Telangana Assembly  oath :   తెలంగాణ అసెంబ్లీలో 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. బీజేపీ సభ్యులు ఎనిమిది మంది ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఉంటే ప్రమాణం చేయబోమని ప్రకటించారు. మిగిలిన పది మందిలో ఎనిమిది మంది బీఆర్ఎస్ వాళ్లు కాగా ఇద్దరు కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు.  ప్రొటెం స్పీకర్​ గా నియమించిన ఎంఐఎం ఎమ్మెల్యే   అక్బరుద్దీన్ ఒవైసీతో రాజ్​ భవన్​ లో గవర్నర్​ గవర్నర్​ తమిళిసై ప్రమాణం చేయించారు.  తరువాత అసెంబ్లీ సమావేశంలో  కొత్తగా ఎన్నికై.. సమావేశంలో పాల్గొన్న  ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్​ ప్రమాణం చేయించారు.   తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, ఆ తర్వాత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆల్ఫాబేటికల్​ ఆర్డర్​ లో  ప్రమాణ స్వీకారం చేశారు. 


కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు. ప్రమాణం చేయాలంటే..ఎంపీగా రాజీనామా  చేయాలి. వారు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. వారు ఢిల్లీ వెళ్లి రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆస్పత్రిలో ఉన్నందున  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను చూసుకుంటూ ఆస్పత్రిలోనే  కేటీఆర్ ఉన్నదున వారు హాజరు కాలేదు.  అలాగే   కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్, టి.పద్మారావు గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి  కూడా వివిధ కారణాలతో ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్నారు. 


మరో వైపు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన రెండో రోజు అసెంబ్లీ గేటు ముందు తొలి నిరసన బీజేపీ ఎమ్మెల్యే చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలు  ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించింది. అయితే అందరూ అసెంబ్లీ దగ్గరకు వచ్చారు. అసెంబ్లీ గేట్ నెంబర్ 2 వద్ద రోడ్డుపై కూర్చొని బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కన్నా ఐదుగురు సీనియర్ ఎమ్మెల్యేలు ఉండగా అక్బరుద్దీన్‌కు ఏవిధంగా ప్రొటెం స్పీకర్ ఇస్తారని బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారి నిరసనను అడ్డుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు పోలీసులు నచ్చజెప్పి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఎమ్మెల్యేలను తరలించారు.  


తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కసరత్తు ప్రారంభమయింది.  సోమవారం రోజు స్పీకర్ ఎన్నికల కోసం బులెటిన్ విడుదల చేస్తారు.  స్పీకర్ నామినేషన్ల కోసం రెండు రోజుల గడువు ఉంటుంది.  ఈ నెల 14న గురువారం తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం  అవుతాయి.  15 న  గురువారం  రోజు స్పీకర్ ఎన్నిక  ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రకటించింది. ఆయనే కాంగ్రెస్ తరపున నామినేషన్ వేస్తారు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా నిలబడతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.