ఒప్పో మార్కెట్లో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ77 5జీ. ఈ స్మార్ట్ ఫోన్ 5జీని సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. వాటర్ డ్రాప్ తరహా నాచ్ డిస్‌ప్లే, వెనకవైపు రెండు కెమెరాలు ఇందులో ఉన్నాయి.


ఒప్పో ఏ77 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను 9,999 థాయ్‌ల్యాండ్ బాత్‌లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.22,500) నిర్ణయించారు. మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


ఒప్పో ఏ77 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.


ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. సెక్యూరిటీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5జీ, వైఫై, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా అందించారు. 


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!