కిలోమీటర్లు&lt;br /&gt;సీ) హోసూర్- ఒమలూర్ డబ్లింగ్ (2 లైన్ల నిర్మాణం) - 147 కిలోమీటర్ల దూరం&lt;br /&gt;డీ) సేలం- కరూర్- దిండిగల్ డబ్లింగ్ - 159 కిలోమీటర్లు&lt;br /&gt;ఈ) సికింద్రాబాద్ మల్టీ ట్రాకింగ్ (ఘట్&amp;zwnj;కేసర్) - కాజీపేట్ -110 కిలోమీటర్లు&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;రైలు మార్గాల సామర్థ్యం పెరగటం వల్ల రవాణా సౌలభ్యం మెరుగవుతుంది. దీనివల్ల భారత రైల్వేల నిర్వహణ సామర్థ్యం, సేవలపై నమ్మకం పెరుగుతాయి. రైల్వే కార్యకలాపాల క్రమబద్ధీకరణకు, రద్దీని తగ్గించేందుకు ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు దోహదం చేస్తాయి. ప్రధాని &lt;a title=&quot;నరేంద్ర మోదీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/narendra-modi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;నరేంద్ర మోదీ&lt;/a&gt; కలలుగన్న సరికొత్త ఇండియాకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులున్నాయి. సమగ్రాభివృద్ధి ద్వారా ఆ ప్రాంత ప్రజలు &quot;ఆత్మనిర్భర్&quot; ను సాధించటంతో పాటు స్థానికంగా ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.&lt;/p&gt;
&lt;p&gt;పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. సమగ్ర ప్రణాళిక, భాగస్వాముల సంప్రదింపుల ద్వారా మల్టీ మోడల్ అనుసంధానం, రవాణా సామర్థ్యాన్ని పెంపొందించటం ఈ ప్రాజెక్టుల ఉద్దేశం. ప్యాసింజర్స్, సరకులు, సేవల రవాణాకు అంతరాయం లేని అనుసంధానత సాధ్యమవుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దక్షిణాది రాష్ట్రాల్లో 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 ప్రాజెక్టులు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt;, తెలంగాణలోని 17 జిల్లాల మీదుగా వెళ్లే ఈ అయిదు ప్రాజెక్టులు భారత రైల్వే పరిధిని దాదాపు 540 కిలోమీటర్ల మేర పెంచుతాయి. ఆమోదం పొందిన ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 52 లక్షల జనాభా గల దాదాపు 2,121 గ్రామాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలకు పెరగనున్న కనెక్టివిటీ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టుల సామర్థ్యం ద్వారా తిరుపతి, సుబ్రమణ్యస్వామి ఆలయం (తిరుత్తణి), శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం (తిరుచానూరు), శ్రీ సీతి భైరవేశ్వర స్వామి ఆలయం,కోటిలింగేశ్వర దేవాలయం, బంగారు తిరుపతి, కోలార్ బంగారు గనులు, హోగెనక్కల్ జలపాతం, హోసూర్ కోట, మెట్టూర్ డ్యామ్, సత్యమంగళం వన్యప్రాణుల అభయారణ్యం, కొడైకెనాల్ కొండలు, నమక్కల్ ఆంజనేయర్ ఆలయం, నమక్కల్ కోట, కళ్యాణ పశుపతేశ్వర ఆలయం, యాదగిరిగుట్ట, భువనగిరి కోట, సురేంద్రపురి, స్వర్ణగిరి ఆలయం వంటి దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైలు అనుసంధానం మెరుగవుతుంది .&lt;/p&gt;
&lt;p&gt;బొగ్గు, సిమెంట్, ఇనుము, ఉక్కు, ఆటోమొబైల్స్, ఆహారధాన్యాలు, పెట్రోలియం ఉత్పత్తులు,కంటైనర్లు, ఎరువులు వంటి వస్తువుల రవాణాకు ఈ ప్రాజెక్టు చాలా హెల్ప్ అవుతుంది. ఈ పెంపుదల ద్వారా ఏటా అదనంగా&amp;nbsp; ఏడాదికి 47 మిలియన్ టన్నుల సరకు రవాణా సాధ్యమవుతుంది. పర్యావరణహిత, శక్తి సామర్థ్యాలు గల రవాణా వ్యవస్థ రైల్వేలు. దేశ వాతావరణ లక్ష్యాలను చేరుకోవటంలో, రవాణా ఖర్చులను తగ్గించటంలో దోహదం చేస్తాయి. ఇవి చమురు దిగుమతి (సుమారు 8 కోట్ల లీటర్ల)ని తగ్గించి, కర్బన ఉద్గారాలను విడుదలను తగ్గిస్తాయి. సుమారు 2 కోట్ల మొక్కలు నాటటంతో దీని విలువ సమానమని తెలిపారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/23b3bafd07e4b801be2490b15b1a1c011788957523881233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Politics: కేసీఆర్‌కు దళితుల పట్ల చిత్తశుద్ధి లేదా! స్పీకర్‌కు, మహిళలకు క్షమాపణ ఎప్పుడు చెబుతారు?]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-stance-is-anti-dalit-cm-revanth-reddy-and-ministers-demand-kcr-must-apologize-to-speaker-258506</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-stance-is-anti-dalit-cm-revanth-reddy-and-ministers-demand-kcr-must-apologize-to-speaker-258506#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 15:44:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ ABP Desam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/brs-stance-is-anti-dalit-cm-revanth-reddy-and-ministers-demand-kcr-must-apologize-to-speaker-258506</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్&amp;zwnj;పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దళిత స్పీకర్&amp;zwnj;తో పాటు ఆయన తల్లిని అవమానించేలా బీఆర్ఎస్ సభ్యులు వ్యాఖ్యలు చేయడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతిపక్షనేత కేసీఆర్ దీనిపై బాధ్యత వహించలేదని, ఆయనకు దళితులపై గౌరవం లేదని మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ లోపల, బయట సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. దళితులు నిరసన తెలిపిన చోట శుద్ధి చేయడమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గడీల పాలనకు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా కేసీఆర్ స్పందించి.. దళితులకు, స్పీకర్&amp;zwnj;కు, మహిళలకు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;దళిత స్పీకర్&amp;zwnj;పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. నేడు మరోసారి సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గకకుండా సమావేశాలు సజావుగా సాగకుండా చేస్తున్నందుకు మంత్రి శ్రీధర్ రెడ్డి తీర్మానం చేయడంతో స్పీకర్ బీఆర్ఎస్ సభ్యులను ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. మరోవైపు వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు అన్నీ ఫేక్ అని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/66b36725eb4ad40bea26b400cfac43c51788947991961233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;శాసనసభలో ముఖ్యమంత్రి అయినా, సాధారణ శాసనసభ్యుడైనా స్పీకర్&amp;zwnj;కు అందరూ సమానమేనని, అలాంటి అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్ మనసు గాయపడేలా బీఆర్&amp;zwnj;ఎస్ నాయకులు ప్రవర్తించడం దారుణమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది కేవలం గడ్డం ప్రసాద్ కుమార్ అనే వ్యక్తికి జరిగిన అవమానం కాదని, ఇది సభకే కాకుండా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీలకు జరిగిన తీవ్ర అవమానమని అభివర్ణించారు. స్పీకర్ స్థానాన్ని, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అనుచిత భాషతో దూషించడం క్షమించరాని నేరమని సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ఆగ్రహం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/9b0ff03239bf5ece3af6678164799ef11788948083456233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దళితుడు సీఎం అని చెప్పి కేసీఆర్ మోసాలు&lt;/strong&gt;&lt;br /&gt;గతంలో తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తామని, మూడెకరాల భూమి, దళిత బంధు ఇస్తామని నమ్మించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. గతంలో దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించడం, నేరెళ్ల ఘటన, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; సీఎల్పీ నాయకుడిగా ఉన్న దళిత నేతకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం లాంటి చర్యలే బీఆర్&amp;zwnj;ఎస్ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. సభాపతి తల్లిని కూడా అవమానించేలా మాట్లాడటం సభ్య సమాజం తలవంచుకునేలా ఉందన్న ఆయన, రాజకీయాలకు అతీతంగా ఈ తీరును అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/e9342a3473b369796628cbfe960d41711788948097609233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;అసెంబ్లీ గేట్ నంబర్ 3 సమీపంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్&amp;zwnj;ను అవమానిస్తూ, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, ఎన్. నవీన్ కుమార్ రెడ్డిల తీరును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ శాసనసభ తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం తీర్మానం ఆమోదించింది. &amp;nbsp;బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ప్రవర్తన రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి, చట్టసభల గౌరవానికి తీవ్ర భంగం కలిగించిందని తీర్మానం పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;తమ పార్టీ సభ్యుల అసభ్యకర ప్రవర్తనకు ప్రతిపక్ష నేత &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; పూర్తి బాధ్యత వహిస్తూ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్&amp;zwnj;కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సభ డిమాండ్ చేసింది. ఆ తీర్మానం సభలో ఆమోదం పొందగా, శాసనమండలికి పంపించారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసుతో పాటు ఆధారాలన్నింటినీ &amp;nbsp;శాసనమండలి చైర్మన్&amp;zwnj;కు పంపి, అక్కడ కూడా తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దాంతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/eeb124971bf84e60f779f59f6fb3e8cd1788947851147233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[KTR: సబిత, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి, కేసీఆర్ చావు కోరుకుంటున్నారు: ప్రభుత్వంపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు]]></title><link>https://telugu.abplive.com/telangana/brs-delegation-led-by-ktr-meets-telangana-governor-to-complain-against-congress-government-258503</link><comments>https://telugu.abplive.com/telangana/brs-delegation-led-by-ktr-meets-telangana-governor-to-complain-against-congress-government-258503#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 14:42:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ తెలంగాణ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/brs-delegation-led-by-ktr-meets-telangana-governor-to-complain-against-congress-government-258503</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్: శాసనసభ సమావేశాల మొదటి రోజున బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులైన తమపై ప్రభుత్వం, పోలీసుల ద్వారా చేయించిన దాష్టీకాన్ని గవర్నర్&amp;zwnj;కు వివరించామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో నిరసన తెలిపిన తరహాలోనే, తాము కూడా టీ-షర్ట్స్ ద్వారా నిరసన తెలపాలని భావించామని తెలిపారు. చివరకు కేసీఆర్ చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ పాలన దిగజారినట్లు తెలిపారు. తెలంగాణ గవర్నర్&amp;zwnj;ను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తమకు సమయం ఇచ్చినందుకు గవర్నర్&amp;zwnj;కు ముందుగా ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్, ఆయన ఇటీవల అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆరోగ్యం గురించి వాకబు చేశామన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే ఈరోజు గవర్నర్&amp;zwnj;ను కలిసినట్లు వెల్లడించారు. 1000 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, గత 1000 రోజుల పాలనలో అన్ని హామీల అమలులోనూ, పరిపాలనలోనూ పూర్తిగా విఫలమైందని తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;తమ హక్కులను కాలరాస్తూ శాసనసభ్యులను సభలోకి రానివ్వకుండా రోడ్డుపైనే అడ్డుకున్న తీరును వివరించారు. తమపై జరిగిన దాడిని, ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన అరాచకాన్ని ఫోటోలు, సాక్ష్యాలతో సహా గవర్నర్ ముందుంచామన్నారు. బీఆర్&amp;zwnj;ఎస్ మహిళా నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి చీరను లాగి దుశ్శాసన పర్వానికి తెరలేపిన తీరును తెలియజేశామన్నారు. ప్రతిపక్షంపై దాడులు చేసి, తిరిగి తమపైనే బద్నాం చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని, పోలీసుల దాష్టీకంపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. ఈ పాలనలో ప్రజలు అనుభవిస్తున్న బాధలు, రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలు, అలాగే నిరుద్యోగ విద్యార్థులను, యువతను &lt;a title=&quot;రాహుల్ గాంధీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Rahul-Gandhi&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రాహుల్ గాంధీ&lt;/a&gt; ఏ విధంగా మోసం చేశారో విజ్ఞప్తి ద్వారా గవర్నర్&amp;zwnj;కు వివరించారు. పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు, వారి డిమాండ్లను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;కేసీఆర్ ఇంటిపై దాడికి వెళ్లారు&lt;/p&gt;
&lt;p&gt;చివరకు కేసీఆర్ చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని, ఎర్రవెల్లిలోని ఆయన ఇంటిపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండాల మాదిరిగా దాడికి వెళ్లారని గవర్నర్&amp;zwnj;కు విచారకరంగా వివరించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తమను శాసనసభ, శాసనమండలిలోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం, న్యాయస్థానాలపై ఎలాంటి గౌరవం లేదని స్పష్టం చేశారు. సభలో లేని విషయాలను, మండలి సభ్యులు అనని మాటలను ఆపాదిస్తూ, దళిత స్పీకర్ పేరిట కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తమకు స్పీకర్ గారిపై అపారమైన గౌరవం ఉందని, కానీ &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; పార్టీయే ఆయనను దళిత స్పీకర్ అంటూ పదేపదే ప్రస్తావిస్తూ అవమానిస్తోందని విమర్శించారు. అందుకే ప్రస్తుత శాసనసభ కౌరవ సభగా, దుశ్శాసన సభగా మారిపోయిందని ధ్వజమెత్తారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; నివాసం వద్ద చావు డప్పు కొడుతూ, ఆయన హత్యాయత్నానికి ప్రభుత్వం ప్రయత్నించిందని, స్వయంగా సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల తరఫున న్యాయం అడిగినందుకే తమపై ఈ రీతిలో కక్షసాధింపు దాడులు చేస్తున్నారని వివరించారు. తాము అందించిన ఆధారాలు, వినతులపై స్పందించిన గవర్నర్, శాసనసభ వ్యవహారాలు, బయట జరిగిన ప్రతి సంఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం జరుగుతున్న దౌర్జన్యకాండలో ఆయన జోక్యం చేసుకుంటారని భావిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన ఏఐ (AI) ఫోటోలు, వీడియోలపై ఇప్పటికే ఫిర్యాదు చేశామని, తప్పుడు చిత్రాలు, ఫిర్యాదులు ఉపయోగించే వారిపై చట్టపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్రంలో న్యాయం జరగకపోతే జాతీయ స్థాయిలోని జాతీయ మహిళా కమిషన్&amp;zwnj;ను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/6d6c1cf8f826f7ab047623fe081fb7881788943935652233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[చలో గవర్నర్ సెల్ఫ్ డ్రైవ్ లో KTR]]></title><link>https://telugu.abplive.com/short-videos/telangana/ktr-drives-himself-to-the-chalo-governor-protest-258496</link><comments>https://telugu.abplive.com/short-videos/telangana/ktr-drives-himself-to-the-chalo-governor-protest-258496#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 13:36:29 +0530 </pubDate><dc:creator><![CDATA[ ABP Desam ]]></dc:creator><category><![CDATA[ తెలంగాణ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/short-videos/telangana/ktr-drives-himself-to-the-chalo-governor-protest-258496</guid><description><![CDATA[&lt;p&gt;తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్వయంగా తానే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కేటీఆర్ చేపట్టిన &quot;చలో గవర్నర్&quot; కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్&amp;zwnj;గా మారింది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/cfcb1bf3b6837ad996e34920bc213c1e17889411861331476_original.jpeg" width="220"/></item><item><title><![CDATA[BRS MLAs: మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-women-mlas-express-outrage-in-assembly-lobby-over-police-manhandling-and-government-neglect-258476</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-women-mlas-express-outrage-in-assembly-lobby-over-police-manhandling-and-government-neglect-258476#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 12:20:34 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/brs-women-mlas-express-outrage-in-assembly-lobby-over-police-manhandling-and-government-neglect-258476</guid><description><![CDATA[&lt;p&gt;Telangana Assembly Sessions |&amp;nbsp;హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం నాడు తమకు జరిగిన తీవ్ర అవమానం, పోలీసుల దురుసు ప్రవర్తనపై ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభ లాబీలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి మీడియాతో చిట్&amp;zwnj;చాట్&amp;zwnj;లో మాట్లాడుతూ.. మహిళపై ప్రభుత్వం అహంకారపూరితంగా ప్రవర్తిస్తుందని, తమకు న్యాయం చేయడం లేదన్నారు. తమపై ప్రత్యక్షంగా దాడి జరిగి దెబ్బలు తగిలినా, సభలో పాలకపక్ష సభ్యులు ఆ విషయాన్ని వదిలేసి ఇతర అంశాలపైనే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ఘటనపై బీఆర్&amp;zwnj;ఎస్ అధినేత &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; తక్షణమే స్పందించి విచారం వ్యక్తం చేశారని, కానీ సభలో అధికార పక్ష మహిళా సభ్యులు కనీసం తమ వైపు చూడటానికి కూడా సిద్ధపడలేదని ఆరోపించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పోలీసుల తీరును ఎండగడుతూ, తమపై మగ పోలీసులు కావాలనే విరుచుకుపడి లాగిపడేశారని ధ్వజమెత్తారు. బిఆర్&amp;zwnj;ఎస్ ముఖ్య నేతలైన హరీష్ రావు, కేటీఆర్ చుట్టూ మహిళా పోలీసులను బందోబస్తుగా ఉంచి, తమలాంటి మహిళా ప్రజాప్రతినిధుల చుట్టూ మగ పోలీసులను మోహరించడం కాంగ్రెస్ రాజకీయం అని ఆరోపించారు. అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన కంచెలపై పడిపోయే పరిస్థితి ఎదురైనప్పుడు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డి అడ్డుపడి కాపాడారని సబిత, సునీతా లక్ష్మారెడ్డి గుర్తుచేసుకున్నారు. ఒకవైపు విదేశాలు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు సైతం తమకు జరిగిన అవమానంపై పరామర్శిస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళా కానిస్టేబుల్&amp;zwnj;కు ఇబ్బంది కలిగిందంటూ తప్పుడు కేసులు పెడుతోందని మండిపడ్డారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;దళితుల ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవమని చెబుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళల ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవంలో భాగం కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ తీవ్రమైన అంశంపై సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం సభలో నాటకాలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో సమాచారం అందుకునే ప్రభుత్వానికి, మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి సమాచారం ఎందుకు చేరలేదని మహిళా ఎమ్మెల్యేలు నిలదీశారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; మహిళల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని, తమకు జరిగిన అవమానానికి సీఎం తక్షణమే సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/45cf890bf8ee545730ff33b996bbd48e1788936354464233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[BRS MLAs Suspension: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్.. సెషన్ ముగిసేవరకు సస్పెన్షన్ వేటు!]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-mlas-suspended-from-telangana-assembly-for-entire-session-258473</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/brs-mlas-suspended-from-telangana-assembly-for-entire-session-258473#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 11:24:25 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/brs-mlas-suspended-from-telangana-assembly-for-entire-session-258473</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సెషన్ ముగిసే వరకు బీఆర్&amp;zwnj;ఎస్&amp;zwnj;కు చెందిన సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే మూడో రోజున బీఆర్&amp;zwnj;ఎస్ సభ్యులు వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను పదే పదే అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెనక్కి తగ్గాలని, ఇది దొరల పాలన కాదని కేటీఆర్ సహా బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ ఘాటుగా హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి తీవ్రమవ్వడంతో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్&amp;zwnj;బాబు ఇచ్చిన సిఫారసు మేరకే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సెషన్ ముగిసేవరకు సస్పెండ్ చేశారని తెలుస్తోంది. సభలో లేని వారిని ఎందుకు సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సస్పెన్షన్&amp;zwnj;కు గురైన వారిలో బీఆర్&amp;zwnj;ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్&amp;zwnj; రావు, కొత్త ప్రభాకర్&amp;zwnj; రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కౌశిక్&amp;zwnj; రెడ్డి, ప్రశాంత్&amp;zwnj; రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మితో పాటు మాధవరం కృష్ణారావు, మాణిక్&amp;zwnj;రావు, చింతా ప్రభాకర్&amp;zwnj;, మర్రి రాజశేఖర్&amp;zwnj;రెడ్డి, పల్లా రాజేశ్వర్&amp;zwnj;రెడ్డి, కాలేరు వెంకటేశ్&amp;zwnj;, విజయుడు, జగదీశ్&amp;zwnj; రెడ్డి, అనిల్&amp;zwnj; జాదవ్&amp;zwnj;, సుధీర్&amp;zwnj;రెడ్డి ఉన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించకుండా అడ్డంకులు కలిగిస్తున్నందుకే వారిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్&amp;zwnj; బాబు ప్రతిపాదించగా, స్పీకర్ దానికి ఆమోదం తెలిపారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/dPDncYj26WY?si=yGj8wyWxwrZ8JZX7&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు ప్రవర్తన, &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt; నివాసం వెలుపల పోలీసుల సమక్షంలో జరిగిన ర్యాలీ, కెసిఆర్ చనిపోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన బెదిరింపులు, &amp;nbsp;రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించాలని కోరుతూ బిఆర్&amp;zwnj;ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్&amp;zwnj;రెడ్డి క్షమాపణ చెప్పాలని శాసనసభలో డిమాండ్&amp;zwnj; చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ శాసనసభలో బీఆర్&amp;zwnj;ఎస్ నాయకుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత స్పీకర్&amp;zwnj;ను గౌరవించకుండా అవమానపరిచే ధోరణిని ప్రతిపక్షం తక్షణమే మానుకోవాలని ఆయన హితవు పలికారు. సభను నడిపే స్పీకర్ సూచనలను పాటించకుండా, వెల్&amp;zwnj;లోకి వచ్చి ఛాలెంజ్ చేయడం, సభ సాఫీగా సాగకుండా అడ్డంకులు సృష్టించడం సరికాదని మండిపడ్డారు. స్పీకర్ పదవిని, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానకరమని డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యానించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రతిపక్ష నేతల వైఖరి ఉందంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దళిత నాయకులు నిరసన తెలపగా పసుపు నీళ్లతో శుద్ధి చేసి అవమానించిన సంఘటనలు గుర్తులేదా అని ప్రశ్నించారు. అలాంటి వారే ఇప్పుడు న్యాయం కావాలనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల వరుస ఆందోళనలు, సభను అడ్డుకునే చర్యలను &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ప్రభుత్వం ఎంతో సంయమనంతో భరిస్తోందన్నారు. కానీ గతంలో సాగిన దొరతనం పోకడలను మళ్లీ సహించడానికి తెలంగాణ రాష్ట్రం ఏమాత్రం సిద్ధంగా లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/7671e6e8ab157d3e072ba135a8a4b6261788933167660233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-minister-nara-lokesh-recalls-chandrababu-illegal-arrest-on-3rd-anniversary-258469</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-minister-nara-lokesh-recalls-chandrababu-illegal-arrest-on-3rd-anniversary-258469#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 10:52:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-minister-nara-lokesh-recalls-chandrababu-illegal-arrest-on-3rd-anniversary-258469</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు గురై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో స్పందించారు. నిజం గెలిచింది అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అప్పటి అధికార పక్షమైన గొడ్డలి పార్టీ సరిగ్గా 3 ఏళ్ల క్రితం చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;చంద్రబాబు జైలులో ఉన్న ఆ 53 రోజుల పాటు ఆయనకు అండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ &quot;నిజం గెలవాలి&quot; అనే నినాదంతో మద్దతుగా నిలిచారని లోకేష్ గుర్తుచేసుకున్నారు. చివరకు ఆ అక్రమ కేసులన్నింటినీ న్యాయస్థానాలు కొట్టివేశాయని, న్యాయమే గెలిచి చంద్రబాబు నిర్బంధం నుంచి స్వేచ్ఛగా బయటకు వచ్చారని తెలిపారు. నాటి చీకటి రోజులను తలుచుకుంటూ, చంద్రబాబుకు మరియు పార్టీకి అండగా నిలిచిన తెలుగుజాతి మొత్తానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; అధినేత చంద్రబాబు నాయుడిని సిల్క్ డెవలప్&amp;zwnj;మెంట్ స్కాం కేసులో 2023, సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ సీఐడీ (CID) పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన చోటే సీఐడీ పోలీసులు భారీ బందోబస్తు మధ్య అదుపులోకి తీసుకున్నారు. ఏపీ స్కిల్ డెవలప్&amp;zwnj;మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించిన కేసులో చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు ప్రకటించారు. ఈ అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడమే కాకుండా, TDP శ్రేణులు రాజకీయ కక్షసాధింపుగా పేర్కొంటూ ఆందోళనలు చేపట్టాయి.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;విచారణ, రిమాండ్&lt;/strong&gt;&lt;br /&gt;అరెస్టు అనంతరం చంద్రబాబును నంద్యాల నుంచి రోడ్డు మార్గాన విజయవాడకు తరలించారు. అనంతరం విజయవాడలోని ఏసీబీ (ACB) ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, కోర్టు చంద్రబాబు నాయుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో సెప్టెంబర్ 10 రాత్రి ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.&lt;/p&gt;
&lt;p&gt;దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్&amp;zwnj;లో ఉన్న &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;కి, కంటి శస్త్రచికిత్స, వైద్య కారణాల రీత్యా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2023, అక్టోబర్ 31న నాలుగు వారాల తాత్కాలిక (మధ్యంతర) బెయిల్ మంజూరు చేసింది. దీంతో అదే రోజు సాయంత్రం ఆయన రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు వెలుపల వేలాది మంది అభిమానులు, తెదేపా నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత 2023, నవంబర్ 20న ఏపీ హైకోర్టు ఈ కేసులో ఆయనకు పూర్తిస్థాయి (రెగ్యులర్) బెయిల్ మంజూరు చేసింది.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/ac7de4b1207e9e0b82587810156049621788930729394233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Hyderabad Common Travel Pass: త్వరలో హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రోకు కలిపి ఒకటే పాస్.. ఛార్జీల పూర్తి వివరాలు]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/common-travel-pass-coming-soon-for-hyderabad-metro-and-rtc-buses-258445</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/common-travel-pass-coming-soon-for-hyderabad-metro-and-rtc-buses-258445#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 08:01:34 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/common-travel-pass-coming-soon-for-hyderabad-metro-and-rtc-buses-258445</guid><description><![CDATA[&lt;p&gt;Common Travel Pass for Hyderabad Metro and RTC Buses |&amp;nbsp;హైదరాబాద్&amp;zwnj;: నగరంలో ప్రయాణించాలంటే కేవలం బస్సులే కాదు, మెట్రో రైలులోనూ వెళ్లాల్సి వస్తుంది. అందుకే ప్రయాణికులకు త్వరలోనే ఒకే పాస్&amp;zwnj;తో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఉమ్మడి ట్రావెల్ పాస్ ను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత ఉమ్మడి పాస్ లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఒక రోజు, ఒక వారం పాస్, ఒక నెలకు చెల్లుబాటు అయ్యేలా 3 వేర్వేరు రకాల పాస్&amp;zwnj;లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం గత కొన్ని నెలలుగా భావిస్తోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నెలవారీ ట్రావెల్ పాస్ ఛార్జీ ధర&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఉమ్మడి కార్డు (Common Travel Card)కు సంబంధించిన ఛార్జీల ప్రతిపాదనలను ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రతిపాదన ప్రకారం నెలవారీ ఉమ్మడి పాస్&amp;zwnj; ధరను రూ.7,500 గా నిర్ణయించారు. ఈ పాస్&amp;zwnj; ద్వారా మెట్రో రైలుతో పాటు సిటీ ఆర్డినరీ నుంచి ఏసీ బస్సుల వరకు అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఔటర్&amp;zwnj; రింగ్&amp;zwnj; రోడ్డు (Hyderabad) పరిధి వరకు ప్రయాణించవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఎంఎంటీఎస్&amp;zwnj; (MMTS) రైళ్లు, సెట్&amp;zwnj;విన్&amp;zwnj; (Setwin) బస్సులను ఈ ఉమ్మడి కార్డు పరిధిలోకి తీసుకురావడానికి మాత్రం ఏ ప్లాన్స్ లేవని అధికారులు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/politics/telangana-assembly-high-drama-brs-trapped-in-congress-political-mind-game-258429&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Telangana Assembly Session 2026: ఆవేశం స్టార్లతో బీఆర్ఎస్&amp;zwnj;కు గండం - పక్కా ప్లాన్&amp;zwnj;తో వచ్చి కాంగ్రెస్ పొలిటికల్ ట్రాప్&amp;zwnj;లో చిక్కుకుందా?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;ఆర్టీసీలో ఒకరోజు పాస్ రూ.100 కాగా, మెట్రో రైలు కు రూ. 250.. వీటి మొత్తం రూ.350 అవుతుంది.&lt;/p&gt;
&lt;p&gt;అదే ఒక వారం రోజులకు అయితే ఆర్టీసీ పాస్ రూ.400, మెట్రోకు రూ.1800.. ఓవరాల్&amp;zwnj;గా రూ.2200 అవుతుంది.&lt;/p&gt;
&lt;p&gt;నెల రోజులకు ఆర్టీసీ పాస్ రూ.1500 కాగా, మెట్రో అయితే రూ.6000.. మొత్తం 7500 అవుతుందని ప్రతిపాదించారు. త్వరలోనే ఈ ఉమ్మడి పాస్ అందుబాటులోకి తేవడానికి అధికారులు ప్రయత్నాలు చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/0f57372032fbb567d4418a6bd8de59f51788920800646233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/sons-of-adilabad-khichdi-vendors-defy-odds-to-secure-mbbs-seats-with-neet-rank-258443</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/sons-of-adilabad-khichdi-vendors-defy-odds-to-secure-mbbs-seats-with-neet-rank-258443#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 07:39:17 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shailender ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/sons-of-adilabad-khichdi-vendors-defy-odds-to-secure-mbbs-seats-with-neet-rank-258443</guid><description><![CDATA[&lt;p&gt;వారిది మధ్య తరగతి కుటుంబం.. కుటుంబ పోషణ కోసం వారు కిచిడి బండి నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు కష్టపడి కిచిడి అమ్ముతూ.. తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. తండ్రికి చేదోడు వాదోడుగా కిచిడి బండి వద్ద ఉంటూ ఆ కుమారులు ఇంటర్ పూర్తి చేశారు. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించడానికి నీట్ పరీక్ష రాశారు. కష్టాన్ని నమ్ముకున్న ఆ యువకులు నీట్ లో ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ సీటు సంపాదించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఫుట్&amp;zwnj;పాత్ పై కిచిడి అమ్ముతూ నీట్ లో ర్యాంకు తెచ్చుకుని, ఎంబిబిఎస్ సీటు సంపాదించిన మహమ్మద్ బిలాల్, మహమ్మద్ షకిబ్ లపై ABP Desam Exclusive Story.&lt;/p&gt;
&lt;p&gt;ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ జావిద్, మహమ్మద్ ఆసిఫ్ అనే ఇద్దరు అన్నదమ్ముల కుమారులు మహమ్మద్ షకీబ్, మహమ్మద్ బిలాల్ ఈ ఇద్దరు నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ సీటు సాధించారు. వీరు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల ముందు కిచిడి బండి నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆసిఫ్, జావిద్ ఇద్దరు అన్నతమ్ముళ్లు గత కొన్నేళ్లు గా కిచిడి బండి నడిపిస్తూ తమ పిల్లల్ని పక్కనే ఉన్న జడ్పీ పాఠశాలలో చదివించారు. పదవ తరగతి వరకు షకీబ్, బిలాల్ ఇంద్రవెల్లి జడ్పీ పాఠశాలలో చదువు పూర్తి చేసి స్థానికంగానే ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. చదువుకుంటూనే రోజు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ కిచిడి బండి నడుపుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/456796c7a25dbed0739947a43b1603991788919493219233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;రెండేళ్లు నీట్ కోసం ప్రిపేర్ అయ్యారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి నీట్ లో ర్యాంకు సాధించి.. ఎంబిబిఎస్ సీటు (MBBS Seat) సంపాదించారు. మహమ్మద్ ఆసిఫ్ కుమారుడు మహమ్మద్ బిలాల్ కు నీట్ లో ఆల్ ఇండియా ర్యాంకు 120325.. స్టేట్ లొ 1788 ర్యాంక్ రాగా. అలాగే మహమ్మద్ జావిద్ కుమారుడు మహమ్మద్ షకీబ్ &amp;nbsp;నీట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 147283, రాగా.. స్టేట్ లో 2583 ర్యాంక్ సాధించారు. ఫస్ట్ ఫేజ్ లో కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశాలలో మహమ్మద్ షకిబ్ కు ఎంబిబిఎస్ సీటు రాగా, నిర్మల్ మెడికల్ కళాశాలలో మహమ్మద్ బిలాల్ కు ఎంబిబిఎస్ సీటు వచ్చింది. త్వరలో ఈ ఇద్దరు సెకండ్, థర్డ్ ఫేజ్ తరువాత తరగతులకు హాజరుకానున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/d3986e90579e7e0ff90d0891a2d8e8c21788919621797233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఇద్దరు అన్నదమ్ముల కుమారులు ఎంబిబిఎస్ సీటు సాధించడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడ్డ దానికి ఫలితం దక్కిందన్నారు. వీరికి ఎంబిబిఎస్ సీటు రావడంతో ఆదిలాబాద్ మైనార్టీ విభాగం నాయకులు వారిని సత్కరించారు. ప్రభుత్వ విప్ మహమ్మద్ షబ్బీర్ అలీతో పాటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మాజీ మంత్రి జోగు రామన్న, సైతం శాలువాతో సత్కరించి అభినందించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/1936bd53623c5ad790ea23b2190e388e1788919655067233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మహమ్మద్ జావిద్, మహమ్మద్ ఆసిఫ్ ఈ ఇద్దరు అన్నదమ్ములు, కిచిడి బండి నడిపి తమ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల కుమారులు మహమ్మద్ షకీబ్, మహమ్మద్ బిలాల్ వారికి చేదోడు వాదొడుగా ఉంటూ.. కష్టపడి చదివి ఎంబిబిఎస్ లో ఇద్దరు సైతం సీటు సంపాదించారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని, తాము పడ్డ కష్టానికి తమ తల్లిదండ్రుల కష్టానికి ఫలితం దక్కిందని మహమ్మద్ షకీబ్, మహమ్మద్ బిలాల్ మరియు వారి తండ్రులు స్థానికులు ఏబీపీ దేశంకు వెల్లడించారు. కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు. స్థానికులు, వారి టీచర్లు ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/57a0b99db9c33f9a3edd7fb5cdaa64501788919686153233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;వీరి కష్టం అంతా ఇంతా కాదని, ఉదయం 3:30 గంటలకు లేచి కిచిడి తయారు చేసి 5:30గంటలకు అల్లాహు అక్బర్ అంటూ నమాజ్ చేసి 6 గంటల కళ్ల రెడీ అయి.. జడ్పి పాఠశాల ముందు రోడ్డుపై కిచిడి బండి పెట్టీ టిఫిన్ విక్రయిస్తారు. స్థానికులు ఈ ఇద్దరు అన్నదమ్ములను జావిద్ మాము, ఆసిఫ్ మాము అని ప్రేమగా పిలుస్తుంటారు. వారి కుమారులు షకీబ్ , బిలాల్ ఇద్దరు కూడా హాలిడే రోజు లేదా వారు లేని సమయాల్లోనూ, లేదా అంగడి రోజు బిజిగా ఉన్న సమయంలో ఈ బండి నడుపుతూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ పని చేస్తారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/ee61dd311f7035f81d0fde737f187a951788919715897233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;కిచిడి అమ్మడం అయిపోయాక.. బయట ఖాళీగా తిరగకుండా ఇంట్లోనే ఉంటూ ఒక గదిలో కూర్చుని చదువుకుంటారు. ఇలా చదవడం వల్లే వారు పడ్డా కష్టానికి ఫలితం దక్కింది అంటున్నారు. ప్రతి ఒక్కరు తమ గమ్యానికి చేరుకోవాలనే లక్ష్యంతో ఉంటే.. కష్టపడి చదివితే తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెబుతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/fbe2d4493b2bec85bc9d9dd034571db81788922347189233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/1fcd426678457253e4e77b8ee85530b61788922370348233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/0b00f20e7a3d51ce08493c9121a4f3ad1788922403256233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/b8483987dc49b57f4992a5809e4a670b1788919419950233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Assembly Session 2026: ఆవేశం స్టార్లతో బీఆర్ఎస్‌కు గండం -  పక్కా ప్లాన్‌తో వచ్చి కాంగ్రెస్ పొలిటికల్ ట్రాప్‌లో చిక్కుకుందా?]]></title><link>https://telugu.abplive.com/politics/telangana-assembly-high-drama-brs-trapped-in-congress-political-mind-game-258429</link><comments>https://telugu.abplive.com/politics/telangana-assembly-high-drama-brs-trapped-in-congress-political-mind-game-258429#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 07:34:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/telangana-assembly-high-drama-brs-trapped-in-congress-political-mind-game-258429</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Revanth Reddy vs KTR Harish Rao: &amp;nbsp;&lt;/strong&gt; తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండు రోజుల పాటు &amp;nbsp;సభ లోపల నడవాల్సిన ప్రజా సమస్యల చర్చ కంటే, బయట నడిచిన రాజకీయ హైవోల్టేజ్ డ్రామానే ఊహించని మలుపులు తిరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, నెరవేర్చని ఆరు గ్యారెంటీలు, హామీల వైఫల్యాలపై పక్కా &amp;nbsp;చార్జ్&amp;zwnj;షీట్ తో ప్రభుత్వాన్ని శాసనసభ వేదికగా ఎండగట్టాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహం రచించింది. కేటీఆర్, హరీశ్&amp;zwnj;రావుల నాయకత్వంలో నల్ల చొక్కాలు ధరించి, ప్లకార్డులతో మీడియా మైలేజ్ సాధించడమే లక్ష్యంగా అసెంబ్లీ గేట్ వద్దకు చేరుకున్నారు. అయితే, ఆరంభంలోనే బీఆర్ఎస్ ఆశించిన పొలిటికల్ మైలేజ్ కాస్తా, కాంగ్రెస్ విసిరిన పక్కా పొలిటికల్ ట్రాప్&amp;zwnj;లో పడి పూర్తిగా ఆవిరైపోయింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రెండు రోజుల పాటు రచ్చ &amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అసెంబ్లీ గేటు వద్ద భద్రతా సిబ్బంది ఆంక్షలు విధించడంతో చోటుచేసుకున్న నెట్టివేతలు, తోపులాటల సమయం వరకు బీఆర్ఎస్ వ్యూహం బాగానే అమలైంది. కేటీఆర్, హరీశ్&amp;zwnj;రావు సహా ప్రజాప్రతినిధుల అరెస్టులు, మహిళా నేతల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ప్రతిపక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సెంటిమెంట్&amp;zwnj;ను రగిల్చే ప్రయత్నం చేసింది. కానీ, నిరసన ఆవేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మైండ్ గేమ్&amp;zwnj;ను ఒక్కసారిగా తిరగరాశాయి. పోలీసులతో వాగ్వాదంలో దళిత వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవస్థను ఉద్దేశించి ఆయన మాట్లాడారంటూ కాంగ్రెస్ శ్రేణులు వీడియో క్లిప్&amp;zwnj;లతో తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగాయి. ఈ ఒక్క అవకాశాన్ని పట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు రాజకీయాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సభ లోపల స్పీకర్ భోరున విలపించడం, కాంగ్రెస్ నేతలు దళిత ఆత్మగౌరవ సెంటిమెంట్&amp;zwnj;ను రగల్చడంతో అసలు కథ పక్కదారి పట్టింది. ప్రభుత్వంపై రావలసిన 'వెయ్యి రోజుల వైఫల్యాల' చర్చ కాస్తా, బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలు , స్పీకర్ అవమాన ఘటన చుట్టూ తిరిగేలా కాంగ్రెస్ నేతలు నరేటివ్&amp;zwnj;ను సెట్ చేయగలిగారు. దీంతో ప్రభుత్వాన్ని కార్నర్ చేయాల్సిన బీఆర్ఎస్, అనూహ్యంగా ఆత్మరక్షణలో పడి వివరణలు ఇచ్చుకునే పరిస్థితికి దిగజారింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రెండో &amp;nbsp;రోజూ &amp;nbsp;అదే పరిస్థితి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;రెండో రోజు పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. స్పీకర్&amp;zwnj;పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డిలను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద పోలీసులు మంగళవారం ఉదయాన్నే వారి నివాసాల వద్ద అరెస్ట్ చేయడం కాంగ్రెస్ మైండ్ గేమ్&amp;zwnj;లో పరాకాష్టగా నిలిచింది. కేటీఆర్, హరీశ్&amp;zwnj;రావులపై కూడా కేసులు నమోదు కావడం, శాసనమండలిలో ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టడంతో బీఆర్ఎస్ నాయకత్వం డిఫెన్స్&amp;zwnj;లో పడిపోయింది. &amp;nbsp; రెండు రోజుల అసెంబ్లీ ఘట్టాలను నిశితంగా పరిశీలిస్తే, ఆరంభంలో హంగామా చేసి మీడియా దృష్టిని ఆకర్షించిన బీఆర్ఎస్, చివరకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా విసిరిన 'సభా సంప్రదాయాలు - దళిత సెంటిమెంట్' అనే ఆత్మరక్షణ ట్రాప్&amp;zwnj;లో దారుణంగా చిక్కుకుపోయింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన కీలక సమయాన్ని బీఆర్ఎస్ తమ నేతల అరెస్టులు, క్షమాపణలు, వివరణలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;సీఎం &amp;nbsp;రేవంత్ పై కేటీఆర్ తిట్లతో బీఆర్ఎస్&amp;zwnj;కు డ్యామేజ్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;రాజకీయాల్లో ప్రత్యర్థులను రెచ్చగొట్టి తప్పులు చేయించడమే అసలైన వ్యూహమైతే, ప్రస్తుత పోరులో అధికార కాంగ్రెస్&amp;zwnj; విసిరిన గేండ్&amp;zwnj;లో బీఆర్ఎస్ దారుణంగా దొరికిపోయింది. సీఎం &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; లక్ష్యంగా కేటీఆర్ మీడియా ముందూ, పోలీసుల వద్ద వాడిన తీవ్రమైన, అకోపపూరిత భాష ప్రతిపక్షానికి రాజకీయంగా ఎలాంటి మైలేజ్&amp;zwnj;ను అందించలేకపోయింది. ఎమ్మెల్సీ తాతా మధు చేసిన తొందరపాటు వ్యాఖ్యల వల్లే ఈ వివాదమంతా మొదలైందనే విషయాన్ని కేటీఆర్ పక్కనపెట్టి, అదే స్థాయి ఆక్రోశాన్ని ప్రదర్శించడంతో కథ కాంగ్రెస్&amp;zwnj;కు అనుకూలంగా మారింది. చివరికి, షాద్&amp;zwnj;నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సభా ప్రాంగణం బయట &quot;కేసీఆర్ చావు కోరుకుంటున్నట్లు, ఎర్రవల్లి నివాసానికి చావు డప్పు కొడతామంటూ&quot; చేసిన వికృత వ్యాఖ్యలను సైతం ప్రజాక్షేత్రంలో సెంటిమెంట్&amp;zwnj;గా మార్చుకుని సానుభూతి సాధించడంలో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైంది. కేటీఆర్ తీవ్రమైన భాషను పక్కనపెట్టి, ప్రజాస్వామ్యయుతమైన శైలితో నిలదీసి ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై ప్రజల సానుభూతి పూర్తిగా &lt;a title=&quot;కేసీఆర్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/kcr&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కేసీఆర్&lt;/a&gt;&amp;zwnj;కే దక్కేది. కానీ, &lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; ఉద్దేశపూర్వకంగా రగిల్చిన ఆవేశపు ట్రాప్&amp;zwnj;లో పడి బీఆర్ఎస్ రెచ్చిపోవడం వల్ల, ప్రత్యర్థి చేసిన పెద్ద తప్పు కూడా కప్పిపోయి.. చివరికి బీఆర్ఎస్&amp;zwnj;కే రాజకీయంగా తీవ్ర నష్టం చేకూరింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/side-effects-of-eating-apples-at-night-what-you-should-know-258393&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/08/5a6c9e486594c1500f9280f33643e8b91788879231519228_original.png" width="220"/></item></channel></rss>