Deepti Sharma Milestone: దీప్తి స్పిన్ మ్యాజిక్: హిస్టారికల్ 350 వికెట్ల క్లబ్లోకి ఎంట్రీ! దాయాదిపై ఫైవ్ వికెట్ హాల్
పాకిస్తాన్ పై రెండు వికెట్లు తీయడం ద్వారా దీప్తి శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్లో 350 వికెట్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 5 వికెట్లతో సత్తా చాటింది.

Deepti Sharma Reaches Historic 350 Wickets Milestone: ఇండియా స్టార్ స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఆదివారం జరిగిన మ్యాచ్లో ఒక అరుదైన ఘనత సాధించింది. ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 350 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన రెండో క్రికెటర్గా దీప్తి నిలిచింది. ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందు 349 వికెట్లతో ఉన్న దీప్తి, పాకిస్తాన్పై తన మొదటి రెండు ఓవర్లలోనే కేవలం ఐదు రన్స్ ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసింది. ఈ క్రమంలో 350 మార్కును క్రాస్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఇండియా లెజెండ్ జులన్ గోస్వామి 355 వికెట్లతో టాప్లో ఉంది. ఇక ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన దీప్తి 354 వికెట్లతో ఆమె రికార్డుకు ఒక్క అడుగు ఉంది.
4️⃣ overs
— BCCI Women (@BCCIWomen) June 14, 2026
1️⃣0️⃣ runs
5️⃣ WICKETS 💥
𝗔𝗯𝘀𝗼𝗹𝘂𝘁𝗲𝗹𝘆 𝗽𝗵𝗲𝗻𝗼𝗺𝗲𝗻𝗮𝗹 from Deepti Sharma who records her career-best T20I bowling figures 🫡
Scorecard ▶️ https://t.co/1tfRc3jcrX#TeamIndia | #WomenInBlue | #T20WorldCup | @Deepti_Sharma06 pic.twitter.com/LmgXXfZ5kM
పాక్ ఓపెనర్ల జోరుకు బ్రేక్ వేసిన దీప్తి
మ్యాచ్లో పాకిస్తాన్ ఓపెనర్లు ఇండియాపై అత్యుత్తమ ఓపెనింగ్ పార్టనర్షిప్ (38 రన్స్) నమోదు చేసి మంచి జోరు మీద కనిపించారు. ఈ టైమ్లో ఐదో ఓవర్లో బౌలింగ్కు వచ్చిన దీప్తి శర్మ, తన ఫ్లైట్ ఇంకా పేస్ వేరియేషన్స్తో వెంటనే ఇంపాక్ట్ చూపించింది. మునీబా అలీని ఇబ్బంది పెట్టిన దీప్తి, ఆ తర్వాత గుల్ ఫిరోజాను బోల్తా కొట్టించింది. రివర్స్ స్వీప్ ఆడబోయిన ఫిరోజా.. బ్యాక్వర్డ్ పాయింట్లో భారతి ఫుల్మాలికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. దీంతో ఇండియాకు అవసరమైన ఫస్ట్ బ్రేక్ త్రూ లభించింది.
స్మార్ట్ బౌలింగ్తో కట్టడి
ఏడో ఓవర్లో మళ్ళీ బౌలింగ్కు వచ్చిన దీప్తి, పాకిస్తాన్ రన్ రేట్ను పూర్తిగా కంట్రోల్ చేసింది. అంతకుముందు ఓవర్లో ఆయేషా జాఫర్ రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్లో ఉన్నప్పటికీ, దీప్తి తన లైన్ అండ్ లెంగ్త్తో ఆమెను కట్టడి చేసింది. స్వీప్ షాట్ ఆడేలా ప్రేరేపించి షార్ట్ ఫైన్ లెగ్లో స్మృతి మంధానకు దొరికిపోయేలా చేసింది. మంధాన లో-క్యాచ్ పట్టడంతో ఆయేషా జాఫర్ ఇన్నింగ్స్ ముగిసింది. తన మొదటి రెండు ఓవర్లలోనే మ్యాచ్ను ఇండియా వైపు తిప్పేసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.
జులన్ రికార్డు వేటలో దూకుడు
ఎడ్జ్బాస్టన్ పిచ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తున్న వేళ, దీప్తి శర్మ మరో మూడు వికెట్లు తీసింది. జులన్ గోస్వామి పేరిట ఉన్న 355 వికెట్ల రికార్డును తర్వాతి మ్యాచ్ లోనే దీప్తి బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. టోర్నమెంట్లో ఇండియాకు అత్యంత కీలకమైన బౌలర్గా దీప్తి తన వాల్యూను మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కాథరిన్ స్కివర్ బ్రంట్ (335), ఎల్లీస్ పెర్రీ (332) లాంటి స్టార్ ప్లేయర్ల కంటే దీప్తి ఎంతో ముందుంది. స్పిన్కు సపోర్ట్ చేసే కండిషన్స్ ఉంటే దీప్తిని ఆపడం ఏ టీమ్కైనా కష్టమేనని విశ్లేషకులు చెప్తున్నారు. ఓవరాల్ గా టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ దమ్యాచ్ అవార్డును దీప్తి కైవసం చేసుకుంది.
ట్రెండింగ్ వార్తలు



















