Rohit Sharma Captaincy Issues With Gambhir And Agarkar:  ఇండియా క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ లీడర్లలో ఒకడైన రోహిత్ శర్మ ప్రెజెంట్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మైండ్ గేమ్ ను ఫేస్ చేస్తున్నాడు. అజిత్ అగార్కర్ లీడర్‌షిప్ లోని నేషనల్ సెలెక్షన్ కమిటీ వన్డే సెటప్ లో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కు లాంగ్ రోప్  ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ ప్లాన్ కు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. తన కెరీర్ లో 513 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడి, 20,289 రన్స్ తో పాటు 50 సెంచరీలు పూర్తి చేసిన రోహిత్ శర్మకు తన రిటైర్మెంట్ పై సొంతంగా డెసిషన్ తీసుకునే రైట్ ఉంది. అయితే 15 నెలల్లో జరగబోయే 2027 వన్డే వరల్డ్ కప్ కోసం బెస్ట్ టీమ్‌ను సెలెక్ట్ చేసే రైట్ సెలెక్టర్లకు కూడా ఉంది. లార్డ్స్ వన్డే తర్వాత ఇండియా సెప్టెంబర్ 27 వరకు ఎలాంటి వన్డే మ్యాచ్ లు ఆడదు. ఈ గ్యాప్ లో రోహిత్ తన ఫ్యూచర్ పై ఎలాంటి స్టెప్ తీసుకుంటాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

Continues below advertisement

Read Also: Cricket Legend Sir Garfield Sobers Demise: వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం!

గంగూలీ చాపెల్ వివాదం లాంటి సీన్లు.. రోహిత్ శర్మకు, గంభీర్-అగార్కర్ ద్వయానికి మధ్య మ్యూచువల్ ట్రస్ట్ కంప్లీట్ గా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఈ ముగ్గురూ స్ట్రాంగ్ మైండ్ ఉన్న వ్యక్తులు కావడం వల్ల వీరి మధ్య గ్యాప్ పెరిగింది. గతంలో రాహుల్ ద్రవిడ్ కోచ్ గా ఉన్నప్పుడు రోహిత్, అగార్కర్ లను కలిపి ఉంచే గ్లూ లా పనిచేశాడు. అందుకే 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్ లలో ఇండియా సక్సెస్ అయింది. కానీ గంభీర్ స్టైల్ ద్రవిడ్ కు కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటుంది. ప్రెజెంట్ రోహిత్ వర్సెస్ గంభీర్ బ్యాటిల్ చూస్తుంటే ఓల్డ్ టైమర్లకు 2005 నాటి సౌరవ్ గంగూలీ-గ్రెగ్ చాపెల్ వివాదం గుర్తొస్తోంది. ఐపీఎల్ 2024 లో వాంఖెడే ట్రైనింగ్ సెషన్ లో రోహిత్ స్వయంగా గంభీర్ దగ్గరకు వెళ్లి టీమ్‌లోకి రమ్మని అడగ్గా, నువ్వు కెప్టెన్ గా ఉంటేనే వస్తానని గంభీర్ అన్నాడు. కానీ న్యూజిలాండ్ సిరీస్ లో 0-3 ఓటమి తర్వాత వీరి మధ్య క్రాక్స్ స్టార్ట్ అయ్యాయి.

Continues below advertisement

Read Also: Hitman Records Alert: రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!

ఆస్ట్రేలియా టూర్ లో బ్రేక్‌డౌన్.. జనవరి 2 న సిడ్నీ టెస్ట్ మ్యాచ్ కు ముందు రోహిత్, గంభీర్, అగార్కర్ ల మధ్య ఎస్సీజీ గ్రౌండ్ లో సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది. ఫామ్ లో లేని రోహిత్ మ్యాచ్ నుంచి తప్పుకోవాలని అనుకున్నా, అగార్కర్ మాత్రం అలా చేస్తే నెక్స్ట్ ఇంగ్లాండ్ టూర్ కు సెలెక్షన్ కష్టం అవుతుందని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రోహిత్ టెస్టుల నుంచి రిటైర్మెంట్ అనౌన్స్ చేయాలని ఫిక్స్ అయ్యాడు కానీ బ్రాడ్‌కాస్టర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను ఇద్దరు పిల్లలకు తండ్రిని, నాకేది మంచిదో నాకు తెలుసు" అని కామెంట్ చేసి గంభీర్, అగార్కర్ లను షాక్ కు గురిచేశాడు. ఆ తర్వాత రోహిత్ లీడర్‌షిప్ లో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి, దుబాయ్ ఫైనల్ లో న్యూజిలాండ్ పై రోహిత్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ సెలెక్టర్లతో గ్యాప్ మాత్రం తగ్గలేదు. ఇంగ్లాండ్ టూర్ సెలెక్షన్ టైమ్‌లో రోహిత్ టూ మ్యాచులు మాత్రమే ఆడతానని చెప్పాడని సెలెక్షన్ కమిటీ సోర్సెస్ లీక్ ఇవ్వడం వల్ల వివాదం మరింత ముదిరింది.

వన్డే కెప్టెన్సీ నుంచి తొలగింపు.. ఒంటరి పోరాటం చేస్తున్న హిట్‌మ్యాన్ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన కేవలం ఏడు నెలల గ్యాప్ లోనే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి కంప్లీట్ గా తొలగించడం అతని నమ్మకాన్ని పూర్తిగా దెబ్బకొట్టింది. ఐపీఎల్ తర్వాత ఇండియాకు అసలు వన్డే మ్యాచులే లేకపోవడం వల్ల రోహిత్ కు గేమ్ టైమ్ దొరకలేదు, ఇందులో అతని తప్పేమీ లేదు. 2027 వరల్డ్ కప్ మైండ్ లో పెట్టుకుని ఫార్వర్డ్ అవుతున్నామని అగార్కర్ చెప్పినప్పుడు రోహిత్ తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యాడు. గంభీర్, అగార్కర్ ఇద్దరూ ఒకే పేజీలో ఉండి రోహిత్ ను పక్కన పెట్టాలని ప్లాన్ చేశారు. ఈ క్లారిటీ లేకపోవడం వల్ల రోహిత్ అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ దెబ్బతిని రీసెంట్ గా రన్స్ రాలేదు. తను కెరీర్ లోనే వరస్ట్ ఇన్నింగ్స్ ఆడిన రోజే టీమ్ నుంచి మూవ్ ఆన్ అవుతున్నట్లు స్టోరీలు రావడం హిట్‌మ్యాన్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని తెలుస్తోంది. ఏదేమైనా మరో రెండు రోజుల్లో హిట్ మ్యాన్ కెరీర్ పై స్పష్టత రానుంది.