Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
త్వరలో జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఇండియా టీమ్ కెప్టెన్ కానున్నట్లు తాజా సమాచారం.

Shreyas Iyer Set To Become New Indian T20I Captain: ఇండియా టీ20 క్రికెట్ లో మరో సంచలన మార్పుకు తెర లేవనుంది. టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ గెలిచిన కొద్ది నెలలకే సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడానికి బీసీసీఐ సిద్ధమైంది. అప్కమింగ్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు తీసుకోనున్నట్లు పలు కథనాల్లో వెల్లడైంది. ఆన్లైన్ లో జరగబోయే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ డెసిషన్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. సూర్య స్థానంలో నాలుగో నంబర్ బ్యాటర్ గా, లీడర్ గా శ్రేయస్ ను నియమించాలనే నిర్ణయం ఆల్రెడీ జరిగిపోయింది. అలాగే అక్షర్ పటేల్ ప్లేస్ లో యంగ్ ప్లేయర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్ గా ప్రమోట్ చేయనున్నారు.
సంజూ శాంసన్ కోసం గంభీర్ పట్టుబట్టినా..
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో సంజూ శాంసన్ ను టీ20 కెప్టెన్ చేయాలని గట్టిగా కోరుకున్నట్లు సమాచారం. అయితే బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దీనికి అంగీకరించలేదు. సెలెక్షన్ కమిటీలోని ఇతర మెంబర్స్ కూడా గంభీర్ ప్రతిపాదనతో విభేదించారు. శాంసన్ కెరీర్ లో కన్సిస్టెన్సీ లేకపోవడమే దీనికి మెయిన్ రీజన్ అని వాళ్లు భావించారు. వరల్డ్ కప్ గెలిపించడంలో సంజూ కీలక పాత్ర పోషించినప్పటికీ, అతడిని లాంగ్ టర్మ్ కెప్టెన్సీ ఆప్షన్ గా సెలెక్టర్లు చూడటం లేదు. అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇవ్వడానికి ఇది సరైన టైమ్ కాదని సెలెక్టర్లు స్పష్టం చేశాడు.
ఐపీఎల్ లో సాలిడ్ పర్ఫార్మెన్స్
వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్ లో లేని శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ లో మాత్రం అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్స్ కు తీసుకెళ్లిన శ్రేయస్, రీసెంట్ గా ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ లో కూడా బ్యాట్ తో మెరిశాడు. పంజాబ్ టీమ్ ప్లే ఆఫ్స్ చేరనప్పటికీ, శ్రేయస్ 14 మ్యాచుల్లో 168.81 స్ట్రైక్ రేట్ తో 498 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సాలిడ్ పర్ఫార్మెన్స్ వల్లే అతడికి కెప్టెన్సీ ఛాన్స్ దక్కింది.
రజత్ పాటిదార్ కు మళ్లీ నిరాశే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వరుసగా రెండు సార్లు ఐపీఎల్ చాంపియన్ గా నిలిపి, బ్యాటింగ్ లో కూడా ఇరగదీసిన రజత్ పాటిదార్ పేరును మాత్రం సెలెక్టర్లు అస్సలు కన్సిడర్ చేయలేదు. లీడర్ షిప్ రేస్ లో అతడికి చోటు కల్పించడంపై ఎలాంటి డిస్కషన్ జరగలేదని సోర్సెస్ ద్వారా తెలిసింది. కేవలం శ్రేయస్ అయ్యర్ ను మెయిన్ లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తూ టీమ్ ను ఫ్యూచర్ కోసం బిల్డ్ చేయాలని బోర్డు భావిస్తోంది. త్వరలోనే ఈ లైనప్ పై అఫీషియల్ ప్రెస్ నోట్ రానుంది.
ట్రెండింగ్ వార్తలు



















