Dharamsala Pitch Report Explains Why RCB Holds Slight Edge Over GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ లో మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య జరగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్ కు ధర్మశాల వేదిక కానుంది. ఈ సీజన్ లో ఇక్కడ జరిగిన మూడు ఐపీఎల్ మ్యాచ్‌ల రికార్డులను పరిశీలిస్తే ధర్మశాల స్టేడియం భారీ స్కోర్ల వేదికగా మారినట్లు స్పష్టమవుతోంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్లు 200 మార్కును తాకడం లేదా దాటడం విశేషం. ఒకప్పుడు ఇది కేవలం బౌలర్లకు మాత్రమే అనుకూలించే పిచ్ అనే అంచనా ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రారంభ ఓవర్లను తట్టుకుని నిలబడితే బ్యాటర్లు ఇక్కడ భారీగా పరుగులు సాధించవచ్చు.

Continues below advertisement

Read Also: Vaibhav Sooryavanshi Records: దేవదత్ పడిక్కల్ రికార్డ్ బ్రేక్.. టీ20 క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత

స్వింగ్, సీమ్ మూవ్‌మెంట్.. 

Continues below advertisement

సముద్ర మట్టానికి దాదాపు 1,450 మీటర్ల ఎత్తులో ఉన్న ధర్మశాల మైదానంలో కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లకు మంచి కన్వెన్షనల్ స్వింగ్ లభిస్తుంది. ఇక్కడి చల్లని పర్వత గాలి, పిచ్ బౌన్స్ వల్ల పేసర్లు హార్డ్ లెంగ్త్స్ ను ఈజీగా హిట్ చేయగలరు. ప‌వ‌ర్ ప్లే ఆరు ఓవర్లలో వికెట్లు పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే బంతి పాతబడే కొద్దీ, ఔట్‌ఫీల్డ్ వేగంగా ఉండటం వల్ల బ్యాటర్లు పుంజుకుని భారీగా స్కోర్ చేస్తారు. క్వాలిఫైయర్ 1 టాక్టికల్ ఫైట్ అనేది పవర్‌ప్లేను ఏ జట్టు బాగా వాడుకుంటుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కండిషన్స్ ప్రకారం ఆర్‌సీబీ పేస్ ఎటాక్‌కు ఇక్కడ కొంచెం ఎడ్జ్ కనిపిస్తోంది.

Read Also: Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం

ఆర్సీబీ కంట్రోల్ బౌలింగ్.. 

భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ లతో కూడిన ఆర్‌సీబీ పేస్ గణం స్వింగ్, కంట్రోల్, లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయగలదు. గతంలో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 222 పరుగుల స్కోరును డిఫెండ్ చేసుకోగలిగింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టులో రా పేస్ (ఎక్కువ వేగం) ఉన్న బౌలర్లు ఉన్నప్పటికీ, ధర్మశాలలో స్పిన్నర్ల పాత్ర చాలా పరిమితంగా ఉండటం ఆ జట్టుకు మైనస్ కావచ్చు. గుజరాత్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సాధారణంగా వికెట్లు తీసినప్పటికీ, ఈ పిచ్ ఆయనకు పెద్ద పరీక్షగా మారనుంది. ఇటీవలి గణాంకాల ప్రకారం ఇక్కడ ఫాస్ట్ బౌలర్లే అత్యధిక వికెట్లు పడగొట్టారు.

టాస్ గెలిచిన జట్టుకే ఛాన్స్.. 

ధర్మశాల మైదానంలో టాస్ గెలవడం చాలా కీలకం కానుంది. ఈ సీజన్ లో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో చేజింగ్ చేసిన జట్లే రెండు సార్లు విజయం సాధించాయి. మ్యాచ్ జరిగే కొద్దీ బంతి మెరుపు తగ్గడం, రాత్రి పూట మంచు (Dew) కురవడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం మరింత ఈజీ అవుతుంది. మంగళవారం రాత్రి జరిగే మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ కచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ధర్మశాల హిస్టరీ ప్రకారం ఇది కేవలం బౌలర్ల మ్యాచ్ లా కాకుండా రన్‌ఫెస్ట్‌గా సాగే ఛాన్స్ ఉంది. అయితే పవర్‌ప్లేలో ఆర్సీబీ బౌలింగ్ బ్యాలెన్స్ గుజరాత్ కంటే కాస్త మెరుగ్గా ఉంది.