Gurnoor Brar Takes Wicket In First International Over: ఇండియా క్రికెట్లో సరికొత్త పేస్ సంచలనం. ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూ చేసిన 26 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ గ్రౌండ్లోకి బరిలోకి దిగడంతోనే వరల్డ్ క్రికెట్ అటెన్షన్ ఆకర్షించాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ మ్యాచ్ రెండో ఓవర్లోనే గుర్నూర్ చేతికి బంతిని అందించాడు. తన ఎక్స్ప్రెస్ పేస్తో మొదటి నాలుగు బంతుల్లోనే బ్యాటర్ను వణికించిన ఈ యంగ్ స్పీడ్స్టర్, ఐదో బంతికే ఆఫ్ఘనిస్తాన్ డేంజరస్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ను అవుట్ చేశాడు. గుర్నూర్ వేసిన పవర్ఫుల్ డెలివరీని జద్రాన్ మిస్హిట్ చేయడంతో ఇండియాకు ఫస్ట్ బ్రేక్థ్రూ లభించింది. ఈ అద్భుతమైన వికెట్ వీడియోను బీసీసీఐ (BCCI) తన అఫీషియల్ ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్తా సోషల్ media లో విపరీతంగా వైరల్ అవుతోంది.
వర్షం అంతరాయం, 25 ఓవర్లకు మ్యాచ్ కుదింపుధర్మశాలలో మ్యాచ్ ప్రారంభానికి ముందే భారీ వర్షం పడటంతో టాస్ పడటానికి చాలా గంటల టైమ్ పట్టింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా స్టార్ట్ అవ్వడం వల్ల అంపైర్లు ఆటను ఇరు జట్లకు చెరో 25 ఓవర్లకు కుదించారు. వెదర్ క్లియర్ అయిన తర్వాత ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా గుర్నూర్ బ్రార్తో పాటు 23 ఏళ్ల యంగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే కూడా వన్డే ఫార్మాట్లో ఇండియా తరఫున డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. టీమ్లోకి వచ్చిన కొత్త ప్లేయర్స్ ఇద్దరూ ఎంతో ఎనర్జిటిక్గా కనిపించారు.
అర్ష్దీప్ సింగ్ డబుల్ స్ట్రైక్, ఆఫ్ఘన్ కష్టాలు..మొదటి ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి అగ్రెసివ్ స్టార్ట్ ఇచ్చినప్పటికీ, రెండో ఓవర్లోనే గుర్నూర్ బ్రార్ వికెట్ తీసి కిక్అప్ ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్లో మరో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ కూడా విజృంభించాడు. సెడికుల్లా అటాల్ను డకౌట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే సెట్ అవుతున్న బ్యాటర్ రహ్మత్ షాను కూడా అర్ష్దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. గుర్నూర్, అర్ష్దీప్ ల పేస్ అటాక్తో టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో ఆఫ్ఘనిస్తాన్ టీమ్ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది.
ఆఫ్గాన్ ఓ మాదిరి స్కోరు..ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది.. ఓపెనర్ రహ్మానుల్ల గుర్భాజ్ స్టన్నింగ్ సెంచరీ (51 బంతుల్లో 102, 8 ఫోర్లు, 8 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో గుర్నూర్, దూబే వికెట్లతో సత్తా చాటాడు. నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ కు రెండేసి వికెట్లు దక్కాయి.
