T20 world cup 2026 | న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బంగ్లాదేశ్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలన్న డిమాండ్‌ను అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ఐసీసీ తాజా భద్రతా సమీక్ష నివేదికలో భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు తీవ్రమైన ముప్పు లేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ తప్పనిసరిగా భారత్‌లోనే తమ అన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని పేర్కొంది.

Continues below advertisement

భారత్‌లో బంగ్లాదేశ్ ఎందుకు ఆడకూడదనుకుంటోంది ?

వాస్తవానికి, దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ భారత్‌లో కొంతమంది ఆటగాళ్లకు, పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌కు భద్రతాపరమైన ముప్పు ఉందని పేర్కొన్న సమయంలో బంగ్లాదేశ్ ఈ డిమాండ్ చేసింది. ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకుంటే భద్రతాపరమైన ప్రమాదం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ ప్రకటనల తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని తమ మ్యాచ్‌ల వేదికను మార్చాలని, తాము భారత్‌లో ఆడాలని భావించడం లేదని తెలిపింది. 

Continues below advertisement

ఐసీసీ భద్రతా నివేదికలో ఏముంది?

అయితే, ఐసీసీ స్వతంత్ర భద్రతా సంస్థలు నిర్వహించిన విచారణలో ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందని భావించలేదు. ఐసీసీకి చెందిన ఒక అధికారి పీటీఐతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారత్ వెలుపలకు మార్చడానికి వీలుగా నివేదికలో బలమైన కారణం లేదు. నివేదిక ప్రకారం, మొత్తం టోర్నమెంట్ సమయంలో భారతదేశంలో భద్రతా స్థాయి 'తక్కువ నుండి మధ్యస్థం' వరకు ఉంది. ఈ స్థాయి ఏదైనా ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్‌కు సాధారణంగా ఉంటుంది. ఐసీసీ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), స్థానిక అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను నిరంతరం బలోపేతం చేస్తోందని అధికారి స్పష్టం చేశారు. గతంలో కూడా భారత్‌లో పలు అంతర్జాతీయ టోర్నమెంట్‌లు విజయవంతంగా, ఏ లోపాలు లేకుండా సురక్షితంగా నిర్వహించారు.

షెడ్యూల్‌ను మార్చే అవకాశాలు చాలా తక్కువ

అదే సమయంలో, ఐసీసీ తమ డిమాండ్‌ను పూర్తిగా తిరస్కరించిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇంకా వెల్లడించలేదు. జట్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని తాము అభ్యర్థన చేశామని, ఇంకా ఐసీసీ అధికారిక సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని బీసీబీ చెబుతోంది. అయితే కొన్ని నివేదికల ప్రకారం, ప్రస్తుత షెడ్యూల్‌లో మార్పులు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది.

ముస్తాఫిజుర్ వివాదంతో పెరిగిన ఉద్రిక్తత

 ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేసిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. దీని తరువాత, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ విషయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిషేధించింది. ఇప్పుడు ఐసీసీ వైఖరి తరువాత, బంగ్లాదేశ్ టీ20 ప్రపంచ కప్ లో తమ అన్ని లీగ్ మ్యాచ్‌లను భారత్‌లోనే ఆడాల్సి ఉంటుందని స్పష్టమైంది. అందుకు వారు సిద్ధంగా లేకపోతే మాత్రం టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లా జట్టు నిష్క్రమించినట్లే. 

Also Read: రెండో వన్డేలో టీమిండియాలో భారీ మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్