IND vs Pak T20: ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ఉత్కంఠభరిత పోరు. అభిమానులు మాత్రమే కాదు, ఆటగాళ్లలో కూడా ఈ మ్యాచ్‌కు ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది. అదే విషయం కొలంబోలో మరోసారి బయటపడింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన టాస్ సమయంలోనే ఇరు జట్ల మధ్య ఉద్రిక్తత స్పష్టంగా కనిపించింది.

Continues below advertisement

సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో టాస్ సమయంలో కెప్టెన్లు ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించడం, హ్యాండ్‌షేక్ చేసుకోవడం అనేది కామన్ సీన్. కానీ భారత్ పాక్ మధ్య నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అది ఎవరూ Expect  చేయడం లేదు. ఇండియా, పాకిస్థాన్ కెప్టెన్లు టాస్ కోసం మైదానంలోకి వచ్చినప్పటికీ, ఒకరినొకరు గంభీరంగా చూసుకుని, హ్యాండ్‌షేక్ చేయకుండా తమ తమ వైపు తిరిగిపోయారు. ఈ చిన్న సంఘటన కూడా మ్యాచ్ Intensity ని ప్రతిబింబించింది.

ఇది కేవలం టాస్ మాత్రమే అయినప్పటికీ, ఇరు జట్ల మధ్య ఉన్న కాంపిటేటివ్ ఫీలింగ్ ఎంత తీవ్రంగా ఉందో అభిమానులకు స్పష్టమైన సంకేతం ఇచ్చింది. ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌లలో ఎప్పుడూ ఎమోషనల్ సీన్స్ కామన్. అందుకే వీటికి మామూలు మ్యాచ్‌లకు మించి ఆదరణ ఉంటుంది. 

Continues below advertisement

కొలంబో స్టేడియంలో కూడా అదే ఉత్సాహం కనిపించింది. వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చి, తమ తమ జట్లకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇండియా అభిమానులు త్రివర్ణ పతాకాలతో, పాకిస్థాన్ అభిమానులు తమ జాతీయ జెండాలతో స్టేడియాన్ని రంగురంగులంగా మార్చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే వాతావరణం పూర్తిగా హీటెక్కింది.

టాస్ దగ్గరే కనిపించిన ఈ ‘Coldwar’ మ్యాచ్‌లో కూడా అదే తీవ్రత కొనసాగుతుందా అన్న ఆసక్తి నెలకొంది. ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా మైదానంలోకి దిగుతున్న నేపథ్యంలో ప్రతి బాల్, ప్రతి రన్ కీలకంగా మారనుంది. ఆల్రెడీ పాకిస్థాన్ వాళ్లు ఇండియన్ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అభిషేక్ శర్మ వికెట్ తీసేసుకున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ నుంచే మొదలైన ఈ ‘సైలెంట్ వార్’ చివరికి ఎవరి విజయంతో ముగుస్తుందో చూడాలి.