భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మలేషియా మాస్టర్స్ టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో 14వ ర్యాంకర్ కంటా సునేమయాపై ప్రణయ్ 25-23, 22-20తో గెలుపొందారు. కేవలం 60 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ప్రణయ్ ముగించాడు.


19వ ర్యాంకులో ఉన్న భారత్ మ్యాచ్ ప్రారంభంలోనే ఒక గేమ్ పాయింట్‌ను, చివర్లో రెండు గేమ్ పాయింట్స్‌ను ప్రణయ్ సాధించాడు. ప్రస్తుతం ఈ టోర్నమెంట్‌లో భారత్ తరఫున ఉన్నది కేవలం ప్రణయ్ మాత్రమే. సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ ఆంగస్ ఇంగ్ కా లాంగ్‌తో ప్రణయ్ తలపడనున్నాడు.


ప్రణయ్‌కు తనపై గొప్ప రికార్డు లేదు. ఈ సంవత్సరం ఇండోనేషియా ఓపెన్ 2022లో హెచ్ఎస్ ప్రణయ్ 16-21, 15-21తో చైనాకు చెందిన జావో జున్‌పెంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. బీడబ్ల్యూఎఫ్ సూపర్ 1000 ఈవెంట్ ఆడనున్న ఏకైక భారత ఆటగాడు కూడా ప్రణయ్‌నే. పీవీ సింధు, లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్ ఇప్పటికే టోర్నమెంట్ నుంచి వెనుదిరిగారు.