India Seek Series Victory Amid Fitness Concerns:  బర్మింగ్‌హామ్ వన్డేలో సిక్స్ వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి త్రీ-మ్యాచుల సిరీస్ లో 1-0 లీడ్ సాధించిన టీమిండియా, ఇప్పుడు కార్డిఫ్ వేదికగా గురువారం జరగబోయే సెకండ్ వన్డేలో ఇంగ్లాండ్ ను ఢీకొట్టడానికి రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లాక్ చేయాలని ఇండియా చూస్తున్నా, టీమ్ ను కొన్ని మేజర్ ఇష్యూస్ కలవరపెడుతున్నాయి. ఫస్ట్ వన్డేలో 80 రన్స్ వద్ద బ్యాటింగ్ చేస్తున్న టైమ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్రమైన పెయిన్ తో గ్రౌండ్ నుంచి వెనుదిరిగాడు. అది కేవలం కండరాలు పట్టేయడం మాత్రమే కావాలని టీమ్ ఆశిస్తోంది. గతంలో కోల్‌కతాలో సౌతాఫ్రికాతో జరిగిన ఫస్ట్ టెస్ట్ లోనూ గిల్ ఇలాగే మధ్యలో వెళ్ళిపోయి హాస్పిటలైజ్ అయ్యాడు. కెప్టెన్ గా, ఓపెనర్ గా గిల్ ప్రెజెన్స్ టీమిండియాకు మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాలి.

Continues below advertisement

Read Also: ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..

రోహిత్ శర్మ పొజిషన్ పై పెరిగిన విమర్శలు.. మరో ఎండ్ లో ఓపెనర్ రోహిత్ శర్మకు ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేకపోయినా, అతని బ్యాటింగ్ ఫామ్ పై మేనేజ్‌మెంట్ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత రోహిత్ తన అగ్రెసివ్ ఆటతీరును మార్చుకున్నా, ఆ కొత్త అప్రోచ్ వల్ల పెద్దగా రన్స్ రావడం లేదు. లాస్ట్ అక్టోబర్ నుంచి ఆడిన 13 వన్డేల్లో రోహిత్ 46.91 యావరేజ్ తో 563 రన్స్ చేశాడు. ఇది మంచి రికార్డే అయినా, ప్రెజెంట్ టీమ్ లో కెప్టెన్సీ సేఫ్టీ నెట్ లేకపోవడంతో ప్రతీ మ్యాచ్ లో రోహిత్ రన్స్ చేయడం కంపల్సరీగా మారింది. 39 ఏళ్ల ఏజ్ లో ఉన్న రోహిత్ కు వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఎందుకంటే బెంచ్ పై ఎక్స్‌ప్లోసివ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ మాత్రం అక్టోబర్ 2025 నుంచి 10 మ్యాచుల్లో 77.62 సాలిడ్ యావరేజ్ తో 621 రన్స్ చేసి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

Continues below advertisement

Read Also: 2027 ODI World Cup Plan: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..

బూమ్ బూమ్ బుమ్రా మ్యాజిక్ కంబ్యాక్.. అక్షర్ సుందర్ ల ఆల్‌రౌండ్ షోఇండియాకు బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మళ్లీ వన్డే ఫార్మాట్ లోకి వచ్చి ఫస్ట్ మ్యాచ్ లోనే అద్భుతమైన స్పెల్ వేశాడు. ఐపీఎల్ లో రిథమ్ కోల్పోయి వికెట్ల కోసం స్ట్రగుల్ అయిన బుమ్రా, ఇప్పుడు మళ్లీ తన పాత మ్యాజిక్ ను రీగెయిన్ చేసినట్లు కనిపించాడు. అతనితో పాటు ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లు బ్యాటింగ్, బౌలింగ్ లలో ఫుల్ ఫామ్ లోకి రావడం మేనేజ్‌మెంట్ కు విపరీతమైన హ్యాపీనెస్ ఇస్తోంది. వీరిద్దరూ ప్రెజెంట్ వన్డే సెటప్ లో ఇండియాకు మెయిన్ పిల్లర్స్ లా మారారు.

బ్రార్ ప్లేస్ లో అర్ష్‌దీప్ సింగ్ ఎంట్రీఈ పిచ్ బౌన్స్, క్యారీకి ప్రసిద్ధి చెందింది కాబట్టి పేసర్లకు ఇక్కడ మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఈ కండిషన్స్ ను బట్టి ఫస్ట్ మ్యాచ్ లో 9 ఓవర్లలో 61 రన్స్ ఇచ్చి టూ వికెట్లు తీసిన యంగ్ పేసర్ గుర్నూర్ బ్రార్ ప్లేస్ లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ను ప్లేయింగ్ ఎలెవన్ లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే అర్ష్‌దీప్ వస్తే లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మళ్లీ బెంచ్ కే పరిమితం కాక తప్పదు. మరోవైపు 2025 నుంచి ఆడిన 19 వన్డేల్లో 13 ఓటములతో సఫర్ అవుతున్న హ్యారీ బ్రూక్ లీడర్‌షిప్ లోని ఇంగ్లాండ్ టీమ్ ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. కార్డిఫ్ లో ఇంగ్లాండ్ కు మంచి ట్రాక్ రికార్డ్ ఉందని, ఇక్కడ ఆడిన 17 మ్యాచుల్లో 10 విక్టరీలు కొట్టి కేవలం మూడు మాత్రమే ఓడిపోయిందని గ‌ణాంకాలు చెబుతున్నాయి.