Jhandu Kumar:2026 కామన్వెల్త్ క్రీడల రెండో రోజున, పారా-పవర్లిఫ్టింగ్లో కాంస్య పతకం సాధించిన ఝండు కుమార్ భారత్కు అతిపెద్ద విజయాన్ని అందించాడు. పారా-పవర్లిఫ్టింగ్లో దేశానికి తొలి పతకాన్ని సాధించి ఝండు చరిత్ర సృష్టించాడు. జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్న అతని ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఇది అతనికి తొలి అంతర్జాతీయ పతకం.
ఝండు కుమార్ బిహార్కు చెందిన ఒక రైతు బిడ్డ. ఝండు తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు, కొన్నిసార్లు తన కుటుంబాన్ని పోషించడానికి కూరగాయలు కూడా అమ్మాడు. ఆ తర్వాత, అతను ఈ-రిక్షా కూడా నడిపాడు. అయినా సరై ఆటపై తనకు ఉన్న ఆశను చంపుకోలేదు. అతను నిరంతరం కష్టపడి పనిచేశాడు, ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం లభించింది. మహోన్నతమై వేదికపై పతకం గెలిచి దేశానికి కీర్తిని తెచ్చాడు.
పారా-పవర్లిఫ్టింగ్లో దేశానికి తొలి పతకాన్ని ఝండు కుమార్ సాధించాడు. పురుషుల హెవీవెయిట్ విభాగంలో ఝండు కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 181, 190 కిలోగ్రాముల బరువులను విజయవంతంగా ఎత్తి, 130.9 పాయింట్లు సాధించాడు. 196 కిలోగ్రాముల వద్ద అతని చివరి ప్రయత్నం విఫలమైంది. ఈ ఈవెంట్లో నైజీరియాకు చెందిన ఇద్రిస్ రిలువాన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, మాథ్యూ హార్డింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు.
అశోక్ మాలిక్ పతకాన్ని కోల్పోయాడు. అతను పురుషుల లైట్వెయిట్ పారా పవర్లిఫ్టింగ్ ఈవెంట్లో 143.8 స్కోరుతో నాల్గో స్థానంలో నిలిచాడు. పరంజీత్ కుమార్ 135.6 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచాడు. కార్తీక్ పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్13 పారా స్విమ్మింగ్ ఈవెంట్ ఫైనల్లో నాల్గో స్థానంలో నిలిచాడు.
