భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు ఆడుతున్న సంగతి తెలిసిందే. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తోనే టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. తన మొదటి మ్యాచ్‌లోనే శ్రేయస్ అర్థ సెంచరీ చేయడం విశేషం.


జట్టు స్కోరు 106 పరుగుల వద్ద పుజారా అవుట్ కావడంతో శ్రేయస్ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత 145 పరుగుల వద్ద కెప్టెన్ అజింక్య రహానే కూడా అవుట్ కావడంతో భారత్ నాలుగు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రవీంద్ర జడేజాతో కలిసి శ్రేయస్ జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 100కు పైగా భాగస్వామ్యం అందించారు.


శ్రేయస్ అయ్యర్‌తో పాటు జడేజా కూడా అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. శ్రేయస్ అర్థ సెంచరీపై నెటిజన్ల వద్ద నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. శిఖర్ ధావన్ కూడా ట్వీట్‌తో శ్రేయస్‌ను అభినందించాడు.