IND vs PAK T20 World Cup 2026: హిస్టరీ రిపీట్.. పాక్ను చిత్తు చేసిన భారత్- 61 పరుగుల తేడాతో ఘన విజయం
India beats Pakistan by Runs | కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో పాకిస్తాన్ పై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

IND vs PAK T20 World Cup 2026 | కొలంబో: హిస్టరీ రిపీట్ అయింది. పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచులో సూర్యకుమార్ సేన పరుగుల తేడాతో పాక్ జట్టును చిత్తు చేసింది. దాంతో టీమిండియా ఖాతాలో హ్యాట్రిక్ విజయం నమోదు కాగా, టోర్నీలో పాక్ జట్టుకు తొలి ఓటమిని భారత్ రుచి చూపించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. భారత్ నుంచి ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77 పరుగులు, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఛేజింగ్ కు దిగిన పాక్ జట్టు ఏ దశలోనూ రాణించలేదు. 18 ఓవర్లలో 114 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. కీపర్ ఉస్మాన్ ఖాన్ చేసిన 44 పరుగులే అత్యధిక స్కోరు కాగా, సగానికి పైగా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. చివర్లో షాహిన్ ఆఫ్రిది (19 బంతుల్లో 23 నాటౌట్) పోరాటంతో పాక్ పరువు దక్కే స్కోరు చేయగలిగింది. కానీ భారత్ చేతిలో ఓటమితో పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో తొలి పరాభవాన్ని ఎదుర్కొంది.
c Shivam Dube ✖️ 2️⃣
— BCCI (@BCCI) February 15, 2026
Kuldeep Yadav and Tilak Varma with the wickets and #TeamIndia have 7️⃣ 💪
Updates ▶️ https://t.co/IgYYH0TeR9 #T20WorldCup | #MenInBlue pic.twitter.com/QZnRdvCr5V
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, పాక్ జట్లు 9 సార్లు తలపడగా టీమిండియా 8 మ్యాచ్లలో విజయం సాధించగా.. పాక్ ఒక్క మ్యాచ్ నెగ్గింది. ఓవరాల్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 17 మ్యాచులలో ఈ జట్లు తలపడగా భారత్ 14 నెగ్గగా, ఒక్క మ్యాచ్ పాక్ గెలిచింది. ప్రత్యర్థి పాక్ అయితే విజయం టీమిండియాదే అని మరోసారి ప్రూవ్ చేసింది డిఫెండింగ్ ఛాంపియన్.

ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అద్భుతం..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే తొలి ఓవర్లో అవుట్ అయ్యాడు. అయితే, ఇషాన్ కిషన్ (77 పరుగులు, 40 బంతుల్లో) వీరోచిత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఇషాన్, తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్కు 87 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

పిచ్ పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న పాక్, ఏకంగా 18 ఓవర్ల పాటు స్పిన్నర్లతో అటాక్ చేసి భారత పరుగుల వేగాన్ని కట్టడి చేసింది. ఇషాన్ అవుట్ అయ్యాక ఇన్నింగ్స్ నెమ్మదించినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), శివమ్ దూబే (27), ఆఖర్లో రింకూ సింగ్ (11) మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. పాక్ బౌలర్లలో సయీమ్ అయూబ్ 3 వికెట్లతో రాణించగా, సల్మాన్ ఆగా, ఉస్మాన్ తారిక్, షాహీన్ అఫ్రిదీ తలో వికెట్ తీశారు.

తొలి ఓవర్లోనే పాక్ జట్టుకు షాక్..
ఛేజింగ్ కు దిగిన పాక్ జట్టుకు హార్దిక్ పాండ్యా షాకిచ్చాడు. ఇన్నింగ్స్ 4వ బంతికే ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ ఆడిన బంతిని రింకూ క్యాచ్ పట్టడంతో సెలబ్రేషన్ మొదలైంది. తరువాత ఓవర్లో బుమ్రా మరో ఓపెనర్ సాయిబ్ అయుబ్ (6) వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. కెప్టెన్ సల్మాన్ ఆగా (4) విఫలమయ్యాడు. బుమ్రా బౌలింగ్ లో షాట్ ఆడిన బంతిని హార్దిక్ క్యాచ్ అందుకున్నాడు. బాబర్ ఆజం (5) ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు.
34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన పాక్ జట్టును కీపర్ ఉస్మాన్ ఖాన్ (44) ఆదుకునే ప్రయత్నం చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఉస్మాన్ ఖాన్ స్టంపౌట్ అయ్యాడు. తరువాత వరుసగా వికెట్లవేట కొనసాగింది. చివర్లో షాహిన్ ఆఫ్రిది (23 నాటౌట్) కాసేపు పోరాడటంతో పాక్ జట్టు 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. లేకపోతే స్కోరు వంద కూడా దాటేది కాదు. భారత బౌలర్లలో పాండ్యా, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు తలో 2 వికెట్లు పడగొట్టారు. తిలక్ వర్మ, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.





















