గల్గోటియాస్ విశ్వవిద్యాలయం 'ఓరియన్' అనే రోబోను తమ ఆవిష్కరణగా ప్రదర్శించింది, కానీ అది వాస్తవానికి చైనా నుండి కొనుగోలు చేసిన రోబో అని తేలింది. దీనిని ప్రభుత్వం జాతీయ అవమానంగా పరిగణించింది.
AI Impact Summit 2026: చైనా కుక్కను తెచ్చి మోసం చేసి యూనివర్శిటీ ! ఏఐ సమ్మిట్ నుంచి గెంటేసిన ప్రభుత్వం!
Galgotias University AI Summit: గల్గోటియాస్ యూనివర్సిటీలో చైనీస్ రోబోను సమస్య మరింత ముదురుతోంది. ఆ యూనివర్సిటీని సమ్మిట్ నుంచే బహిష్కరించారు.

Galgotias University AI Summit: ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో గల్గోటియాస్ విశ్వవిద్యాలయం చేసిన మోసం సంచలనంగా మారుతోంది. రోబోడాగ్ చుట్టూ ఉన్న వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. "ఓరియన్" అనే రోబో తన సొంత ఆవిష్కరణ అని చెప్పుకోలేదని, విద్యార్థుల పరిశోధన కోసం దానిని కొనుగోలు చేసినట్టు విశ్వవిద్యాలయం ప్రకటించింది. అయితే ప్రభుత్వం దీనిని జాతీయ అవమానంగా అభివర్ణించింది. స్టాల్ను ఖాళీ చేయమని ఆదేశించింది.
చైనా రోబోలపై మౌనం వీడిన ప్రభుత్వం
ఈ విషయంపై ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ, "ఎగ్జిబిటర్లు తమకు చెందని వస్తువులను ప్రదర్శించకూడదు" అని అన్నారు. ప్రభుత్వం ఈ వివాదాన్ని తీవ్రంగా ఖండించింది. నిజమైన, అసలైన ప్రాజెక్టులను మాత్రమే సమిట్లో ప్రదర్శనకు పెట్టాలని పేర్కొంది. ఫిబ్రవరి 18న గల్గోటియాస్ స్టాల్కు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. వెంటనే ఎక్స్పోను ఖాళీ చేయాలని విశ్వవిద్యాలయాన్ని ఆదేశించారు.
"Your 6 can be my 9”
— Vinay Kumar Dokania (@VinayDokania) February 18, 2026
- Prof. Neha Singh from Galgotias
She can eat 100 Anjanas 200 Rubikas, 300 Chitras, 400 Navikas and 500 Shwetas alone when it comes to defending the most undefendable lies and faulty claims. pic.twitter.com/5nL9mSstMO
విశ్వవిద్యాలయం స్టాల్ను తొలగించినట్టు కృష్ణన్ ప్రకటించారు. యూనివర్శిటీ అధికారులు మాత్రం తమకు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని అన్నారు. "దీనిని ఏదోలా ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యం లేదు. ఇక్కడ ప్రదర్శించే వస్తువులపై ఎటువంటి వివాదం తలెత్తకూడదని మేము కోరుకుంటున్నాము."
ఆవిష్కరణలను తొక్కిపెట్టడం మా లక్ష్యం కాదు: కృష్ణన్
ప్రదర్శనలో ఉన్న మోడల్స్ను అధికారులు ముందుగా తనిఖీ చేయరా అని అడిగినప్పుడు, కృష్ణన్ మాట్లాడుతూ, ఈ సమ్మిట్ సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్ కాదని అన్నారు. ఇది ఒక ప్రదర్శన. అందువల్ల, సర్టిఫికేషన్ చేయవలసిన వస్తువులు అమ్మకానికి లేవు. ఏదైనా ప్రజా పంపిణీ లేదా అమ్మకం కోసం ఉన్నప్పుడు మాత్రమే సర్టిఫికేషన్ జరుగుతుంది.
"ఎవరైనా ఒక ఉత్పత్తిని ప్రదర్శిస్తున్నప్పుడు, వారికి ఆ విషయం గురించి పూర్తి పరిజ్ఞానం ఉందని అనుకుంటారు" అని కృష్ణన్ అన్నారు. "ప్రదర్శనలో ఉన్న వస్తువులు కూడా ధృవీకరించాల్సి వస్తే, ఆవిష్కరణలను తొక్కిపెడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆ పని చేయడం మా ఉద్దేశ్యం కాదు."
క్షమాపణలు చెబుతూ విశ్వవిద్యాలయం ఏం చెప్పింది?
"డెవలప్", "డెవలప్మెంట్" అనే పదాల మధ్య ప్రొఫెసర్ నేహా గందరగోళానికి గురయ్యారని రిజిస్ట్రార్ నితిన్ కుమార్ గౌర్ అన్నారు. "మేం రోబోను అభివృద్ధి చేయలేదు, కానీ దాన్ని మోడిఫికేషన్ చేశాము. విద్యార్థుల పరిశోధన, అభ్యాసం కోసం దీనిని కొనుగోలు చేశాము" అని ఆయన వివరించారు. విశ్వవిద్యాలయం క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏదో తప్పుగా చిత్రీకరించాలనే ఉద్దేశ్యం తమకు లేదని పేర్కొంది. ప్రొఫెసర్ నేహా కూడా తన మాటలను "తప్పుగా అర్థం చేసుకున్నారని" అన్నారు.
ఈ అంశంపై రాజకీయ దుమారం
చైనీస్ రోబోటిక్ కుక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రాజకీయ వర్గాలు కలకలం రేపాయి. రాహుల్ గాంధీ, X లో ఒక పోస్ట్లో, ఈ శిఖరాగ్ర సమావేశాన్ని తీవ్రంగా విమర్శించారు. "భారతీయ ప్రతిభ, డేటాను ఉపయోగించుకునే బదులు, చైనా ఉత్పత్తులను ప్రదర్శించారు" అని రాశారు. సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ బీజేపీ నాయకులు గల్గోటియాను ఆదరిస్తున్నారని ఆరోపించారు. శివసేన (UBT)కి చెందిన ప్రియాంక చతుర్వేది దీనిని సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మోసం ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్కు తెలిసి జరిగిందా అని టీఎంసీకి చెందిన సాకేత్ గోఖలే ప్రశ్నించారు.
రోబోటిక్ కుక్కపై వివాదం ఎలా మొదలైంది?
ఫిబ్రవరి 17, 2026, సమ్మిట్ రెండో రోజున గల్గోటియాస్ విశ్వవిద్యాలయం ఎక్స్పో స్టాల్లో "ఓరియన్" అనే రోబో ప్రదర్శనకు ఉంచారు. కమ్యూనికేషన్స్ విభాగం అధిపతి ప్రొఫెసర్ నేహా సింగ్ ఒక ఇంటర్వ్యూలో డిడి న్యూస్తో మాట్లాడుతూ, ఈ రోబోను విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, ఆ రోబో చైనీస్ కంపెనీ యూనిట్రీ రోబోటిక్స్ నుంచి వచ్చిన Go2 మోడల్ అని తేల్చారు. ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని ధర 2.5 నుంచి 3 లక్షల రూపాయల మధ్య ఉంటుంది. "మేక్ ఇన్ ఇండియా" అనే అంశంపై జరిగిన శిఖరాగ్ర సమావేశంలో చైనీస్ ఉత్పత్తిని ప్రదర్శించడంపై విమర్శుల వెల్లువెత్తాయి.
ఈ శిఖరాగ్ర సమావేశం ఇంకా కొనసాగుతోంది, కానీ ఈ ఘటన "మేక్ ఇన్ ఇండియా"AI ఆవిష్కరణల ఇమేజ్పై అనేక అనుమానాలకు తావిస్తోంది. రోబో ఒక పరిశోధనా సాధనం అని, ఆవిష్కరణ వాదన కాదని విశ్వవిద్యాలయం వాదిస్తోంది. అయితే, సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోలింగ్ కొనసాగుతున్నాయి.
Frequently Asked Questions
గల్గోటియాస్ విశ్వవిద్యాలయం AI సమ్మిట్లో ప్రదర్శించిన 'ఓరియన్' రోబోపై వివాదం ఏమిటి?
విశ్వవిద్యాలయం 'ఓరియన్' రోబో విషయంలో ఎలాంటి వివరణ ఇచ్చింది?
విశ్వవిద్యాలయం తమ రోబోను అభివృద్ధి చేయలేదని, కానీ విద్యార్థుల పరిశోధన కోసం మోడిఫికేషన్ చేసి కొనుగోలు చేశామని, దీనిని తప్పుగా చిత్రీకరించే ఉద్దేశ్యం లేదని క్షమాపణలు చెప్పింది.
ఈ వివాదంపై ప్రభుత్వం స్పందన ఏమిటి?
ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది, ఎగ్జిబిటర్లు తమకు చెందని వస్తువులను ప్రదర్శించకూడదని, నిజమైన ప్రాజెక్టులను మాత్రమే ప్రదర్శించాలని ఆదేశించింది. విశ్వవిద్యాలయ స్టాల్ను ఖాళీ చేయించింది.
రాజకీయ నాయకులు ఈ సంఘటనపై ఎలా స్పందించారు?
రాహుల్ గాంధీ, ప్రియాంక చతుర్వేది వంటి నాయకులు దీనిని 'భారతీయ ప్రతిభను అవమానించడం' అని విమర్శించారు మరియు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.























