IPL 2026 Final Venue: ఐపీఎల్ ఫైనల్ ఆతిథ్య హక్కులను RCB నుంచి ఎందుకు తొలగించారు? BCCI క్లారిటీ ఇదే
IPL 2026 Final Date: బీసీసీఐ ఫైనల్ మే 31న జరగనున్న ఐపీఎల్ ఫైనల్ 2026 వేదికగా మొదట బెంగళూరును ఎంచుకుంది, కానీ కొన్ని కారణాలతో నరేంద్ర మోదీ స్టేడియంకు మార్చారు.

ముంబై: IPL 2026 ఫైనల్ మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. బుధవారం నాడు BCCI ఐపీఎల్ 19వ సీజన్ ప్లేఆఫ్ల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. ఐపీఎల్ ఫైనల్ వేదిక కోసం మొదట బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియాన్ని ఎంచుకున్నామని, అయితే ఎందుకు దానిని అహ్మదాబాద్కు మార్చారో బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ లీగ్ స్టేజీ కీలక దశకు చేరుకుంది. ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ ఆయా జట్లకు ముఖ్యమే. రేసులో నిలవాలంటే ఆ జట్లు మ్యాచ్లు నెగ్గక తప్పదు. ప్లేఆఫ్ల పరంగా ప్రతి మ్యాచ్ చాలా ముఖ్యమైనది. నరేంద్ర మోదీ స్టేడియం గుజరాత్ టైటాన్స్ హోం గ్రౌండ్, ఇక్కడ గత 4 ఏళ్లలో 3 ఫైనల్స్ జరిగాయి. ఇప్పుడు ఈ సీజన్లో ఈ వేదికపై నాల్గవ ఫైనల్ నిర్వహించనున్నారు. ప్లేఆఫ్స్ షెడ్యూల్ ప్రకటనతో పాటు, ఐపీఎల్ 2026 ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఎంచుకున్నామని, అయితే కొన్ని విషయాల వల్ల వేదికను మార్చాల్సి వచ్చిందని BCCI స్పష్టంగా తెలిపింది.
RCB నుండి ఆతిథ్యాన్ని ఎందుకు తీసేశారు.. BCCI ఏం చెప్పింది
‘ఐపీఎల్ 2026 ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వడానికి మొదట బెంగళూరును ఎంచుకున్నాం. అయితే, స్థానిక క్రికెట్ బోర్డ్, అధికారుల కొన్ని అవసరాల కారణంగా, ఇవి BCCI నిబంధనలు, ప్రోటోకాల్ల పరిధికి మించి ఉన్నాయి. దాంతో ఫైనల్ వేదిక బెంగళూరు నుంచి మరో వేదికకు మార్చాల్సి వచ్చిందని’ బీసీసీఐ పేర్కొంది.
కొన్ని నివేదికల ప్రకారం, టిక్కెట్ల అమ్మకం, డిమాండ్కు సంబంధించి వివాదం కారణంగా RCB హోం గ్రౌండ్ నుండి ఫైనల్ ఆతిథ్యాన్ని తీసేశారని సమాచారం. సీజన్ ప్రారంభానికి ముందు, MLAలు ప్రజా ప్రతినిధులు, వారికి కనీసం 5 ఐపీఎల్ టిక్కెట్లు ఇవ్వాలి. వారు టిక్కెట్ల కోసం ఎందుకు క్యూలో నిల్చోవాలి ? అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ కూడా RCB మ్యాచ్ల కోసం MLAలు, ఎంపీలకు 3 టిక్కెట్లు చొప్పున ఇస్తామని చెప్పారు.
అయితే, టిక్కెట్ల డిమాండ్ గురించి BCCI స్పష్టంగా ఏం చెప్పలేదు, అయితే స్థానిక క్రికెట్ బోర్డు (కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్), అధికారుల కొన్ని అవసరాలు ఉన్నాయని.. ఇవి BCCI మార్గదర్శకాలు, ప్రోటోకాల్ల పరిధిలోకి రావని పేర్కొంది. ఇదే కారణాలతో IPL 2026 ఫైనల్ వేదిక మార్చినట్లు అంతా భావిస్తున్నారు. మరోవైపు గత ఏడాది ఆర్సీబీ విజయం సాధించాక చిన్నస్వామిలో కార్యక్రమంలో సందర్భంగా తొక్కిసలాట జరిగి అభిమానులు చనిపోవడం తెలిసిందే. అభిమానుల సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని అతిపెద్ద స్టేడియంలో, పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ఫైనల్ వేదికను అహ్మదాబాద్ లోని నరేంద్ర స్టేడియానికి మార్చినట్లు తెలుస్తోంది.
IPL 2026 ప్లేఆఫ్ల షెడ్యూల్
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 ( లీగ్ స్టేజీలో తొలి 2 స్థానాల్లోని జట్లు) మే 26న ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిర్వహిస్తారు. ఆపై ఎలిమినేటర్ మ్యాచ్ ( లీగ్ స్టేజీలో 3, 4 స్థానాల్లో జట్లు) మే 27న న్యూ చండీగఢ్ (ముల్లాన్పూర్)లో జరుగుతుంది. మే 29న న్యూ చండీగఢ్లో క్వాలిఫయర్-2 జరుగుతుంది. ఫైనల్ మే 31న నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు
ట్రెండింగ్ వార్తలు




















