Claude Mythos in India: టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటి వరకు మనం చాట్‌జీపీటీ లేదా క్లాడ్ వంటి మోడళ్లను కేవలం సమాచారం కోసం లేదా కంటెంట్ కోసం వాడుతున్నాం. కానీ వీటన్నింటికీ మించిన అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన సామర్థ్యాలు ఉన్న ఒక ఏఐ మోడల్ ఇప్పుడు భారత్‌లోకి అడుగుపెడుతోంది. అదే అమెరికన్ ఏఐ స్టార్టప్‌ ఆంత్రోపిక్‌ అభివద్ధి చేసినక్లాడ్ మిథోస్‌. అసలు ఈ క్లాడ్‌ మిథోస్ ఏంటీ? భారత్‌ ఏయే రంగాలపై ప్రభావం చూపనుంది? దీనిని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు అనే వివరాలు తెలుసుకుందాం. 

Continues below advertisement

సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఆంత్రోపిక్ వారి క్లాడ్ మిథోస్ మోడల్ ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. కొన్ని భారతీయ సంస్థలు దీనిని పొందేందుకు సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి, అమెరికన్ కంపెనీ ఆంత్రోపిక్, మరిన్ని సంస్థలు, ప్రభుత్వాలు ,సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలకు ఈ మోడల్‌కు యాక్సెస్ అందిస్తామని ఇటీవల ప్రకటించింది. ఈ మోడల్ చాలా శక్తివంతమైనదిగా చెబుతున్నారు. ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ, సాఫ్ట్‌వేర్‌ను అయినా క్షణాల్లో హ్యాక్ చేయగలదు. అందువల్ల, దీనిని ఇంకా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు.

150 కొత్త సంస్థలు క్లాడ్ మిథోస్‌ను పొందే అవకాశం 

సుమారు 150 కొత్త సంస్థలకు ఈ మోడల్ అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆంత్రోపిక్ తెలిపింది. దీంతో మొత్తం సంస్థల సంఖ్య 200కు చేరుతుంది. గతంలో, ఈ సంస్థ యూఎస్,  యూకేలోని కొన్ని కంపెనీలతో ఈ మోడల్‌ పరీక్షిస్తోంది. ఇప్పుడు దీనిని ఆర్థిక సేవలు, సైబర్‌ సెక్యూరిటీ, టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్స్, విద్యుత్, నీరు, హార్డ్‌వేర్ రంగాలలోని కంపెనీలతో పరీక్షిస్తున్నారు.

Continues below advertisement

ఇప్పుడు ఈ దేశాలకు ప్రవేశం లభించింది

అమెరికా, యూకేతోపాటు, భారత్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్, స్పెయిన్, స్వీడన్, నెదర్లాండ్స్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలలోని సంస్థలకు కూడా ఆంత్రోపిక్ తన మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ దేశాలలో ఏయే సంస్థలు ఇప్పుడు ఈ మోడల్‌ను పొందగలవనే వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు.

కీలకమైన సాఫ్ట్‌వేర్‌లో వేలాది లోపాలు గుర్తించిన మిథోస్ 

ఒకే నెలలో ప్రపంచంలోని అత్యంత కీలకమైన సాఫ్ట్‌వేర్‌లో 10,000కు పైగా సైబర్‌ సెక్యూరిటీ లోపాలను క్లౌడ్ మిథోస్ గుర్తించిందని ఆంత్రోపిక్ ఇటీవల రిపోర్ట్ చేసింది. ఈ మోడల్‌కు యాక్సెస్ ఉన్న అనేక కంపెనీలు, మిథోస్‌ను ఉపయోగించడం ద్వారా లోపాలను గుర్తించే వేగంలో 10 రెట్లు పెరుగుదల నమోదైనట్లు చెప్పింది. గూగుల్,  ఓపెన్‌ఏఐ వంటి కంపెనీలు కూడా ఇప్పుడు ఇలాంటి సైబర్‌ సెక్యూరిటీ మోడళ్లను అమలు చేశాయి .

మిథోస్‌ను పోలిన మోడల్ ప్రజల ముందుకు 

ఇంకా ప్రజల కోసం క్లాడ్ మిథోస్‌ను  విడుదల చేయలేదు. తమతో సహా ఏ కంపెనీ కూడా ఇటువంటి మోడళ్ల తప్పుడు దారిలో వెళ్లకుండా నివారించే మోడల్‌ను అభివృద్ధి చేయలేదని ఆంథ్రోపిక్ పేర్కొంది. అందుకే దుర్వినియోగానికి అవకాశం లేని ఇలాంటి మోడల్‌ను ప్రజలకు విడుదల చేయాలని ఆంథ్రోపిక్‌ భావిస్తోంది. ఇది రాబోయే కొద్ది వారాల్లో విడుదల కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.