హెచ్‌టీసీ కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. గత స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన ఆరు నెలల తర్వాత హెచ్‌టీసీ కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది. అదే హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రో. ఇది ఒక మెటావర్స్ ఫోకస్డ్ స్మార్ట్ ఫోన్. ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) డివైస్‌ల్లో 2డీ, 3డీ కంటెంట్‌ను కూడా ఈ డివైస్‌ను ఎంజాయ్ చేయవచ్చు. హెచ్‌టీసీ వైవ్ ఫ్లో వీఆర్ గ్లాస్‌లను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.


హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 399 యూరోలుగా (సుమారు రూ.38,500) నిర్ణయించారు. యూకేలో దీన్ని ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. ఆగస్టు 1వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రో అందుబాటులో ఉంది. మనదేశంలో ఈ ఫోన్ అసలు లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు.


హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4520 ఎంఏహెచ్ కాగా... 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!