Varun Chakravarthy: T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత ఖరీదైన భారత బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో అతను నాలుగు ఓవర్లలో 64 పరుగులు ఇచ్చాడు. దీంతో అందరి మదిలో ఒక ప్రశ్న మెదులుతోంది. ఇంత ఖరీదైన స్పెల్ తర్వాత చక్రవర్తిని ప్లేయింగ్ XIలో ఉంచుతారా? లేదా అతని స్థానంలో మరొక స్పిన్నర్‌ను తీసుకువస్తారా? మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రశ్నకు ప్రతిస్పందించాడు. 

ప్లేయింగ్ 11లో వరుణ్ చక్రవర్తి కాకుండా భారత్‌కు ఉన్న మరో ఆప్షన్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఈ ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఒక మ్యాచ్ ఆడి, ఒక వికెట్ తీసుకున్నాడు కుల్దీప్. కానీ కుల్దీప్ గురించి చర్చించే ముందు, కెప్టెన్ సూర్య వరుణ్ చక్రవర్తి గురించి ఏమన్నాడో చూద్దాం. 

వరుణ్ చక్రవర్తిపై సూర్యకుమార్ యాదవ్ ఏమన్నారు?

ప్రీ-ఫైనల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ, "వరుణ్ ఫామ్ గురించి మాకు ఆందోళన లేదు. ఇది టీమ్‌ గేమ్‌. మేము ఆట గెలవడంపై దృష్టి పెట్టాం. అతని ప్రదర్శన గురించి మేము పెద్దగా ఆలోచించం. మేము సెమీఫైనల్ గెలిచాం. అతను ప్రపంచంలోనే నంబర్ 1 బౌలర్, జట్టును ఎలా గెలిపించాలో అతనికి తెలుసు. మార్పుల గురించి రేపు చూద్దాం" అని అన్నారు.

సూపర్-8లో వరుణ్ చక్రవర్తి గణాంకాలు 

గ్రూప్ దశలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను నాలుగు మ్యాచ్‌ల్లో 12 ఓవర్లు బౌలింగ్ చేశాడు, 6.88 సగటుతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు 5.16, ఇది T20 క్రికెట్‌కు చాలా మంచిది. 

కానీ సూపర్ 8లలో చక్రవర్తి ప్రదర్శన పూర్తిగా మారిపోయింది. ఈ దశలో వరుణ్ నాలుగు మ్యాచ్‌లు ఆడాడు, 16 ఓవర్లు బౌలింగ్ వేశాడు. ఈ కాలంలో, అతను 46.50 సగటుతో నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఇంకా, అతని ఎకానమీ కూడా పూర్తిగా పడిపోయింది. చక్రవర్తి 11.62 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు.