ఐపీఎల్ చరిత్రలో శామ్ కరన్ రికార్డు సృష్టించాడు. వచ్చే ఐపీఎల్ కోసం జరుగుతున్న మినీ వేలంలో శామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రేటు. ఇంతకు ముందు రికార్డు క్రిస్ మోరిస్ పేరిట ఉంది. ఐపీఎల్ 2021 కోసం జరిగిన వేలంలో క్రిస్ మోరిస్‌ను రాజస్తాన్ రాయల్స్ రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డు బద్దలు అయింది.


మరో వైపు ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపుతుంది. తన పర్స్‌లో సగం మొత్తాన్ని ఇద్దరు ఆటగాళ్ల మీదనే ఖర్చు పెట్టింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఏకంగా రూ.13.25 కోట్లకు దక్కించుకుంది. ఇక భారత బ్యాటర్, కెప్టెన్ మెటీరియల్ మయాంక్ అగర్వాల్‌ను రూ.8.25 కోట్లకు రైజర్స్ దక్కించుకుంది. కేవలం వీరిద్దరి మీదనే సన్‌రైజర్స్ రూ.21.5 కోట్లను ఖర్చుపెట్టడం విశేషం.


సన్‌రైజర్స్ పర్స్‌లో ఇంకా రూ.20.75 కోట్లు ఉన్నాయి. వేలంలో ఇంకా శామ్ కరన్, బెన్ స్టోక్స్ వంటి క్రేజీ ప్లేయర్స్ ఉన్నారు. వీరిపై కూడా సన్‌రైజర్స్ కన్నేసే అవకాశం ఉంది. ఈ వేలంలో మొదటి నుంచి సన్‌రైజర్స్ అగ్రెసివ్‌గానే దూసుకెళ్లింది. ఇక మిగతా జట్ల విషయానికి వస్తే... కేన్ విలియమ్సన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఫాంలో ఉంటే కేన్ విలియమ్సన్ ఎంత ప్రమాదకరమైన ఆటగాడో అందరికీ తెలిసిందే.