ED Raids In Medical Colleges : తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన సోదాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ప్రకటన విడుదల చేసింది.  12 వైద్య కళాశాలలు, సంబంధిత వ్యక్తుల కార్యాలయాల్లో..  16చోట్ల ఈడీ అధికారుల తనిఖీలు చేశారని తెలిపింది.  హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ తో పాటు పలు చోట్లు తనిఖీలు జరిరగాయి.  పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసినట్లుగా ఫిర్యాదులు రావడంతో సోదాలు చేశామన్నారు. మనీ లాండరింగ్‌కు సంబధించి స్పష్టమైన ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లుగా తెలింది.  పలు కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్ లు, హార్డు డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. మంత్రి మల్లారెడ్డికి చెందిన వైద్య కాలేజీలోనే ఎక్కువ మొత్తం నగదు లభించింది.    మల్లారెడ్డి వైద్య కళాశాలలో 1.4కోట్ల నగదు, బ్యాంకు ఖాతాలో ఉన్న 2.89కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది. 


 







తెలంగాణ రాష్ట్రంలోని  రాష్ట్రంలోని పలు మెడికల్‌ కాలేజీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం, గురువారాల్లో  ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఆయా కళాశాలల యాజమానుల ఇండ్లు, కార్పొరేట్‌ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించింది. మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీతోపాటు ఎల్బీనగర్‌లోని కామినేని మెడికల్‌ కాలేజీ, ఎస్వీఎస్‌, ప్రతిమ, డెక్కన్‌, మహేందర్‌రెడ్డి మెడికల్‌ కాలేజీ, ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ, మెడిసిటీ మెడికల్‌ కాలేజీల్లో ఒకేసారి రైడ్స్‌ నిర్వహించారు.                 


పీజీ మెడికల్‌ సీట్ల గోల్‌మాల్‌ నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టింది.  సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి ఆయా కళాశాలలకు చెందిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కాలేజీలకు చెం దిన కీలక పత్రాలను, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.  ఈడీ సోదాల నేపథ్యంలో ఆయా వైద్యకళాశాలలు, వాటి  ఆస్పత్రుల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అత్యవసర రోగులను తప్ప మరెవరినీ లోపలికి అనుమతించలేదు.               


సోదాల్లో ఇద్దరు మంత్రుల కాలేజీలు ఉన్నాయి. మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ తో పాటు ఖమ్మంలో పువ్వాడ అజయ్ కు చెందిన మమతా  మెడికల్ కాలేజీ ఉంది. అయితే ఒక్క మల్లారెడ్డి కాలేజీలోనే నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా ఈడీ చెప్పడం ఆసక్తికరంగా మారింది. అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నందున మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంపైనే ఈడీ కేసు నమోదు చేశారు.